Friday, March 20, 2020

మీడియాకు ఎలా లీకైంది?

మీడియాకు ఎలా లీకైంది?
Mar 21, 2020, 04:15 IST
Police Investigation On State Election Commissioner letter leak - Sakshi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖ లీక్‌పై పోలీసుల ఆరా

టీడీపీ అనుకూల మీడియాకు అందచేసింది ఎవరు? 

కొందరు నేతల వాట్సాప్‌ నుంచి మీడియాకు లీకైనట్లు నిర్ధారణ

పథకం ప్రకారమే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పేరుతో లేఖను లీక్‌ చేసిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై డీజీపీ దృష్టి సారించారు. ఎస్‌ఈసీ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలన్నీ పథకం ప్రకారమేననే అనుమానాలు బలపడుతున్నాయి. లేఖ లీక్‌ వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు ప్రధానంగా మీడియా వైపు నుంచి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


- మీడియాకు ఆ లేఖ ఎలా చేరింది? ఎవరు చేరవేశారు?  అలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అందువల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
- రాష్ట్రంలో ప్రధానంగా ఐదు మీడియా సంస్థలకు ఈ లేఖ లీకైనట్టు పోలీసులు గుర్తించారు. ఆయా మీడియా ప్రతినిధులకు వాట్సాప్‌ ద్వారా రాజకీయ నాయకుల నుంచి ఈ లేఖ వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ అనుకూలమైన మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా చేశాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.
- ఎస్‌ఈసీ లేఖ మీడియాలో ప్రసారం అయ్యేలా ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చక్రం తిప్పినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులకు మొదట ఆయన ఫోన్‌ చేసి లేఖ విషయంలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దాదాపు 30 నిముషాల వ్యవధిలో ఐదుగురు మీడియా ప్రతినిధులతో ఆయన ఫోన్‌ ద్వారా మాట్లాడి ఈ విషయాన్ని బ్లాస్ట్‌ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే వారి వాట్సాప్‌లకు లేఖ లీక్‌ చేయడం, ఓ వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడం జరిగిపోయాయి.
- ఎస్‌ఈసీ ఇదే లేఖను కేంద్ర హోంశాఖకు మెయిల్‌ ద్వారా పంపి ఉంటే ఎలా లీకైందనే అంశంపైనా దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగానే జరుపుతారు. అలాంటప్పుడు లేఖను లీక్‌ చేయడం పెద్ద నేరమే అవుతుంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
- ఈ లేఖను అడ్డుపెట్టుకుని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కలసికట్టుగా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే యత్నం చేశాయి. ఇందులో ప్రధానంగా ఓ మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో లేఖ లీకుపై పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. 

Wednesday, March 18, 2020

కేంద్రమే కాపాడాలి! - కేంద్ర హోం శాఖకు ఎస్‌ఈసీ రమేశ్‌ లేఖ

కేంద్రమే కాపాడాలి!
నాపై దూషణలు, బెదిరింపులు, హెచ్చరికలు
నా కుటుంబ సభ్యుల భద్రతకూ ముప్పు
స్వయంగా సీఎం తీవ్ర విమర్శలు చేశారు
అదే దారిలో స్పీకర్‌, మంత్రులు, నేతలు
భౌతిక దాడులకూ దిగే ప్రమాదముంది
ఫ్యాక్షన్‌ నేపథ్యం, కక్ష సాధింపు ధోరణి..
వారికి అందుబాటులో అన్ని వనరులు
ప్రభుత్వ పెద్దల్లోనే నాపై అసహనం
నా భద్రతకు తీవ్రస్థాయిలో ప్రమాదం
హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నా!
ఎన్నికల తొలి దశలోనే భారీగా హింస
క్రూరమైన ఆర్డినెన్స్‌తో విపక్షాలకు కట్టడి
వారే మద్యంపెట్టి, పోలీసులతో కేసులు
వాస్తవాలను వక్రీకరించిన ఎస్పీలు, కలెక్టర్లు
అసాధారణ స్థాయిలో ఏకగ్రీవాలు
పంచాయతీలో మరింత హింసకు చాన్స్‌!
అంతలోనే... కరోనాపై కేంద్రం అప్రమత్తం
అందువల్లే, స్థానిక ఎన్నికలు వాయిదా
నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం
కేంద్ర హోం శాఖకు ఎస్‌ఈసీ రమేశ్‌ లేఖ
తక్షణం స్పందించిన కేంద్రం
చర్యలకు డీజీపీకి ఆదేశాలు



