Tuesday, December 31, 2019

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Monday, December 30, 2019

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష..

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు.


నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...సీఎం జగన్,కన్నా లక్ష్మీనారాయణ(File Photos)
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 27, 2019, 5:26 AM IST
SHARE THIS:



ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. నేటి ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది.

కాగా, ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవ రాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు. సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు.

అమరావతి అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి

అమరావతి  అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి
30-12-2019 04:25:03

 కేంద్రంతో మాట్లాడే చెప్తున్నా
 రాజధాని రాష్ట్ర నిర్ణయమే..
 కానీ ఇప్పుడు మార్పు కుదరదు
 అమరావతికి రూ.8వేల కోట్లు చాలు
 బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెల్లడి
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్రంతో చర్చించే ఈ మాట చెప్తున్నా. కేంద్రం అధికారాలేంటో అవసరమై న సందర్భంలో చెప్తాం’ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉద్ఘాటించారు. అమరావతి తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ అంగీకారం ఉందన్న వైసీపీ వర్గాల మాటలకు అర్థం లేదన్నారు. ఇలాంటి మూ డు రాజధానుల పనికి ఎవరైనా మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేదో రెండు జిల్లాల ప్రజలు, రైతుల సమస్య కాదని, మొత్తం 13 జిల్లాల రైతుల సమస్య అని పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం రాజధాని ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


అ నంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే వేలకోట్లు ఖర్చుచేశారన్నారు. అమరావతిలో రాజధా ని పెట్టాలని ఆరోజు రైతులు అడగలేదని, నాటి ప్ర భుత్వం, ప్రతిపక్షం, ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిం చి పెట్టారన్నారు. ఆనాడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డే.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలన్నారని గుర్తు చేశారు. ‘ఆ రోజు ప్రభుత్వం వద్ద డబ్బులేక భూసేకరణ పద్ధతిలో కాకుండా.. భూసమీకరణ విధానంలో వెళ్లింది. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. దాదాపు 34వేల ఎకరాలకు అది సుమారు రూ.1.5లక్షల కోట్లు అవుతుంది’ అని సుజనా అన్నారు. రేపు విశాఖపట్నం రైతు కూడా సుఖంగా ఉంటారని చెప్పలేమన్నారు.

రాష్ట్ర నిర్ణయమే అయినా..
రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైతే వాటి రాజధానుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోవాల్సి రావడంతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తామన్నారు. ఆనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా జగన్‌, వైసీసీకి చెందిన ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలా పంపాకే కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. ఇక్కడ రాజధాని ఉందన్న కారణంతోనే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ పథకం కింద ఎంపిక చేసి వెయ్యికోట్లు ఇచ్చింది.

అదేవిధంగా 130 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు కొన్నాయి. రూ.940 కోట్లకు 1293 ఎకరాలను కొనుగోలు చేయగా... అందులో రూ.540కోట్లను ఆయా సంస్థలు ఇప్పటికే చెల్లించాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో ప్రజలకు ఫ్లాట్ల ప్రాజెక్టులో రూ.72 కోట్లు కొనుగోలుదారులు చెల్లించారు. 350 మంది అఖిలభారత సర్వీసు అధికారులు తమకిచ్చిన స్థలాలకు రూ.87.5 కోట్లు చెల్లించారు. అన్నింటికీ మించి రైతులు త్యాగాలు చేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న రాజధానిని ఇప్పుడు తరలిస్తామనేందుకు వీలులేదు. అలా తరలిస్తే అది దేశ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపిస్తుంది. కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయి. అవేంటో అవసరమైన సందర్భంలో చెప్తాం’ అని సుజనా స్పష్టం చేశారు.

అదనపు ఖర్చెందుకు?
‘అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని మంత్రులు చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి మరో రూ.8వేల కోట్లు సరిపోతాయి. ఇంకా అదనంగా కావాలంటే డబ్బులున్నప్పుడే చిన్నగా నిర్మించుకోవచ్చు. డబ్బుల్లేవని అంటున్న ప్రభుత్వం అసలు తరలింపు పేరుతో అదనపు ఖర్చు పెట్టడమెందుకు? ఇక్కడ సచివాల యం ఉంది. హైకోర్టు నడుస్తోంది. ఒకవేళ హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్లినా ఇబ్బంది లేదు. రాజ్‌భవన్‌ కూడా ఏర్పాటుచేశారు. గవర్నర్‌ ఏమైనా ఆ రాజ్‌భవన్‌ సరిపోవడం లేదన్నారా?’ అని సుజనాచౌదరి ప్రశ్నించారు. పొరపాట్లు జరుగుతుంటాయని, ఇప్పటికైనా వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు.

విజయసాయి స్థాయిలేని వ్యక్తి
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో తనపైనా ఆరోపణలు చేశారని, సీబీసీఐడీ అధికారులు తన గ్రామంలో కూడా తిరిగి విచారించారని సుజనాచౌదరి చెప్పారు. కానీ ఎక్కడా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట అసెంబ్లీలో కూడా పలువురి పేర్లు చదివిన ముఖ్యమంత్రి జగన్‌... తన పేరు చదవలేకపోయారని, ఏమైనా భయమేమో అని సుజన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా సీబీఐ విచారణ అంటున్నారని, అంటే రాష్ట్రంలో పనికిరాని సీబీసీఐడీ వ్యవస్థ ఉందని అర్థమా? అని ప్రశ్నించారు. విజయసాయిరె డ్డి మీపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్రపతికి ఫి ర్యాదు చేశారు కదా? అని ప్రశ్నించగా... ‘విజయసాయిరెడ్డి స్థాయి లేని వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో నా యకుడైన మనిషి. సీబీఐ విచారణ చేయాలని గతంలోనే స్వాగతించిన వ్యక్తిని నేను. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కేసు వేస్తే... అంతా స్టేకు వె ళ్లారు. నేను స్టేకు కూడా వెళ్లకుండా స్వాగతించా. సాక్షి పత్రికలోనే కోటి రూపాయల ప్రకటన ఇచ్చి... ఎవరైనా వచ్చి విచారించుకోవచ్చని చెప్పా’ అని గుర్తు చేశారు.

బుగ్గనపై పరువునష్టం దావా: రావెల
సుజనాచౌదరిపై విమర్శలు చేసే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని రావెల కిషోర్‌బాబు పేర్కొన్నా రు. సుజనా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ తో మాట్లాడి పలు నిధులను రాష్ట్రానికి తెచ్చారని, సాయిరెడ్డి రాష్ర్టానికి తెచ్చింది ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినట్లు మంత్రి బుగ్గన తనపై ఆరోపణలు చేశారని, మైత్రి సంస్థ పేరుతో తాను 40.48 ఎకరాలు కొన్నానని ఆరోపించారన్నారు. వీటికి ఆధారాలు బయటపెట్టాలని, లేకుంటే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని రావెల అన్నారు.
తలదన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు!
‘రాజధాని రైతులారా ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే... తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం!’’... ఇవీ రాజధాని రైతులను ఉద్దేశించి సుజనాచౌదరి చెప్పిన ఓదార్పు మాటలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఒక ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి మరో ప్రభుత్వం కుదరదంటే కోర్టులు చూస్తూ కూర్చోవన్నారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో నిబంధనలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. దాని ప్రకారం అభివృద్ధి చేస్తామంటేనే రైతులు భూములు ఇచ్చేందుకు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గితే రైతులు లక్ష కోట్లు అడిగే హక్కు ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడు వారు కోర్టుకు వెళితే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే ఏపీ ముగినిపోతుందని సుజన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, అక్రమాలకు వైసీపీ వారికి అవకాశం లేదనే విశాఖ మీద పడ్డారని ఆయన ఆరోపించారు.

ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం జగన్‌కులేదు

జగన్‌కు ఆ అధికారం లేదు
31-12-2019 04:14:30

అమరావతిని ముక్కలు చేస్తారా?.. రాజధానిపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి
ఆ భూములను సెజ్‌లకు ఇచ్చే కుట్ర
విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నేతలు
సీపీఐ నారాయణ
హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఏ మాత్రమూ లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని మొదట జగన్‌ కూడా అంగీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎక్కడా పేర్కొనలేదు. రాజధానిని మార్చాలంటే జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మించారని, రోడ్ల నిర్మాణం కూడా జరిగిందని, కాలువలు, చెరువులను పూడ్చేశారని తెలిపారు. ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చినా, వ్యవసాయం చేసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. మిగిలిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందన్నారు. వాటిని ఎలాగో రైతులు తీసుకోరని, దీంతో ఆ భూములను సెజ్‌లకు ఇవ్వవచ్చని జగన్‌ యోచిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి మిత్రులని, అందుకే ఒకరినొకరు మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లోని భూములకు రేట్లు పెరిగాయని, దీంతో జగన్‌కు కేసీఆర్‌ ధన్యవాదాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌గా మారిందని, అక్కడ ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నారాయణ అన్నారు. అమరావతిని కొనసాగించేదాకా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయన్నారు. భూ దొంగలను కాపాడే విషయంలో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని నారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నాయకులు మారిపోయారని, వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు.

అన్యాక్రాంతమైన భూములివే..
మధురవాడలోని సర్వే నం.331/5లోని 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో స్థానిక నాయకుల ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.28/2లో స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.161/1లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
కొమ్మాది సర్వే నం.7లో 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.154/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.7లో 50 ఎకరాలు మైటాస్‌ సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ మాయమైనా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తికి పరదేశిపాలెం సర్వే నం.66లో 35 ఎకరాలు భూదాన భూమి.
పెందగంట్యాడ సర్వే నం.274లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
గాజువాక సర్వే నం.87లో 1000 చదరపు గజాల భూమి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యుల ఆక్రమణ.
పెందుర్తి మండలం ముదపాక భూముల విషయంలో సిట్‌ నిర్ధారణ బయటపెట్టాలి.
పరదేశిపాలెం సర్వే నం.101/1లో నాలుగు ఎకరాల 89 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు
31-12-2019 04:44:19

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రజల్లో అభద్రతా భావం కలిగించిన ఎన్‌పీఆర్‌, ఎన్సార్సీలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో 13 జిల్లాల మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ‘లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు జగన్‌ విప్‌ జారీ చేయించారు. మద్దతుగా ఓటు వేయించారు. రాష్ట్రంలో ఆఘమేఘాల మీద గెజిట్‌తోపాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ మైనారిటీలను మోసం చేస్తున్నారు’ అన్నారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి టీడీపీకే ఉందని మైనారిటీ నేత హిదాయత్‌ పేర్కొన్నారు.

14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు


14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు
అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటించనున్నారు.

మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లె మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
గుంటూరు: రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలైన రైతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఐకాస నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి కోసం పోరాటం ఆగదని.. ప్రాణాలు అర్పించైనా రాజధానిని సాధిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది. 

ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం : బొత్స


ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు. ఉగాది నాటికి విజయనగరంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత వైకాపా ప్రభుత్వానిదని బొత్స అన్నారు.

రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్‌ లక్ష్యమని బొత్స వివరించారు. విమర్శలు చేసే ముందు తెదేపా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే మద్దాలి !

వంశీ బాటలో మద్దాలి !
జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే
పార్టీ అంగీకరించకపోతే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అడుగుతా: గిరి
ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం: తెదేపా

వంశీ బాటలో మద్దాలి !

ఈనాడు, అమరావతి: తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు... గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే, వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని మద్దాలి తెలిపారు. రాజధానిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రాజధానిపై మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నేను తెదేపా, చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రమే అంటున్నా. రాజధానిపై జనవరిలో కమిటీ నివేదిక వచ్చాక నాకు విషయం చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు అపోహపడనవసరం లేదు. రైతులందరితో మాట్లాడాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని మద్దాలి వ్యాఖ్యానించారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇసుక కొరతపై తెదేపా ఆందోళన చేసినప్పుడు ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, రాజధాని ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు మద్దాలి గిరిని లొంగదీసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.‘‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)ను ఎప్పుడు నియమించారు? ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్యతో ఉన్న స్నేహమే ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించడానికి కారణమా?’’ అని ధ్వజమెత్తారు.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం

అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని, అంత పకడ్బందీగా చట్టాలు, ఒప్పందాలున్నాయని... తెదేపా, భాజపా, ఆంధ్రా మేధావుల ఫోరం, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు, న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలించడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా సోమవారం అమరావతి రైతులు తుళ్లూరు, మందడంలో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు... వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

వ్యతిరేకిస్తే ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
మొండివాడు రాజు కన్నా బలవంతుడని అంటారు. అదే మొండివాడు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించే వారిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని కొందరు మాట్లాడుతున్నారు. 6 రాష్ట్రాల్లో అసలు హైకోర్టులే లేవనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాజధాని కోసం ఇప్పటికే 6 కమిటీలు చేశారు. ఇంకెన్ని కమిటీలు వేస్తారు?

- చలసాని శ్రీనివాస్‌,ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు

తుగ్లక్‌ పాలన ప్రత్యక్షంగా చూస్తున్నాం
తుగ్లక్‌ పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం. జగన్‌ పాలనతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీఎం మారగానే రాజధానిని మార్చడం తొలిసారి వింటున్నాం. జగన్‌ సీఎం పదవికి అనర్హుడు.

- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

మతిలేని పని
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందో లేదో గానీ.. అమరావతి నుంచి తరలిస్తే మాత్రం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ మతిలేని పని. అభివృద్ధి వికేంద్రీకరణ అందరికీ అంగీకారమే. న్యాయస్థానం మార్పుపై న్యాయవాదుల్ని అడిగారా?

- చలసాని అజయ్‌, న్యాయవాదుల ఐకాస నేత

విశాఖలో భూములు కొనేందుకే ఆగారా?
ప్రమాణస్వీకారం రోజే రాజధాని మారుస్తామని సీఎం జగన్‌ ఎందుకు చెప్పలేదు? విశాఖలో భూములు కొనడానికే ఈ 7 నెలలు ఆగారా? అమరావతి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? మంత్రి బొత్స ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజధాని తరలించవచ్చని ప్రధాని మోదీ ఆయన చెవిలో చెప్పారా?

- మాలతివాణి, భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాలు ఉన్నా లఖ్‌నవూ ఒక్కటే రాజధాని. అలాంటిది 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టడమనేది అవివేకం. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. రైతుల త్యాగాలను గుర్తించకపోగా వారిని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా?

- గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే తరలింపు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే రాజధాని తరలిస్తున్నారా? అని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు కుమారస్వామి, పి.శివాజీ ప్రశ్నించారు. 151 శాసనసభ స్థానాలు వచ్చాయని జగన్‌ కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత జేడీ రాజశేఖర్‌ అన్నారు. హైకోర్టును తరలించడానికి వీళ్లేమీ సుప్రీంకోర్టు కాదని శ్రామిక వికాస సంఘటన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు యజ్ఞనారాయణ పేర్కొన్నారు.

Sunday, December 29, 2019

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి - BV Raghavulu

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి 
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సవాల్‌

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి



విశాఖ: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అనడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పూర్తిస్థాయి రాజధానిని విశాఖ తరలించాలని సవాల్‌ విసిరారు. రాజధానిగా అమరావతి ఉండాలనే విషయంపై అన్ని రాజకీయపక్షాలు ఒకే మాటపై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడం సరికాదన్నారు. జనాభా లెక్కల గురించి తెలియని వాళ్లు అమరావతి విషయంలో సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ విశాఖ పర్యటనలో ఈ ప్రాంతం గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ అలా జరగలేదన్నారు.

Saturday, December 7, 2019

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’
07-12-2019 20:15:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, రాజ్యసభ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నేత  సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి.!  ఇవాళ టీడీపీకి చెందిన కీలక నేత బీద మస్తాన్ రావు ఆ పార్టీకి టాటా చెప్పేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీదమస్తాన్ రావు పార్టీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారని మంత్రి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు!.

మేం ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. అంతటితో ఆగని మంత్రి త్వరలో టీడీపీ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. అయితే అనిల్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ పార్టీ మారబోతున్నదెవరు..? అనిల్‌కు నిజంగానే సమాచారం ఉందా..? ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి టచ్‌లో ఉన్నారా..? అనే దానిపై మాత్రం మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Friday, December 6, 2019

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని పవన్‌ కల్యాణ్‌


బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
ఢిల్లీ బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్

Updated: Nov 15, 2019, 12:05 PM IST
కామెంట్ చేయండి | 
ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
File photo
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పవన్ మాత్రం అక్కడ కేంద్రంలోని పెద్దలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించి, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో భోదన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్... అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లి కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పవన్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలోనే  కేంద్రంలోని పలువురు పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.


పవన్ కళ్యాణ్  మోదీ

బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు.


బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్తిరుపతి సమావేశంలో పవన్ కళ్యాణ్
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 4, 2019, 2:47 PM IST
SHARE THIS:

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్... అదే జరిగి ఉంటే... వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారని.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. తెలుగ సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.





ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం - Chandrababu

ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం
06-12-2019 03:38:36

దుష్ప్రచారంతో అమరావతిని చంపేస్తున్నారు
ప్రసిద్ధ రాజధానిని కోరుకోవడం తప్పా?
నష్టం నాకు కాదు.. భావితరాలకే
రాజధాని అంటే ఆదాయం, ఉద్యోగాలు
విభజనతో ఒకసారి నష్టపోయాం
రాజధానిని పాడుచేసుకుని నష్టపోవద్దు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తున్నాయి
వర్సిటీలు, దాదాపు పూర్తయిన టవర్లు, పేదల ఫ్లాట్లు గ్రాఫిక్సేనంటారా?
రౌండ్‌ టేబుల్‌ భేటీలో బాబు ప్రశ్న
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మనకొక ప్రపంచస్ధాయి ప్రసిద్ధ రాజధాని ఉండాలనుకోవడం తప్పా.. అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో తాను తప్పు చేశానని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు అభిప్రాయపడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. చరిత్ర పొడవునా ఒక మంచి రాజధాని నగరం లేని దురదృష్టం ఆంధ్రులను వెన్నాడాల్సిందేనా అని వాపోయారు. గురువారం విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాలులో ప్రజా రాజధాని అమరావతిపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనకొక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకోలేమా? హైదరాబాద్‌లో సాధ్యమైంది అమరావతిలో ఎందుకు కాదు’ అని ప్రశ్నించారు. అక్కడ తన త ర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ సహా ఎవ రూ హైదరాబాద్‌ను చెడగొట్టలేదని.. ఆ ప్రణాళికల ను కొనసాగించారని తెలిపారు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందన్నారు. రకరకాల దుష్ప్రచారాల తో అమరావతిని చంపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘దానిని చంపేస్తే నాకొచ్చిన నష్టమేమీ లేదు. భావితరాలు, తెలుగు జాతి నష్టపోతాయి. ఒక పెద్ద రాజధాని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం, సంపద, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణకి వస్తున్న ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మహారాష్ట్రకు 57 శాతం ముంబై నుంచి వస్తోంది. నా కులం వారో.. నా బంధువులో ఉన్నారని హైదరాబాద్‌ కోసం శ్రమించానా? మొత్తం తెలుగు జాతి కోసం శ్రమించాను’ అని తెలిపారు.