స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు నన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. నాతోపాటు, నా కుటుంబ సభ్యుల  భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. దయచేసి, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


-కేంద్ర హోం కార్యదర్శికి రమేశ్‌ కుమార్‌ లేఖ



అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రకటన చేసినప్పటి నుంచి తనకు నిరంతరాయంగా బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలను తన కుటుంబం తట్టుకోలేక పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించిన తర్వాత... స్వయంగా ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో నాకు అనేక దురుద్దేశాలను ఆపాదిస్తూ తీవ్రమైన పదజాలంతో, అన్యాయమైన విమర్శలు చేశారు. స్పీకర్‌తోపాటు కేబినెట్‌ మంత్రులు కూడా సీఎం దారిలోనే పరుషమైన పదజాలంతో నన్ను దూషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కింది స్థాయి పార్టీ నాయకులు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. వారి సొంత ఆకాంక్షలకు అనుగుణంగా తిరిగి ఎన్నికలు జరిపించేలా, నా స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనిపిస్తోంది. నేనంటే గిట్టని వారికి ఉన్న విస్తృత పలుకుబడి దృష్ట్యా హైదరాబాద్‌లో కూడా పూర్తి సురక్షితంగా ఉంటానని చెప్పలేను’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.



ఎన్నికల ప్రక్రియ సాగుతున్నంత కాలం రాష్ట్ర పోలీసు భద్రతతో తన కార్యాలయంలోనే ఉన్నానని... పూర్తి భద్రత లేకుండా బయటకు వెళ్లేందుకు సాహసించలేకపోయానని చెప్పారు. ‘‘ఎన్నికలు వాయిదా పడటంతో నాకు, నా కుటుంబానికి భద్రత కరువైంది. నాకు ఉన్న ముప్పు దృష్ట్యా... రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కల్పించే భద్రత సరిపోదని  పాలన, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్న తోటి అధికారులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని చూస్తే... నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్షన్‌తో కూడిన నేపథ్యం, కక్ష సాధింపు ధోరణలను దృష్టిలో ఉంచుకుని... హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది’’ అని రమేశ్‌ కుమార్‌ తన లేఖలో వివరించారు. తనపట్ల అసహనంతో ఉన్న వారికి ఉన్న అధికారం,  వనరులు, నేర ముఠాలు, గతంలో వారి కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని... తనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేంద్ర పోలీసు బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా తాను కోరిన మేరకు తక్షణమే భద్రత కల్పించాలని కోరారు. అప్పుడే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులను పూర్తి చట్టబద్దంగా నిర్వర్తించగలనని లేఖలో పేర్కొన్నారు.



ఆదిలోనే ‘హింస’పాదు...

రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేందుకు ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలని భావించి ఈ నెల 7న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించామని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పలుదఫాలుగా చర్చించిన తర్వాతే షెడ్యూలు ఖరారు చేశామన్నారు. ‘‘ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా తగిన స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ... ఎన్నికల ప్రక్రియ తొలి అంకంలోనే అనూహ్యమైన స్థాయిలో హింసాత్మక ఘటనలు, పోలీసు సిబ్బంది ప్రత్యక్ష సహకారంతో అధికార పార్టీ బెదిరింపులు విపరీతంగా కొనసాగాయి. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఆరోపణలు చేశాయి. దాదాపు 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 23 చోట్ల బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారు. తెలుగుదేశం, బీజేపీ-జనసేన, ఇతర విపక్షాల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని 55 హింసాత్మక దాడులు జరిగాయి.