స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలిచ్చారు..
‘భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాం. రైతులకు ఒక్క పిలుపు ఇస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చా రు. ఇంత కంటే మంచి నమూనా లేదని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ దీనిని అధ్యయన అంశంగా స్వీకరించింది. సింగపూర్‌లో అవినీతి మచ్చుకైనా కనిపించదు. నాపై కుదిరిన నమ్మకంతో అడిగిన వెంటనే మన రాజధానికి ప్రణాళిక తయారు చేసి ఇవ్వడానికి సింగపూర్‌ అంగీకరించింది. మన వద్ద స్టార్టప్‌ ఏరియాలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రెండున్నర లక్షల ఉ ద్యోగాలు సృష్టించాలని అనుకున్నారు. ఈ ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టింది. నాపై కోపం ఉంటే ఉండవ చ్చు. కానీ రాజధానిపైనా.. ఇక్కడకు రావాలనుకున్న సంస్థలపైనా కోపమెందుకు?. రాష్ట్ర ప్రజలు, యువత, మేధావులు ఆలోచించా లి. రాజకీయంగా మాతో విభేదించేవారు ఉండవ చ్చు. కానీ మీ దారిలో మీరు రాజధాని కోసం పోరాడండి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి.. విభజనతో ఒకసారి నష్టపో యాం. రాజధానిని పాడుచేసుకుని మరోసారి నష్ట పోవద్దు’

ప్రభుత్వ నిధులు అక్కర్లేదు..
‘ఏ పనికీ రోడ్డు తవ్వే అవసరమే ఉండదు. కరెం టు తీగల కోసం చెట్ల కొమ్మలు కొట్టే పని ఉండదు. చివరకు గ్యాస్‌, ఏసీ కూడా పైపులతో ఇంటింటికీ అందేలా ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్‌ స హా దేశంలో ఏ నగరంలో ఇన్ని వసతులు లేవు. ఇ ప్పటికి ఖర్చు చేసింది కాక అమరావతిలో పూర్తి స్థాయి వసతుల నిర్మాణానికి ఇంకా రూ.లక్ష కోట్లు కావాలి. దీనికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం చేతిలో 8 వేల ఎకరాల భూమి ఉంది. దానిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ ఆ నిధులతోనే ఈ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉండేది. ప్రపంచ బ్యాంకు నిధులివ్వడానికి ముందుకొచ్చింది. జగన్‌ ప్రభుత్వానికి ఆసక్తి లేదని వెనక్కి వెళ్లిపోయింది. ఏపీలో జగన్‌ మాదిరిగా పాత ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచిస్తూ జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిని ఈ దేశంలోకి వచ్చే పెట్టుబడులు తగ్గుతున్నాయని కేంద్రమే బాధపడే పరిస్థితి వచ్చింది’

అన్నిటినీ పోగొట్టారు..
‘రాష్ట్రంలో అమరావతి ఒక్కదానినే అభివృద్ధి చే యాలని మా ప్రభుత్వం అనుకోలేదు. పలు నగరాలను అభివృద్ధిచేసి వికేంద్రీకరణ జరపాలనుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యకు సమాధానమిచ్చారు. ‘ప్రముఖ కంపెనీ అదానీని ఒప్పించి విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా సెం టర్‌ పెట్టడానికి తీసుకొచ్చాం. అది వస్తే విశాఖ స్వరూపమే మారిపోయేది. దానిని పోగొట్టారు. విశాఖలో ఒక పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ పెట్టడానికి లులూ గ్రూప్‌ను తెచ్చాం. వాళ్లనూ పోగొట్టారు. మేం రాక ముందు తిరుపతిలో సెల్‌ఫోన్ల తయారీ లేదు.

ఇప్పు డు దేశంలో తయారయ్యే సెల్‌ఫోన్లలో 20-30 శా తం అక్కడే తయారవుతున్నాయి. ఏభై శాతానికి పెంచ డానికి రిలయన్స్‌ కంపెనీని తెచ్చాం. అదీ పోయింది. ప్రకాశం జిల్లాలో రూ.25 వేల కోట్లతో పే పర్‌ పరిశ్రమ తెచ్చాం. వాళ్లూ వెళ్లిపోయారు. ఎంతో పోటీ ఎదుర్కొని అనంతపురం జిల్లాకు కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. దానికంత సబ్సిడీ ఎందుకని మా ట్లాడారు. మనం ఇవ్వకపోతే దానిని ఎగరేసుకుపోవడానికి అప్పట్లో మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. కర్నూలుకు ఎయిర్‌ పోర్టు, సోలార్‌ పరిశ్రమలు, యూనివర్సిటీలు తెచ్చాం. అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి కట్టుబడే పనిచేశాం’ అని వివరించారు. అమరావతి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికలతో ఆకర్షితుడైన ప్రధాని మోదీ స్వయం గా ఫోన్‌ చేసి కజక్‌స్థాన్‌ దేశ రాజధాని అస్తానా (నూర్‌-సుల్తాన్‌)ను చూసి రావాలని కోరారని.. మ నం చేయగలమన్న నమ్మకం వల్లే ఇలాంటి సలహా ఇచ్చారన్నారు. ఇక్కడ ఆస్పత్రులు లేనందువల్ల హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తున్నట్లు జగన్‌ చెప్పారని.. రాజధానిని అభివృద్ధి చేసుకోకపోతే మన ఆస్పత్రులు ఏనాటికీ ఎదగలేవన్న సత్యాన్ని విస్మరిస్తున్నారనివ్యాఖ్యానించారు.






Thursday, November 21, 2019

రాజధాని మా ప్రాధాన్యం కాదు! ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాజధాని మా ప్రాధాన్యం కాదు!
22-11-2019 03:44:29

నగరాలు నిర్మించే స్థోమత లేదు
లండన్‌ కడతామని వాళ్లు అంటే దానికి మేము కట్టుబడక్కర్లేదు
నవరత్నాలకే సర్కారు ప్రాధాన్యం.. ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ పెద్ద స్కాం
పవర్‌ ఒప్పందాలు రద్దవలేదు.. పీపీఏపై కేంద్ర, రాష్ట్ర కోణాలు వేర్వేరు
ఉపాధి హామీ పథకాన్ని ఆపలేదు.. ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టీకరణ
హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యం కాదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. ‘‘లక్షల కోట్లు ఖర్చుపెట్టి నగరాలు నిర్మించే స్థోమత మా ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర రాజధానిని లండన్‌లా రూపొందిస్తామని ఒక ప్రభుత్వం అంటే, ఆ తర్వాతి ప్రభుత్వం, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలకు అడుగుకి 10వేల చొప్పున టీడీపీ ప్రభుత్వం వెచ్చించింది. వాటినేమైనా స్వర్గంలో కట్టా రా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనతో పా టు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా నవరత్నాల అమ లే తమ ప్రాధామ్యాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌ లేక్‌వ్యూ అతిథిగృహంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిపై తప్పుడు ప్రకటనలు చేశారని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఆరోపించారు. ‘‘హైదరాబాద్‌ను 400 ఏళ్ల కిందట కులీకుతుబ్‌షా మొదలు పెడితే, ఇప్పుడీ స్థితికి వచ్చింది. చెన్నై, ముంబై, న్యూయార్క్‌ వంటి నగరాలు అభివృద్ధి చెందడానికి ఎన్నేళ్లు పట్టింది? అలాంటిది హైదరాబాద్‌ తానే కట్టినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగైతే, కులీకుతుబ్‌షాతో పాటు ఆయన తర్వాతి పాలకులు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని బుగ్గన అన్నారు.

వారు చెప్పే ఆదాయమేది?
జగన్‌ ప్రభుత్వానికి సంపద ఎలా సృష్టించాలో తెలియదంటూ చంద్రబాబు చేసిన ఆరోపణను బుగ్గన ఖండించారు. ‘‘2014-15లో రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం 42,618కోట్లు, 2015-16లో 39,907కోట్లు, 2016-17లో 44,181కోట్లు ఆదాయం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2017-18లో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా పన్ను ఆదాయం పెరిగింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 49,486కోట్ల ఆదా యం వచ్చింది. 2018-19లో 58,031కోట్లు ఆదాయం వచ్చింది. ఆర్థిక మందగమనంతో అన్ని రాష్ట్రాల్లోలాగే ఏపీలో కూడా ఈసారి ఆదాయం మందగించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయ పెరుగుదల నిజమైతే రూ.97 వేల కోట్ల మేర ఉన్న అప్పుని రూ.2.40 లక్షల కోట్లకు ఎందుకు తీసుకెళ్లారు? టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి రూ.40వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అన్నారు.

ఆగమేఘాలపై ఒప్పందాలా?
ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌(ఓఎ్‌ఫసీ) ఓ పెద్దస్కాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా బుగ్గన అన్నారు. ‘‘ఓఎ్‌ఫసీ డిజైన్‌లో లోపాలున్నాయి. అందుకే నిలిపివేశాం. పవన విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2017లో ఆగమేఘాలపై 41 కంపెనీలతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అది కూడా 25 ఏళ్లపాటు ఎందుకు కొనసాగిస్తారు? యూనిట్‌కు రూ.2.50కు వచ్చే విద్యుత్తును రూ.4.80కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? మా ప్రభుత్వంతో ఆయా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రభుత్వానికి భారం తగ్గేలా ఒక రేటు ఖరారవుతుంది. పీపీఏలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ క్కోణాలు వేరువేరుగా ఉంటాయి’’ అని తెలిపారు.

మాదీ తెలంగాణ దారే..
‘‘తెలంగాణ ప్రభుత్వం లాగే తాము కూడా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించినా రెండు రకాల పన్నులు వేయడం వల్ల ఆదాయం తగ్గలేదు. 2018-19 అక్టోబరులో రూ. 13వేల కోట్ల ఆదాయం రాగా, ఈసారి కూడా ఇంతే ఆదాయం వచ్చింది’’ అని వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ పథకంలో నీరు-చెట్టు విభాగంలో మాత్రమే విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల్లో అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ ఫలితం 2020 మార్చిలో కనబడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.


రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారు: బుగ్గన
Nov 21, 2019, 19:14 IST
Buggana Rajendranath Lashes Out at Chandrababu baseless allegations - Sakshi
సాక్షి, హైదరాబాద్‌ : ‘చంద్రబాబు నాయుడు తరచు నోరు జారుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అనేకసార్లు టెండర్లు మార్చింది టీడీపీ ప్రభుత్వమే. కమీషన్ల కోసమే ఎక్కువ అంచనాలతో చంద్రబాబు పనులు అప్పగించారు. నాడు ఎక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థలే ఇప్పుడు తక్కువకు పనులు చేస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే పనులు అప్పగించాం. రివర్స్‌ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేస్తే తప్పా చంద్రబాబు’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిథి గృహంలో  గురువారం ఆయన మీడియా సమావేశంలో  పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, ఆయన బోధలు మారలేదంటూ.. సినిమా పాటను వినిపించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

మంత్రి మాట్లాడుతూ... ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. నీరు-చెట్టు పథకం పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది. ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ నేనే కట్టానని అంటున్నారు. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి చెందిన నగరాలు. చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ సింగపూర్‌ ప్రస్తావనే. నేనే గొప్పవాడినని చెప్పుకునేది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇసుక మీద కూడా టీడీపీ నేతలు ఇప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసింది అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కాదా?.





చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ఎక్కడికి వెళ్లినా బకాయిలే ఉన్నాయి. సూదికి, దూదికి బిల్లులు పెండింగే. ఆశావర్కర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంది. 2014-15 ఓన్‌ ట్యాక్స్‌ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగింది.  చంద్రబాబు  దిగిపోయే సమయంలో రూ.43 వేల పెండింగ్‌ బిల్లులు పెట్టారు. సివిల్‌ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తుంటే.. లిక్కర్‌ ధరల పెంపుపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 4380 మద్యం దుకాణాలను మూడువేలకు తగ్గించాం. పర్మిట్‌ రూమ్‌లను ఎత్తేశాం. దాదాపు 16 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.1990 ముందర ఇంగ్లీష్‌ కాలేజీలు లేవా? స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్‌ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండుతోంది. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్‌ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు లోకేష్‌, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్‌, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్‌ నేర్పించండి.

రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరేగా?. రూ.10 వేలు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు . నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారు. ఈ పనులపై విచారణ కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు.

Sunday, November 10, 2019

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆరు వరకే ఆంగ్లం!
10-11-2019 03:22:36

‘మీడియం’ ఉత్తర్వులో మార్పు.. తొలిదశలో 1 నుంచి 6 వరకు
అమలుకు సీఎం ఆదేశాలు
తర్వాతి దశలపై లేని స్పష్టత
పెదవి విరుస్తున్న భాషావేత్తలు
వెనుకడుగుగా భావించబోం
మరో గందరగోళ నిర్ణయమే
టీచర్లకు శిక్షణ, ఖర్చు నుంచి
వెసులుబాటుకే క్లాసుల కుదింపు
తెలుగు సంఘాల స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమంలో బోధనపై రాష్ట్రప్రభుత్వం తన నిర్ణయంలో మార్పు చేసింది. ఉత్తర్వుల్లో ఎనిమిదోతరగతి వరకు అని నిర్దేశించగా, ప్రస్తుతానికి ఆరో తరగతి వరకు వాటిని పరిమితం చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఆ తర్వాత దశల గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పాక్షికంగా సడలించింది. అయితే, ఇది మరో గందరగోళ నిర్ణయం తప్ప మరేమీ కాదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుకు తలెత్తిన ముప్పు తాజా సవరణతో కొంతైనా తొలగినట్టు కాదని, ఈ నిర్ణయాన్ని సర్కారు మెట్టు దిగడంలా భావించడంలేదని తెగేసి చెబుతున్నారు.

భాషోద్యమం తెచ్చిన ఒత్తిడిగా కూడా చూడటం లేదన్నారు. 7, 8 క్లాసులకే ప్రస్తుతానికి ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసి, 1-6తరగతి వరకు తరువాత ఆలోచిస్తామని ఉంటే.. భాషోద్యమం కొంత ఫలితం సాధించినట్టు భావించడానికి వీలుండేదని వివరించారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి ముందుగా టీచర్లకు భారీఎత్తున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, శిక్షణలో కొంత వెసులుబాటు పొందేందుకే ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసే క్లాసులను తొలిదశలో తగ్గించిందని వివరించారు. దీనివల్ల తర్ఫీదు పొందే టీచర్లసంఖ్య, దానివల్ల ఖర్చు కూడా తగ్గుతాయని గుర్తుచేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతివరకు పిల్లలకు మాతృభాషలోనే బోధన చేయాలనేది మౌలిక సిద్ధాంతమని, ఆ మేరకు ప్రభుత్వంలో ఇంతవరకు పునరాలోచనే కనిపించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ‘నాడు-నేడు’ లో భాగంగా ఏర్పాటు చేయాలని ఇదే భేటీలో సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎ్‌సఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని సూచించారు.

బేషజానికి పోవద్దు: పీడీఎఫ్‌
నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రెండు మాధ్యమాలనూ కొనసాగించాలి’ అని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌)... ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో బేషజానికి పోరాదని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ప్రాథమిక విద్య (1- 5 తరగతులు) వరకు మాతృభాషలో బోఽధన జరగాలని అందరూ కోరుతుంటే.. అందుకు విరుద్ధంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, వై.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘మంచి విద్యను బోధించడమంటే మాధ్యమాన్ని మార్చి చేతులు దులుపుకోవడం కాదు.

ఢిల్లీ, కేరళలో మాదిరిగా పాఠశాలల్ని, బోధన విధానాల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. వివక్షను రూపుమాపడం అంటే అందరు పిల్లలూ ఒకచోట చదువుకునే కామన్‌ స్కూలు విధానం తెచ్చేలా రాజకీయ ప్రధాన అజెండాలోకి విద్యా రంగాన్ని తీసుకుని రావాలి. సగానికి సగం ప్రాథమిక పాఠశాలల్ని దాదాపు ఎస్సీ, ఎస్టీ కాలనీల స్కూళ్లను ఏకోపాధ్యాయ పాఠశాలుగా మార్చి ‘ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాం.. ఇంకేం కావాలి’ అనడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలి. రెండు మాధ్యమాలను కొనసాగించాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతాం’’ అని స్పష్టం చేశారు.

Saturday, November 9, 2019

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)
06/11/2019 

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)

AP Govt
In the reference 1st read above, Government have issued orders for introducing English Medium with CBSE Syllabus in a Parallel Section from VI class in 6500 identified High Schools in the Government Sector (Govt/ZP/Municipal) in the State that are also proposed for strengthening under the Success Project.

2. In the reference 2nd read above, Government have issued orders for replacing CBSE syllabus with State Syllabus in all 6500 Success Schools from the academic year 2010-11.

3. In the reference 3rd read above, Government have delegated powers to the Commissioner of School Education, A.P. to open parallel English Medium sections in the existing high schools for classes VI to X. 4. In the reference 4th read above, Government have accorded permission to the Commissioner of School Education for opening of English Medium Parallel sections in Primary Schools from the Academic Year 2018-19.

5. The Commissioner of School Education has submitted a proposal for converting all Government, MPP Schools and Zilla Parishad schools and all classes into English Medium from Grades I to VIII from academic year 2020-21 and for Grades IX & X from academic year 2021-22.

6. After careful examination of the matter, Government hereby accord permission to the Commissioner of School Education to convert all Government, MPP Schools and Zilla Parishad schools and all classes into English Medium from classes I to VIII from the academic year 2020-21 and for classes IX & X from academic year 2021-22 in superseding the earlier orders issued in the matter.

However, the Commissioner of School Education shall take appropriate and adequate efforts to implement Telugu/Urdu as compulsory subject depending on the current medium of instruction in all the Schools compulsorily in line with the Government orders in the matter.