శాంతియుతంగా-పద్ధతిగా ఎన్నికలు నిర్వహించాలన్న సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. అంతేకాకుండా... అనూహ్యమైన స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి’’ అని రమేశ్‌ కుమార్‌ వివరించారు. ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి 2014లో కేవలం 2 శాతం ఏకగ్రీవాలు కాగా... ఈసారి ఏకంగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. అలాగే... 2014లో 1096 జడ్పీటీసీ స్థానాల్లో ఒకే ఒక్క జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా... ఈసారి 652 స్థానాలకుగాను 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇక... ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎంపీటీసీలు 439 (79 శాతం), జడ్పీటీసీలు 38 (76 శాతం) ఏకగ్రీవమయ్యాయని వివరించారు. ‘‘ఒక్క ఓటు పడకుండానే కడప జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. శాంతియుత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అపహాస్యం పాలైంది. స్థానిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోతే మంత్రులు పదవులు కోల్పోవాల్సి వస్తుందని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వబోమని స్వయానా ముఖ్యమంత్రి హెచ్చరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో పార్టీ కేడర్‌ భారీ హింసకు పాల్పడినట్లు పత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి’’ అని రమేశ్‌ కుమార్‌ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయన్నారు. ‘‘పరిస్థితిని చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న కొద్దిమంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించాం. వారి ద్వారా వచ్చిన సమాచారాన్ని పరిశీలించాం. ఇక... పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పదేపదే చేసిన సూచనలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి, మసిపూసి మారేడు కాయ చేసేలా రోజువారీ నివేదికలు పంపించారు’’ అని రమేశ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో స్పందించారు.



వాయిదా నిర్ణయం ఎందుకంటే...

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాయని... అనూహ్య, అసాధారణ స్థాయిలో జరిగిన హింసాత్మక ఘటనలతో  ప్రజలూ భయం గుప్పిట చిక్కుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం అత్యల్పంగా నమోదయ్యే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు... కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎగువ, విద్యావంత వర్గానికి చెందిన వారు పోలింగ్‌ బూత్‌కు వచ్చే ఆలోచనలో కూడా లేరని చెప్పారు. ‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశముంది. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను 70 శాతం ఏకగ్రీవం చేయాలనే వ్యూహంతో అధికార పార్టీ ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కమిషన్‌ ప్రయత్నించింది. అదే సమయంలో... కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. జనాల సమూహాలతో జరిగే ఎన్నికల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని భావించాం.



పొరుగు రాష్ట్రాలైన  కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే  ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు... పోలింగ్‌ రోజున ఇక్కడికి వస్తారు. బ్యాలెట్‌తో ఓట్లు వేస్తున్నందున కరోనా వ్యాప్తి చెందే  ప్రమాదం ఉంది. కేంద్ర వైద్యశాఖ అధికారులతో సంప్రదించిన తర్వాతే... ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని రమేశ్‌ కుమార్‌ వివరించారు. ఆ మరుసటిరోజునే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిసా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నిర్ణయాన్ని దేశమంతా హర్షించినా... అధికార పార్టీ మాత్రం విమర్శలు చేయడం ప్రారంభించిందన్నారు. చివరికి, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారన్నారు. ‘‘కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. కోడ్‌ అమలును మాత్రం వాయిదా వేసి ప్రభుత్వానికి ఊరట కలిగించింది’’ అని తెలిపారు. హింసకు తావివ్వకుండా  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనదేనని... మొదటి అంకంలో జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే ఎన్నికలు ప్రశాంతంగా ఉండవని పేర్కొన్నారు.



చర్యలకు ఆదేశించినా...

వివిధ వర్గాల నుంచి అందిన ఫిర్యాదులు, తమ స్వీయ పరిశీలనతో తెలుసుకున్న సమాచారం ఆధారంగా... గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, గుంటూరు రూరల్‌ ఎస్పీ, తిరుపతి అర్బన్‌ ఎస్పీలను, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలని... మాచర్ల సీఐను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. కానీ... సుప్రీంకోర్టుకు వెళ్లామన్న సాకుతో తమ ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. ‘‘తదుపరి దశల్లోనైనా అధికారులు సక్రమంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే... తప్పు చేసిన వారిపై చర్యలకు ఆదేశించాం. కానీ... వాటిని అమలు చేయలేదు. ఈ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనపడుతుంది. విపక్షాల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. బెదిరించి, ఒత్తిడి తెచ్చి, బలవంతంగానైనా నన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. అలా తలొగ్గేందుకు నేను సిద్ధంగా లేను’’ అని రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.  ‘‘జిల్లా కలెక్టర్‌గాను, తి చిన్న వయసులోనే టీటీడీ ఈవోగా, ట్యాక్స్‌ కమిషనర్‌గా, హౌసింగ్‌, సహకార, అగ్రికల్చరల్‌, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శిగా సమర్థంగా పని చేసిన ట్రాక్‌ రికార్డు నాకు ఉంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌కు ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు పనిచేశాను. రిటైర్‌ అయిన  తర్వాత అప్పటి గవర్నర్‌ సిఫారసులతో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితుడినయ్యాను’’ అని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తన, తన కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించి తగిన భద్రత కల్పించాలని కోరారు.



క్రూర చట్టాన్ని అస్త్రంగా...

ఎన్నికల్లో మద్యం, డబ్బును పంచినట్లు రుజువైతే... గెలిచిన తర్వాత కూడా అనర్హత వేటు వేస్తామని... జరినామాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రూరమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ దృష్టికి తెచ్చారు. ‘‘కేవలం తమను లక్ష్యంగా చేసుకుని ఈ ఆర్డినెన్స్‌ ప్రయోగిస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆర్డినెన్స్‌ను దుర్వినియోగం చేయకూడదని ఎస్‌ఈసీ స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ... అధికార పార్టీకి చెందిన ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని మద్యం తెచ్చిపెట్టడం... పోలీసులు ఆ నేతలను అరెస్టు చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి’’ అని తెలిపారు.



కేంద్ర హోంశాఖ సత్వర స్పందన

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంపిన లేఖపై కేంద్ర హోంశాఖ సత్వరం స్పందించినట్లు తెలిసింది. దీనిపై తక్షణం స్పందించాలని, అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు కల్పించిన భద్రతను రెట్టింపు చేయాలని డీజీపీని కేంద్రం ఆదేశించినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి.







స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలపాటు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా
16 Mar 2020, Sunday  @ 04:56AM

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తక్షణమే నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Mar 16 2020 @ 04:56AM

కలెక్టర్‌ హరికిరణ్‌

కడప (కలెక్టరేట్‌), మార్చి 15: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిలిపివేయాలని జడ్పీ, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఎ న్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికా రులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని, ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని, ఆరు వారాల తరువాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ తెలిపారన్నారు. అన్ని మున్సిపాల్టీలు, కడప కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు దాఖలైన నామినేషన్లను, బ్యాలెట్‌ పేపర్లు, ట్రెజరీలో జమ చేస్తామని తెలిపారు. అంతేకాక సోమవారం జరగాల్సిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను వాయిదా వేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది.


ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను నిలిపివేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో కోడ్‌ను ఎత్తివేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.



అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికలు నిలిపివేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని ఆందోళ వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. 

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది. 

ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Mar 18, 2020, 15:45 IST
Supreme Court Orders TO SEC Over Postponement Of Andhra Pradesh Local Body Polls - Sakshi
ఎన్నికల కోడ్‌ను వెంటనే ఎత్తివేయండి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వండి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినందున.. ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని.. అయితే ఎన్నికల ప్రవర‍్తనా నియమావళిని తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించింది. అదే విధంగా ఇదివరకే ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ తరఫున అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)


 అదే విధంగా.. ఒకవైపున ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారంటూ తన వాదనలు వినిపించారు. ‘‘ఒకే సమయంలో ఈ రెండూ ఎలా చేయగలుగుతారు?.. ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా?... ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్‌ తెలుసుకోలేదు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది.. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు... ఎన్నికల కమిషనర్‌ ఒక పొలిటికల్‌ లైన్‌ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది.. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు.. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదు’’ అని పేర్కొన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)

ఈ క్రమంలో ... తమ నిర్ణయంలో ఎలాంటి రాజకీయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే.. తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు.. కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. కోడ్‌ ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. దీంతో... ‘‘ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తామంటున్నారు.. ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తామంటున్నారు. రెండు విధాలుగా ఎలా చేస్తారు’’ అంటూ జస్టిస్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా’’ అని ప్రశ్నించారు. (ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు! )


ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు!
Mar 17, 2020, 05:46 IST
Center Govt on State Election Commissioner decision over Local Body Elections - Sakshi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై కేంద్రం ఆరా

సాక్షి, అమరావతి:  స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో ‘అసలు ఏమి జరిగింది’ అని ఆరా తీయడం మొదలు పెట్టింది. సోమవారం పలువర్గాల నుంచి వివరాల సేకరణ మొదలుపెట్టింది. ఏ నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషనర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడంపై కేంద్ర ఇంటలిజెన్స్‌ అధికారులు దృష్టిపెట్టారని తెలిసింది. ఎన్నికల నిలిపివేత వంటి కీలక నిర్ణయానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై ఎన్నికల కమిషనర్‌ విలేకరుల సమావేశంలో సంతకం చేశారని తెలిసి ఆశ్చర్యపోయారని సమాచారం.


ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకొని, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాక విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారా.. లేక ముందు విలేకరుల సమావేశంలో ప్రకటించి, ఆ తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారా అన్న సమాచారం తెలుసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం, ఆ తర్వాత పరిణామాలపై కేంద్ర ఇంటలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం ఉదయమే గవర్నర్‌తో భేటీ అంశాలనూ పరిశీలనకు తీసుకున్నట్టు తెలిసింది.

రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి
Mar 18, 2020, 18:24 IST
Ambati Rambabu Slams On Chandrababu Over State Election Commission - Sakshi
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంలో ఎలక్షన్‌ కమిషన్‌ తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు  చాలా స్పష్టంగా  తీర్పు చెప్పిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..  కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, దీంతో ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలో జరిగినట్లు బట్టబయలయిందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది అతిక్రమణ, తప్పు అని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలని, సంక్షేమ పథకాల కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. (అందుకే టీడీపీని వీడాను: శమంతకమణి)


ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, సుప్రీంకోర్టు స్పష్టంగా తన తీర్పులో చెప్పిందని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే  చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు స్తంభింప చేయాలనే కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్‌ ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక చంద్రబాబు ఉన్నారని అంబటి మండిపడ్డారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, అదేవిధంగా ఎస్‌ఈసీలో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు, అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరుతారని, బాబు అడిగేవన్ని జరగవని అంబటి అన్నారు. చట్టం, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు తెలిపారు.

Sunday, March 15, 2020

ఏపీలో జగన్, పిఎస్, సిఇవో, గవర్నర్ నాలుగు స్థంభాలాట

ఏపీలో జగన్, పిఎస్, సిఇవో, గవర్నర్ నాలుగు స్థంభాలాట
ఈరోజు సాయంత్రం 7 గంటలకు
Danny Telugu TV

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ
అమరావతి: ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చు అని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.


జగన్మోహన్‌రెడ్డీ.. సిగ్గుపడు!
నువ్వు చేయాల్సిన పని ఈసీ చేసింది
ఎన్నికల కమిషనర్‌కు కులం రంగా!
క్విడ్‌ ప్రో కో చేస్తేనే నీకు మిత్రులా?
సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నేతలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎన్నికలు వాయిదా వేసిన ఈసీపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. కరోనాపై కనీసం దృష్టి పెట్టకుండా మొండిగా ముందుకెళ్తూ ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ విమర్శించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వమే ఎన్నికలను వాయిదా వేయాల్సిందని, కానీ ఆ పని ఎన్నికల కమిషనర్‌ చేసినందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చట్టబద్ధంగా వ్యవహరించి, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జగన్‌కు శత్రువు అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ ఎలా మిత్రుడయ్యారో జగన్‌ చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌ చేశారు. క్విడ్‌ ప్రోకోకి పాల్పడితే మిత్రులు, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తే శత్రువులా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు జగన్‌ కులం రంగు పులమడంపై టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించినందుకు కమ్మ సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికలకు రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, సీనియర్‌ నాయకులు యడ్లపాటి వెంకట్రావు, యనమల, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ఎమ్మెల్యే అనగాని, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఈసీని కోరారు.

Jagan Complains to AP Governor against SEC Decision to Put off Local Body Polls over Coronavirus Fears
File photo of Andhra Pradesh CM and YSR Congress Party president Jagan Mohan Reddy.
File photo of Andhra Pradesh CM and YSR Congress Party president Jagan Mohan Reddy.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy said if required they would complain against the SEC "further up" and seek necessary action "if there is no change in him."
PTI
LAST UPDATED: MARCH 15, 2020, 6:27 PM IST
SHARE THIS:
Amaravati: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Sunday called on Governor Biswabhusan Harichandan at the Raj Bhavan in Vijayawada and complained against the State Election Commissioner's "arbitrary" postponement of the polls to rural and urban local bodies.