7. The Commissioner of School Education shall ensure the following steps for successful implementation of English medium schools:-

Required teachers should be deployed in the School as per the staffing pattern prescribed by the Government from time to time and as per pupil teacher ratio for single medium.
SCERT shall take necessary action for designing and development of Teacher Hand Books, Training of Teachers in English medium teaching skills and knowledge, Compendium of best classroom practices and other pedagogical material for supporting the teachers to be skilled in English Medium teaching.
Director SCERT in coordination with Commissioner of School Education shall take comprehensive action for online assessment of the current English proficiency levels of the Teachers, design appropriate training programs for enchasing the English Medium teaching skills for the teachers.
Intensive and extensive trainings must be ensured during the current academic year and during the Summer of 2020 for equipping the Teachers to teach in English Medium from academic Year 2020-21 for classes I to VIII. Number of trainings shall be given to the Teachers until improving their English Medium Teaching skills in specific subjects and in general.
Action shall be taken for reviving the English Language Teaching Centers & District English Centers (DECs) and re-locating them in District Institutes for Education & Training (DIETs).
Director, Text Book Press, should take action to obtain correct indents and ensure supply of English Medium Text Books to the Schools as per student enrolment for classes I to VIII well before the starting of the academic year.
Keeping in view of the conversion of all schools and classes from I to VIII into English Medium, requirement of Teachers can be arrived at and proposals should be submitted to Government by the Commissioner School Education.
In future, Teacher recruitments, qualified candidates with the best proficiency in English Medium teaching should be recruited.
8. The Commissioner of School Education, the State Project Director, SSA, the Director, SCERT, and the Director, AP Text Book Press shall take further necessary action accordingly.


AP government to introduce English medium for state schools
Our Bureau  Vijayawada | Updated on November 05, 2019  Published on November 05, 2019

Representative image   -  The Hindu

The Andhra Pradesh Government is set to introduce English medium in government schools right for first to eighth standard starting from the next academic year.

Education Minister A. Suresh told the media at Amaravati on Tuesday that earlier in the day Chief Minister Y.S Jaganmohan Reddy had conducted a review on "Naadu-nedu" (Then and now) programme which will introduced from November 14- Children's Day.

He said under the programme, to be launched by the Chief Minister in Prakasam district , the basic amenities in schools will be improved and in the first phase it would be taken up in 15,000 schools. This phase would be completed by March 2020, and in the next phase remaining schools will be taken up, the total number being around 40,000 .

He said it was decided to introduce instruction in English medium in all government schools . But Telugu will not be neglected and be made a compulsory subject. From the next academic year, instruction in English will begin . In subsequent years, it will be extended to cover the ninth and tenth standards as well. Teachers will be trained to teach in English and new teachers to be recruited would be tested for their proficiency in English.

Suresh said the idea was to make students competent to fare better in competitive exams and also to prepare them for sectors such as software and IT.

It may be noted that the previous Telugu Desam Government also toyed with the idea of introducing English medium right from the primary level and even a GO was issued, but it could not be implemented, as there was resistance from different quarters including associations of teachers.  



English medium to be implemented in all Andhra govt schools
The government's decision has evoked criticism from a section of academicians and teachers.
IANS
 Thursday, November 07, 2019 - 09:44

The Andhra Pradesh government's decision to introduce English as the medium of instruction in all government schools has triggered a controversy with a section of academicians and teachers opposing the move.

The Y S Jagan Mohan Reddy-led government in Andhra Pradesh has announced converting all government, Mandal Praja Parishad (MPP) and Zilla Parishad (ZP) schools into English medium schools.

According to an order issued by the School Education Department, English will be the medium of instruction from first to eighth standard from the academic year 2020-21. For class IX and X, English will be the medium of instruction from 2021-22.

However, Telugu or Urdu will be a compulsory subject in all the schools. The government's decision has evoked criticism from a section of academicians and teachers.

Katti Narasimha Reddy, a member of the Andhra Pradesh Legislative Council, found fault with the move, saying that it went against the recommendation of the Kasturi Rangan Committee that teaching should be in mother tongue, at least in primary classes.

The legislator from teachers' constituency said that converting all government schools into English medium schools was also deviation from the proposed national education policy.

The YSRCP government has came under criticism for introducing English as the medium of instruction without doing the necessary ground work.

Teachers of government-run Telugu and Urdu medium schools opposed the move, saying they lacked the necessary skills to teach in English.

"As the new academic year starts in June, we have just eight months in hand which is not sufficient to prepare ourselves for the new task," said a teacher in Vijayawada.

Meanwhile, the United Teachers' Federation (UTF) condemned the government order and demanded that Telugu medium schools should continue.

UTF state President Sheikh Saabji said that scrapping Telugu as the medium of instruction in all government schools is not a proper decision.

"How can the government remove Telugu as the medium of instruction in a Telugu speaking state and replace it with English," asked UTF General Secretary Babu Reddy.

The teachers' body feared that introduction of English as the medium of instruction will hit the education of students, especially those coming from the weaker sections of the society, and increase the dropout rate.

However, the commissioner of school education will take appropriate and adequate efforts to implement Telugu or Urdu as a compulsory subject depending on the current medium of instruction in all the schools compulsorily in line with the government orders.

Monday, September 16, 2019

కోడెల శివప్రసాదరావు

హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాపై బాంబు దాడి జరిగింది
17-12-2015 16:06:05

డాక్టర్. కోడెల శివప్రసాదరావు.. టీడీపీలో సీనియర్ నేత.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్పీకర్

ఆయన.. ఎవరూ ఊహించని రీతిలో సోమవారం(16-09-2019) ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ

వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్‌లోని ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. ప్రభుత్వం తనను

కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తోందంటూ ఆయన బాహాటంగానే

పలుమార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆయన మరణ వార్త తెలిసి.. టీడీపీ నేతలు, కార్యకర్తలు,

అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... గత ఎన్నికల్లో అనూహ్యంగా

ఓటమి పాలయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు.. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కోడెలను..

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కోడెలకు ఎన్టీఆర్ టికెట్ ఆఫర్ ఇచ్చారు. అలా మొదటిసారి

1983లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు.. 1987లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. ఎన్టీఆర్,

చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండే కోడెల.. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి కూడా

సేవలందిస్తూ వస్తున్నారు. 2014లో గెలిచి.. స్పీకర్‌గా ఎన్నికయిన సందర్భంలో.. 30-06-2014న.. ఏబీఎన్

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన

రాజకీయ, వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు..

ప్లేయర్‌ కావాల్సినవారు అంపైర్‌ అయ్యారు.. ఏమనిపిస్తోంది?
కొంచెం ఇబ్బందికరమే. ఆదినుంచీ నాకొచ్చినవన్నీ వృత్తికి, ప్రవృత్తికి సంబంధంలేని అవకాశాలే. డాక్టర్‌

చదివి రాజకీయాల్లోకి రావడం... పైగా హోం, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేయడం,

ఇప్పుడు స్పీకర్‌ కావడమూ అలాంటివే. అయితే, ఇక్కడా సక్సెస్‌ కావాలనే పట్టుదలతో ఉన్నా.

రెండే పార్టీలున్న చిన్న అసెంబ్లీని చూస్తే ఏమనిపిస్తోంది?
ఇప్పుడు డైరక్ట్‌ ఫైట్‌ మాత్రమే ఉంటుంది. సభ్యులు 175 మందే కాబట్టి నియంత్రణలో ఉంచడం

సులువవుతుంది. రెండు పక్షాలూ స్పీకర్‌ తమవాడనుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ, దురదృష్టవశాత్తు

తొలిరోజే నామీద కామెంట్స్‌ వచ్చాయి.

మీరు ప్రత్యర్థులపై ఒంటికాలిమీద లేచేవారు.. ఇప్పుడు గుంభనగా ఉండాలి? చంద్రబాబు కక్ష

తీర్చుకున్నారనుకుంటున్నారా?
ఎన్టీఆర్‌, చంద్రబాబు గొప్ప నాయకులు. వారేం చేసినా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. నాకు

వ్యక్తిగతంగా ఎవరిమీదా కోపం ఉండదు. రాజకీయంగా ప్రజలకు మేలు చేయడం కోసం కొంచెం ఆవేశంగా

మాట్లాడుతుంటా.

వైఎస్‌ ఉన్నప్పుడు కేవీపీని ఆంధ్రా శశికళతో పోల్చారు కదా?
ఆంధ్రా శశికళ అన్నది ఒక పోలిక మాత్రమే. అక్కడ వాళ్లు ఒకరు ఆత్మ అయితే మరొకరు శరీరం అన్నట్లు

ఉండేవారు. ఇక్క డా వీళ్లు అలాగే ఉండేవారు. ఆ తర్వాత వైఎస్‌ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.

గుంటూరులో మా భూములు అభివృద్ధి చేయాలనుకున్నా. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా

మంటూ నోటీసులు పంపారు. దానిపై కోర్టుకెళ్లాం. ఏడేళ్లు పట్టినా మాకే అనుకూలమైంది. కానీ ఏడేళ్ల

ఆదాయం కోల్పోయా.

రాజకీయాలన్నీ డబ్బుచుట్టూ తిరుగుతున్నాయి. ఇలాగైతేమరో పార్టీ మనుగడ సాధించగలదా?
కచ్చితంగా! యూపీలో అఖిలేశ్‌ అధికారంలో ఉన్నా మోదీ ఘనవిజయం సాధించారు కదా. మొన్న

ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చుపెట్టినవారు కూడా ఓడారు. డబ్బున్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం,

సంపాదించడం మామూలైంది... ఇది సరికాదు.