The chief minister took strong exception to the decision of State Election Commissioner N Ramesh Kumar to put off the upcoming elections for six weeks in view of the spread of coronavirus.


The chief minister rushed to the Raj Bhavan for an unscheduled meeting with the Governor a couple of hours after the SEC announced its decision to put off the local bodies elections.

Later, Reddy told reporters that if required they would complain against the State Election Commissioner "further up" and seek necessary action "if there is no change in him."

The chief minister also found fault with the SEC decision to order transfer of collectors of Chittoor and Guntur districts and SPs of Tirupati Urban and Guntur Rural.

"What authority does the SEC have to order these transfers? Why should we have an elected government and the chief minister? Let the SEC run the government," Reddy said.

The YSR Congress chief spit fire on Ramesh Kumar saying he belonged to the "same caste" as that of Telugu Desam Party president and former CM N Chandrababu Naidu.

"We did not appoint Ramesh Kumar as SEC, it was Chandrababu Naidu who appointed his own caste man. But how can he act in such discriminate fashion?" Reddy said.



గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎస్ఈసీ రమేశ్.. సర్వత్రా ఆసక్తి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ హరిచందన్‌ను ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ కలిశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణాలపై వివరించారు. సుమారు అరగంటకుపైగా ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆదివారం నాడు గవర్నర్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ తీరుపై వ్యక్తిగత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను ఎన్నికల కమిషనర్ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల వ్యవహారంపై గవర్నర్-రమేశ్ కుమార్ ఏం నిర్ణయిస్తారనే విషయం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికల సంఘానికి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్‌ విచక్షణ కోల్పోయారు: సీఎం వైఎస్‌ జగన్‌

ఇది ధర్మమేనా?
Mar 16, 2020, 03:14 IST
CM YS Jaganmohan Reddy Press Meet Over Local Body Elections Postpone - Sakshi
ఎన్నికల కమిషనర్‌ విచక్షణ కోల్పోయారు: సీఎం వైఎస్‌ జగన్‌

ఒకవైపు ఎన్నికలు వాయిదా వేస్తూ మరోవైపు అధికారులను ఎలా బదిలీ చేస్తారు?

పేదల ఇళ్ల పట్టాలు అడ్డుకోవడం సబబేనా?.. రూ.5,000 కోట్ల నిధులు పోగొట్టుకోవాలా?

బాబు తన సామాజిక వర్గం అధికారిని నియమించుకుని వ్యవస్థలను దిగజారుస్తున్నారు

స్థానిక ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తే కరోనాను నియంత్రించడం సులభం

కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి జాగ్రత్తలు సూచిస్తున్నాం. 70 నమూనాలు సేకరిస్తే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చింది. ఆ వ్యక్తి కూడా కోలుకుంటున్నాడు.


9 నెలల్లో 90 శాతం హామీలు అమలు చేశాం. ప్రజలు మెచ్చుకునే పాలన తెచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తోంది. దీనిని బాబు తట్టుకోలేకపోతున్నారు.. వ్యవస్థల్ని దిగజారుస్తున్నారు.

నిన్నటికీ, ఈరోజుకి పరిస్థితిలో ఏం తేడా కనిపించింది? వైఎస్సార్‌సీపీ 2 వేలకు పైగా ఎంపీటీసీలను దక్కించుకోవటం వారికి దుర్వార్తలాగా వినిపించింది. బాబు దారుణంగా దెబ్బతింటున్నారని ఉదయాన్నే ఎన్నికలు నిలుపుదల చేసేశారు.