పాలనలో ప్రజాప్రతినిధుల ప్రభావం ఎక్కువైంది ఇది ఎక్కడకు దారి తీస్తోంది?
తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు ఎస్సై దగ్గరకు వెళ్లి వినతి పత్రం ఇచ్చేవాళ్లం. అది సరిగా

ఉందనుకుంటే.. రూల్స్‌ ప్రకారం పనిచేసేవాడు. కానీ ఇప్పుడు అధికారులు ఎమ్మెల్యేల కారుదగ్గరకు వెళ్లి

వాళ్లు చెప్పింది చేయాల్సి వస్తోంది. అది కరెక్టు కాదు.

సభలో టీడీపీ, వైసీపీ వ్యవహారశైలి చూస్తే ఏమనిపిస్తోంది?
మీకు 1983నాటి విషయం చెప్పాలి. అప్పుడు బీఏసీలో నిర్ణయించిన అంశాలన్నింటిపైన సాయంత్రం

వరకు చర్చ నడిచేది. ఏదైనా ఒక అంశం వాయిదా పడితే ప్రభుత్వం అవమానంగా భావించేది. అలాంటిది

నేడు బడ్జెట్‌నుకూడా గిలిటెన్‌ చేసే పరిస్థితి రావటం బాధాకరం. మొన్నటి సమావేశాల్లో ప్రతిపక్షానికి ఒకటే

చెప్పాను. సభ సజావుగా సాగేలా చూసి చర్చలో పైచేయి సాధించాలిగానీ, రాజకీయంగా పైచేయి కోసం

ప్రయత్నించ రాదని... సభ సజావుగానే సాగుతుందని నమ్మకం నాకుంది.


మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదు

ఎక్కువమంది స్పీకర్లు మీ జిల్లావారే... ప్రత్యేకత ఏమిటి?
స్పీకర్లే కాదు ముఖ్యమంత్రులూ ఎక్కువే. మా జిల్లా నుంచి ముగ్గురు సీఎంలుగా చేశారు. కారణం.. మాది

చాలాపెద్ద జిల్లా. రాజకీయాలే కాదు.. సినిమా, వ్యాపార, మీడియా,


వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ అవగాహన కూడా ఓ కారణం. కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా

మరో కారణం.

ఇప్పటి పరిస్థితుల్లో మంత్రి అయితే బాగుండుననిపించలేదా?
నా మనస్తత్వం తెలిసినవాళ్లెవరూ నేను రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు. అటువంటిది ఆరుసార్లు గెలవడం

మంత్రిగా పనిచేయడం జరిగాయి. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. కానీ, రాలేదన్న అసంతృప్తి

ఏదీ లేదు.

రాజకీయాలంటే అంత అనాసక్తి ఉన్న మీరు ఎలా వచ్చారు?
ఎన్టీఆర్‌ 1983లో పార్టీ పెట్టినప్పుడు.. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసుకుంటున్న నన్ను పిలిచి పోటీచేయమన్నారు...

రానన్నాను. ఇలా రెండు మూడుసార్లు జరిగిన తర్వాత మిత్రులు బలవంతపెట్టడంతో రావాల్సి వచ్చింది.

రాజకీయాల్లోకి వచ్చి గెలిచాను కానీ అప్పటికే ఆ నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఓ

బలమైన వర్గాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

మీ కుటుంబ నేపథ్యమేమిటి?
మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాకు ఇద్దరు చెల్లెళ్లు.. ఇద్దరు తమ్ముళ్లు ఉండేవారు.

దురదృష్టవశాత్తు స్మాల్‌ పాక్స్‌తో నలుగురూ ఓ వారం వ్యవధిలో చనిపోయారు. అప్పుడు మా తాతగారింటికి

వెళ్లడం వల్ల నేను బతికాను. నా కుమారుడు కూడా ప్రమాదంలో చనిపోవడం నా జీవితంలో అత్యంత

బాధాకర విషయం.

ఆ బాధనుంచి తేరుకోవడానికి ఎంత కాలం పట్టింది?
ఇప్పటికీ తేరుకోలేదు. పని ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు. ఖాళీ సమయంలో మాత్రం గుర్తొస్తుంటుంది. వాడు

చెన్నైలో చదివాడు. ఆర్థోపెడిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌. చాలా సర్వీస్‌ ఓరియంటెడ్‌. సింగరేణి కాలరీస్‌లో

జాబ్‌చేస్తూ తన జీతాన్ని పేదలకు ఖర్చుపెట్టేవాడు. ఓ రోజు ఇంటికి వస్తూ ప్రమాదంలో మరణించాడు.

మీ ఇంట్లో బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి?
మా ఇల్లు చాలా పెద్దది. ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. ఇల్లు కూడా 20,30 వేల చదరపు అడుగుల

వైశాల్యంగలది. నేను ఎన్నిక ప్రచారంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలిలో ఉన్నాను. పోలీసుల

తనిఖీ ఎక్కువైందని ఎవరో ఒక వ్యక్తి బాం బులు తెచ్చి మా ఇంట్లో దాచాడు. తర్వాత వాటిని తీసుకెళ్లే

ప్రయత్నంలో ఒకతను వాటిమీద కాలు వేయడంతో అవిపేలినలుగురు మరణించారు. అది నాకు చాలా

బాధ కలిగిం చింది. తర్వాత దానిపై సీబీఐ విచారణ జరిగింది.

కానీ నా ఇంట్లో అటువంటి ఘటన ఓ మచ్చగా మిగిలింది. కానీ, నేను తప్పు చేయనని ప్రజలు నమ్మారు.

అందుకే నన్ను గెలిపించారు. నరసరావుపేటలో ఫ్యాక్షన్‌ గొడవలున్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఒకసారి

హోం మంత్రిగా ఉన్నపుడు రొంపిచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పుడే నామీద బాంబు దాడి

జరిగింది. అంతమంది పోలీసు లున్నా ఎవరూ అడ్డుకోలేకపోయారు. అప్పుడు పరిస్థితులు అంత

దారుణంగా ఉండేవి. కానీ 1994 తర్వాత చాలా మారింది.

హోం మంత్రిగా వంగవీటి రంగా హత్య సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారుకదా?
1989 డిసెంబర్‌లో ఆ హత్య జరిగింది. ఆ హత్య జరగడమే చాలా ఘోరం. ఆ తర్వాత జరిగిన హింస

మరింత దారుణం. ఎంతోమందిపై దాడి చేశారు. ఇళ్లు తగలబెట్టారు. ఓ డాక్టర్‌ను హత్య చేశారు. దాంతో

హోంమంత్రిగా ఆఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాను.

బియ్యం సేకరించి అమ్మారన్న ఆరోపణ కూడా వచ్చిందికదా?
తూర్పుగోదావరిలో తుఫాను వచ్చినప్పుడు బాధితులకోసం బియ్యం సేకరించాం. వాటిని ఆర్డీవోకు

అందజేద్దామనుకొని తూకం వేస్తుంటే నేను అమ్ముకోవడానికే చేస్తున్నానని ఆరోపించారు. ఇంతా చేసి అవి

90 క్వింటాళ్ల బియ్యం.


చంద్రబాబు సాధ్యం చేయగలరు

జిల్లాలో మీరు అందరి కంటే సీనియర్‌ నేత. కానీ మీ నాయకత్వాన్ని వారు అంగీకరించకపోవడానికి

కారణమేమిటి?
నేను నియంతలా వ్యవహరిస్తున్నానని వాళ్లనుకోవచ్చు .. వాళ్లకోసం ఎంతో కృషి చేసినా నాతో సరిగా

ఉండడం లేదని నేననుకోవచ్చు.


 ఇద్దరి వాదనా కరక్టే.. ఎదిగేవాడికి.. ఎదిగిన వాడిని చూస్తే అసూయగా ఉంటుంది. ఎదగడానికి వారు

ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఎదుటివాళ్ల మీద బురద చల్లకూడదు. స్వతాహాగా నాది అలక స్వభావం.

నేను వాళ్లతో ఉన్న విధంగా వాళ్లు నాతో ఉండరేమిటి అని నాకు కోపం వస్తుంది. చంద్రబాబుతో కూడా ఇదే

సమస్య. ఆయన ఏ విషయాన్ని మాటల్లో వ్యక్త పరచరు. కానీ మాటల్లో చెబితే బాగుంటుంది కదా అని

నేననుకుంటా.

మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లిపోదాం అని

వ్యాఖ్యానించారు. ఎందుకు? అద్దెంట్లో ఉంటున్న భావన ఉందా?
కచ్చితంగా! రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఇక్కడ ఉండి పనిచేస్తే అది

ప్రవాసంగా ఉన్నట్టే. అందుకనే అక్కడకు వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంది. వసతులు లేకపోయినా

అక్కడకు వెళ్లి కష్టపడితే అది మిగిలినవాళ్లకు ఆదర్శంగా ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంటే సమస్యలు

తలెత్తుతాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను చెప్పిన స్థాయిలో అభివృద్ధి చేయడం సాధ్యమేనా?
అది కష్టమే.. అయినా చంద్రబాబు సాధ్యం చేయగలరు. 1995లో పరిస్థితినే చూస్తే.. జీతాలు లేని

పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితుల్లోంచి మిగులు బడ్జెట్‌లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కూడా

ఆయన ఒక్కడే చేయగలడు.

మీ వారసుడెవరైనా వస్తారా?
నా కుమారుడు ఉన్నాడు. అయితే వారసుడిలా ఫీలవద్దని వాడికి నేనెప్పుడూ చెబుతుంటానసేవ

చేయగలనన్న నమ్మకం ప్రజల్లో కలిపించాలి. వారికి సహాయపడగలమని చూపించాలి. అప్పుడే

రాజకీయంగా రాణిస్తాం. అంతేకానీ కేవలం వారసుడిగా వచ్చినంత మాత్రాన రాజకీయంలో ఏమీ చేయలేం.

కాకపోతే మిగిలినవారికంటే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు చాలామంది గెలిచిన మొదటి సారే మంత్రులైపోవాలనుకుంటున్నారు కదా?
ఇదివరకు అటువంటిది ఊహకు కూడా వచ్చేది కాదు. నేను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచాను.

87లో ఒకసారి ఎన్టీఆర్‌ పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నారు. అయినా సరే నాకు వద్దన్నాను. డాక్టర్‌ వృత్తికి

ఇబ్బందవుతుందని చెప్పాను. మళ్లా తర్వాత రెండోసారి పిలిచి అడిగారు. పార్టీని బలోపేతం చేయాలంటే

తప్పదన్నారు. దాంతో అప్పుడు తీసుకోవాల్సివచ్చింది.

మీకు ఎదురైన చేదు అనుభవాలు?
బియ్యం ఘటన ఒకటి.. ఇంట్లో బాంబులు పేలడం ఒకటి ఆ రెండు అంశాలు చాలా బాధపడ్డాను.

రాజకీయాలు.. వైద్యం... ఏది బెటరంటారు?
వైద్య వృత్తిలో ఉన్నప్పుడు అందరూ నావాళ్లే అన్న భావన ఎంతో బలంగా ఉండేది. కానీ రాజకీయాల్లో

ఎవరూ నావాళ్లు కాదేమోననే భావన. అందువల్ల రాజకీయాలతో పోలిస్తే వైద్య వృత్తి బెటర్‌.

స్పీకర్‌ పదవి తీసుకున్న వాళ్లు తర్వాత రాజకీయాల్లో రాణించిన వారెవరూ లేరు మీకేమనిపిస్తోంది.?
ఎస్సైన్‌మెంట్‌ తీసుకునేటప్పుడు భయమనిపించింది. కానీ, దీంట్లోకూడా రాణించాలనినిపించింది.

రామకృష్ణుడు వంటివాళ్లు ఉన్నారు. మరో విషయమేమిటంటే స్పీకర్‌ పదవిని రిటైర్‌మెంట్‌కు దగ్గరగా

ఉన్నవాళ్లకే ఇస్తారు... అనుకోవచ్చుకదా. ఇప్పటికే 30 ఏళ్లు రాజకీయ జీవితం చూశాను. ఇక్కడ నుంచి

వచ్చేది ఇక నాకు బోనస్‌ వంటిదే.

మీమీద చాలా సార్లు దాడులు జరిగినట్టున్నాయి?
అవును ఒకసారి కోటప్పకొండనుంచి వస్తుంటే మందుపాతర పేల్చారు. అలా తర్వాత నాలుగైదు సార్లు

దాడులుచేశారు. ఒకసారి యాసిడ్‌ బాంబు దాడి జరిగింది. అప్పుడే చిన్న గాయమైంది.

మీ జీవిత లక్ష్యం
నేను కోరుకున్న దానికంటే ఎక్కువే లభించింది. అందువల్ల ఇది కావాలనే కోరిక ఏమీలేదు. కాబట్టి

నలుగురికీ సేవ చేసుకుంటూ హ్యాపీ లైఫ్‌ గడపాలని కోరుకుంటున్నా.



సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!
Sep 16, 2019, 13:14 IST
Kodela Siva Prasada Rao Played Key Role in Andhra Pradesh Politics - Sakshi
ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం

ఎన్టీఆర్‌, చం‍ద్రబాబు హయాంలో మంత్రిగా సేవలు

మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న కోడెల

ఎన్టీఆర్‌ పిలుపుమేరకు రాజకీయ ఆరంగేట్రం

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెలది సుదీర్ఘ చరిత్ర

సాక్షి, హైదరాబాద్‌: నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాదరావు

జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలుసార్లు మంత్రిగా,

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు.

వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు

జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు

నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి ఎదురైనా.. 

2014లో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి.. మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు,

చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన.. నవ్యాంధ్ర తొలి

శాసనసభాపతిగా ఎన్నికై.. ఐదేళ్లు సేవలు అందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే..


గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు

జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో

జన్మించిన ఆయన.. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు

అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని

నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి..

రెండున్నరేళ్ళ తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్

చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి

డాక్టర్‌గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. ప్రముఖ సర్జన్‌గా

కీర్తిగడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఆయన పిలుపుమేరకు

1983లో టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం

సాధించి.. అసెం‍బ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నర్సరావుపేట

నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు.  2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన

ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం

నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఐదేళ్లపాటు సేవలు అందించారు.  కోడెలకు భార్య

శశికళ, ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ) ఉన్నారు. 

కోడెల శివప్రసాదరావు కన్నుమూత
Sep 16, 2019, 12:46 IST
TDP Leader Kodela Siva Prasada Rao Passed Away In Hyderabad - Sakshi
సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం

కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన

బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు

తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య,

ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్‌ విజయలక్ష్మీ ఉన్నారు.


కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం

గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు

వెలువడుతున్నాయి. వృత్తిరిత్యా డాక్టర్‌ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  గత టీడీపీ

ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా, హోంమంత్రిగా

సేవలందించారు.
(చదవండి : సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!)

కేసీఆర్‌ సంతాపం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న

వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ

సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.

ఉపరాష్ట్రపతి విచారం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన

ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి

తెలియజేస్తున్నాను’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
Sep 16, 2019, 13:56 IST
BanjaraHills Police Enquiry on Kodela Siva prasada Rao Death - Sakshi
విచారణ జరుపుతున్న బంజారాహిల్స్‌ పోలీసులు

కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక

మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు  విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా

తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌ పోలీసులు రికార్డు చేసినట్టు

తెలుస్తోంది.


కోడెల అస్వస్థతకు గురికావడంతో ఆదివారం రాత్రి 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్

బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు.

అర్ధరాత్రి 12.15 గంటలకు  చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు

అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్య నా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న

కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపటిలో కోడెల భౌతికకాయానికి వైద్యులు పోస్ట్

మార్టం నిర్వహించనున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి

తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

Sunday, September 15, 2019

నిషేధంపై నిలదీత

నిషేధంపై నిలదీత
16-09-2019 03:05:15
  • ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాలఫోర్త్‌ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
  • నిషేధించిన చానళ్ల పునరుద్ధరణకు డిమాండ్‌
  • నిరంకుశత్వంపై ఉద్యమం తప్పదని హెచ్చరిక
  • జర్నలిస్టు, ప్రజా సంఘాల ఆందోళన
  • స్వచ్ఛందంగా కదిలిన ప్రజలు.. టీవీలు పగలగొట్టిన
  • పశ్చిమ వాసులు.. నిలిపివేతపై ట్రాయ్‌కు ఫిర్యాదుల వెల్లువ
  • ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాల.. ఫోర్త్‌ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
  • అనంతపురం, శ్రీకాకుళంలలో భారీ ర్యాలీ
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 ప్రసారాల నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుట్టిస్తోంది. ఆయా చానళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలే నిలదీస్తున్నారు. తమ డబ్బును వెచ్చించి పెట్టుకున్న కేబుల్‌ కనెక్షన్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నల శరాలను సంధిస్తున్నారు. జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆదివారం చేపట్టిన భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాపై ప్రభుత్వ వైఖరి సరికాదని నినదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్‌ చేశారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడు తూ.. సీఎం జగన్‌ ఇప్పటికైనా ప్రజాస్వా మ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని హితవుపలికారు. ‘‘ఇప్పటికైనా మారండి.
 
లేకుంటే ఈ నిరసనలు ప్రజా ఉద్యమాలుగా మారడం ఖాయం’’ అని నేతలు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రజల హక్కులను కాపాడాలని గతంలో గగ్గోలు పెట్టిన వారే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హక్కులను కాలరాస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వమే పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేస్తోందని జర్నలిస్టు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఏబీఎన్‌, టీవీ-5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ.. నల్లబ్యాడ్జీలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రెస్‌క్లబ్‌ నుంచి టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
 
ర్యాలీ పొడవునా.. ‘మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..? సిగ్గు...సిగ్గు’-‘ముఖ్యమంత్రి డౌన్‌.. డౌన్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీఎన్‌, టీవీ-5 ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, సీపీఎం నేత నాగేంద్ర, కాంగ్రెస్‌ నేత శంకర్‌, బీజేపీ నాయకుడు జంగటి అమర్‌నాథ్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ బీసీఆర్‌ దాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గిడి మల్లయ్య, ‘చంద్ర-దండు’ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర నేతలు ఆదెన్న, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, మా జీ మేయర్‌ స్వరూప, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రభుత్వం భయపడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం లేదన్నారు.
 