రాష్ట్రంలో కరోనా ప్రభావం గురించి కనీసం ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శిని అడగలేదు. సీఎస్‌తో మాట్లాడలేదు.సమీక్ష చేయలేదు. ఆర్డర్‌ కాపీలో మాత్రం సీనియర్‌ హెల్త్‌ ఫంక్షనరీస్‌ నుంచి ఇన్‌పుట్స్‌ తీసుకున్నామని ఎన్నికల కమిషనర్‌ చెబుతారు. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా.?
–ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిష్పాక్షికతతోపాటు విచక్షణ కూడా కోల్పోయారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కరోనా వైరస్‌ను సాకుగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. కరోనా వైరస్‌పై కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని నిలదీశారు. ఎన్నికల కమిషనర్‌ ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే మరోవైపు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కొందరు అధికారులను ఎలా బదిలీ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా అడ్డుకోవడం సబబేనా? అని ఆక్షేపించారు. ప్రజలు 151 సీట్లతో గెలిపించిన ముఖ్యమంత్రిది అధికారమా? లేక ఎన్నికల కమిషనర్‌దా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుని ప్రస్తుతం వ్యవస్థలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, దీనిపై బెంబేలెత్తాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఫలితాలు ఏకపక్షమనే అక్కసుతోనే..
ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తూ ప్రజారంజకంగా పాలిస్తున్న వైఎస్సార్‌ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తోందనే దుగ్దతోనే చంద్రబాబు ఎన్నికలను అడ్డుకుంటున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాక్షస క్రీడకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని ఎన్నికలు జరిపించాలని, లేదంటే పైస్థాయికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే...

వ్యవస్థలను నీరుగారుస్తున్న బాబు
- ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఏ రోజూ అనుకోలేదు.
- చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను దారుణంగా నీరుగారుస్తున్నారు.
- కొన్ని విషయాలు, వాస్తవాలను అందరూ తెలుసుకోవాలి.

81 శాతం మంది ఇంట్లోనే కోలుకున్నారు
- కరోనా వైరస్‌ కొన్నాళ్లుగా చైనాలో విస్తరించడం, 81 వేల మంది వైరస్‌ బారిన పడటం చూశాం.
- బాధితుల్లో 65 వేల మందికి నయం కాగా 3 వేల మంది మాత్రం చనిపోయారు.
- కరోనా వైరస్‌ అన్ని దేశాలకూ పాకింది:
- అయితే దీనివల్ల మనుషులు చనిపోతారు, ఇదేదో భయానకమైన వైరస్, భయంకర పరిస్థితి అని ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదు
- ఇదొక రోగం అని చెప్పాల్సిన పని లేదు.
- డయాబెటిక్, బీపీ, కిడ్నీ, కాలేయ మార్పిడి జరిగినవారు, ఆస్తమా బాధితులతోపాటు 65 ఏళ్ల వయసు దాటినవారికి కరోనా వైరస్‌ సోకితే హానికరమైన వ్యాధిగా మారుతోంది.
- ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 81 శాతం మంది ఇంట్లోనే ఉంటూ కోలుకున్నారు.
- కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు.
- చైనాలో కరోనా బాధితులకు స్టేడియంలో చికిత్స అందించారు.
- కేవలం 4.7 శాతం మంది మాత్రం ఐసీయూ పరిస్థితుల్లోకి వెళ్లారు. వారికీ వైద్యం అందిస్తున్నారు.

ఎవరిది ఈ అధికారం?
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ రోజు ఉదయం స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
- ఆయన్ను మా ప్రభుత్వం నియమించ లేదు. చంద్రబాబు తన హయాంలో, తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.
- నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి.
- ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్పాక్షికత.
- రమేష్‌కుమార్‌ నిష్పాక్షికతతోపాటు విచక్షణ కూడా కోల్పోయినట్లు ప్రవర్తించారు.
- ఏ అధికారైనా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకూ అతీతంగా పనిచేయాలి. అప్పుడే గౌరవం లభిస్తుంది.
- రమేష్‌ కుమార్‌ ఒకవైపు కరోనా వైరస్‌ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెబుతారు. మరోవైపు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలు, మాచర్ల సీఐ, మరికొందరు అధికారులను తప్పిస్తూ ప్రకటన చేస్తారు. ఇది ఆశ్చర్యకరం. ఇలా ఎవరైనా చేయగలుగుతారా?
- ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ నుంచి అయిపోయే తేదీ వరకు ఆ మధ్య కాలంలో ఏదైనా చేయవచ్చు. కానీ ఒకవైపు కరోనా వైరస్‌ పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేశామంటూ అదే ప్రెస్‌మీట్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటారు.
- 175 స్థానాలకుగానూ 151 స్థానాల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చింది. నేను సీఎం స్థానంలో ఉన