శ్రీకాకుళంలో..
‘మీడియాపై నిషేధాజ్ఞలా? చానెళ్ల గొంతునొక్కడమన్నది అప్రజాస్వామికం’ అంటూ శ్రీకాకుళంలో జర్నలిస్టులు నినదించారు. ఆదివారం శ్రీకాకుళంలో ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి. నల్లబ్యాడ్జీలను ధరించి ఏడురోడ్ల జంక్షన్‌లో మానవహారాన్ని చేపట్టి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. ‘మీడియాకు స్వేచ్ఛ ఇవ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలతో హోరెత్తించారు. నాయకులు మాట్లాడుతూ మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. మీడియాపై ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే, అవి చూసి తప్పులను సరిచేసుకోవాల్సిందిపోయి.. మీడియాపై ఆంక్షలు విధించడం సబబు కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహమూర్తి పాల్గొన్నారు.
 
టీవీలు పగలగొట్టి..
ఏబీఎన్‌, టీవీ5 చానళ్లను నిలిపివేయడం ప్రజా వ్యతిరేక చర్య అని పశ్చిమ గోదావరిజిల్లాలోని విస్సాకోడేరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్‌ చానల్‌ నిలిచిపోవడంపై ఆగ్రహాంతో ఊగిపోయారు. కేబుల్‌ ఆపరేటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఉన్న టీవీలను బయటకు తీసుకువచ్చి జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతరం రహదారిపైనే టీవీలను పగలకొట్టి నిరసన తెలిపారు. ఇప్పటికైనా చానల్‌ను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన బి.సూర్యనారాయణ, ఆరేపల్లి నాగరాజు, బొర్రా కోటేశ్వరరావు, బొక్కా శ్రీనివాసరావు, సింగంపల్లి బాబూరావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. భీమవరంలో రైతు కార్యాచరణ సమితి తాజా పరిస్థితులపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నిజాలను నిర్భయంగా వెల్లడించే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పట్ల ఈ రకంగా వ్యవహరించడం తగదని రైతు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ.. మీడియాపై ఒత్తిళ్లు ఏమాత్రం సహేతుకం కాదన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ ఆరోపించింది.
 
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ-5 చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీడియా పీకనొక్కే ప్రయత్నాలు గతంలో కేసీఆర్‌ తెలంగాణలో చేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేస్తోంది. ఈ చర్య ప్రజాస్వామిక విలువలకు, విధానాలకు తీరని హాని. ప్రభుత్వం వెంటనే చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
 
నిలిపివేతపై ఉద్యమిస్తాం
ఏబీఎన్‌, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను నిలిపివేయడమే దీనికి ఉదాహరణ. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియా గొంతునొక్కే చర్యలు తగవు. వెంటనే వీటి ప్రసారాలను పునరుద్ధరించాలి. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతాం. మీడియాకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేబుల్‌ ఆపరేటర్లను స్వయానా మంత్రులే బెదిరించడం సిగ్గుచేటు. సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు.
టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి
 
ఇది అప్రజాస్వామికం
వైసీపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌. ప్రభుత్వానికి, మీడియాకి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలే తప్ప మీడియా గొంతు నొక్కడం, నిషేధించడం మంచి పద్ధతి కాదు. ఏబీఎన్‌, టీవీ5 చానళ్లను నిలిపి వేయడం సరికాదు. మీడియా, ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్య హక్కులను, భావ స్వేచ్ఛను కాపాడాలే తప్ప ప్రభుత్వం మీడియాను అడ్డుకోవడం సరైన విధానం అనిపించుకోదు. ఇప్పటికైనా వాటిని పునరుద్ధరించాలి.
బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు
ADVERTISEMENT

కన్నాను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం!

కన్నాను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం!
16-09-2019 08:50:27

గుంటూరు: గురజాలలో కన్నా లక్ష్మీనారాయణ సభకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు నోటీసు ఇచ్చేందుకు గురజాల సీఐ ప్రయత్నించారు. కానీ కన్నా నోటీస్ తీసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుతం
గురజాలలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని.. అక్కడకు రావద్దని సీఐ నచ్చజెప్పేందుకు యత్నించినా.. కన్నా వినిపించుకోకుండా బయలు దేరారు. ఈ నేపథ్యంలో దారి మధ్యలో కన్నాను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Thursday, August 22, 2019

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా? అర్థం కావట్లేదు: చంద్రబాబు

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా? అర్థం కావట్లేదు: చంద్రబాబు
22-08-2019 13:19:56

అమరావతి: పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.

సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారని.. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

Tuesday, August 20, 2019

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు
20-08-2019 02:53:07

సీమకు వరద నీటిని ఇవ్వలేకపోయారు
గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అధికారులతో మాట్లాడతా... గవర్నర్‌ హామీ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో ప్రభుత్వ పెద్దలు కృష్ణా వరదల్లో ఊళ్ళను ముంచారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ బృందం కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత గల్లా జయదేవ్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌, సీతారామలక్ష్మి, శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, పి.అశోక్‌ బాబు, తెలుగునాడు విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బ్రహ్మం తదితరులు ఉన్నారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు రాజ్‌భవన్‌ బయట విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టింది. ఈ వరదల సమయంలో అది పరాకాష్ఠకు చేరింది. వరదలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలు అప్రమత్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మౌనంగా ఊరుకొంది. వరదల్లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు, అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోవాలని కోరుకున్నారు. అందుకనే వరద నీటిని సకాలంలో కిందకు వదలకుండా కూర్చున్నారు’’ అని అచ్చెన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనివల్ల అనేక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు నానా కష్టాలు పడ్డారని అన్నారు.

ముఖ్యమంత్రి అమెరికాలో విహార యాత్ర చేస్తుంటే ఇక్కడ మంత్రులు అబద్ధాల ప్రచారంలో మునిగి తేలుతున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజి వద్ద 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చన్న మంత్రి అనిల్‌ యాదవ్‌ మాటల ధోరణి చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైపు నుంచి ఒక్క సమీక్ష లేదని, మంత్రులు వరద ప్రాంతాలను వదిలివేసి చంద్రబాబు నివాసం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రకాశం బ్యారేజి వద్ద మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే నాలుగున్నర టీఎంసీల నీటిని నిల్వ చేశారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 2009లో ప్రకాశం బ్యారేజి వద్దకు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా వాటిల్లని నష్టం ఇప్పుడు కేవలం ఆరేడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తేనే చోటు చేసుకుందన్నారు. సకాలంలో స్పందించకపోవడం వల్ల రాయలసీమలో వాడుకోవడానికి అవకాశం ఉన్న 80 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయారన్నారు. ‘‘పోతిరెడ్డిపాడు కాల్వ నుంచి నీటిని సీమకు పంపలేకపోయిందని అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వమేమో... అక్కడ నుంచి నీటిని ఎక్కువ తీసుకొన్నామంటూ కృష్ణా నదీ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

అటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి అక్కడ ఉమ్మడి ప్రాజెక్టులు కడతామనే సీఎం జగన్‌ తెలివితేటలను ఏం అనాలో అర్థం కావడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు మంచినీరు దొరక్క అల్లాడుతుంటే మంత్రులు మినరల్‌ వాటర్‌కు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సగం జిల్లాలు ముంపులో ఉంటే సగం జిల్లాలు కరువులో ఉన్నాయని రామానాయుడు పేర్కొన్నారు.

సాగునీటి అధికారుల్లో సగం మంది తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు పనిపై హైదరాబాద్‌లో కూర్చుంటే... మిగిలిన సగం మంది రివర్స్‌ టెండరింగ్‌ పనుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి వరదల్లో వేల ఇళ్ళు మునిగిపోతే ఇళ్ళుఖాళీ చేయాలని వారికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు ఒక్కరికే ఇచ్చారని అన్నారు. ఈ పరిస్థితులన్నీ గవర్నర్‌కు వివరించామన్నారు. సావధానంగా విన్న గవర్నర్‌ దీనిపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.

Wednesday, July 31, 2019

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్
31-07-2019 13:26:30

హైదరాబాద్: కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సతీమణి విమలా భానుతోపాటు కుమార్తె, అల్లుడు ఉన్నారు. మహిళలను నెట్టడం సరికాదని.. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానని ట్రాఫిక్ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాదాపూర్ ఖానామిట్ట వద్ద ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా ఘర్షణకు దిగుతూ.. విధుల్లో ఉన్న ట్రిఫిక్ ఎస్ఐపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ పిర్యాదు మేరకు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకే ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబసభ్యులు వచ్చి ఎస్ఐ రాజగోపాల్ రెడ్డితో గొడవకు దిగారు. వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Monday, July 22, 2019

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!
Jul 21, 2019, 03:09 IST
 World Bank officials informed the state government about funding - Sakshi
300 మిలియన్‌ డాలర్ల రుణం ఇస్తాం

అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతాం

ప్రాధామ్యాలను నిర్ణయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సమాచారం

నవరత్నాలకు చేయూత అందిస్తాం

ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పథకాలకు సాయపడతామన్న బ్యాంకు

గత సర్కారు నిబంధనలను ఉల్లంఘించటం వల్లే రుణంపై వెనక్కి తగ్గిన వైనం

అమరావతి రహదారుల టెండర్లలో అక్రమాలపై తనిఖీ బృందాలతో ఆరా

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రుణం రాకముందే రోడ్ల టెండర్లా?
అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది.

తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం..
– రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్‌ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్‌ అయింది.
– మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు.
– ఇందులో వరల్డ్‌ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు.
– ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు.
– 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్‌ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు.
– టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్‌ ఫైనాన్సింగ్‌ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది.
– రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు.
– దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్‌ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్‌ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్‌ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది.
– ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం.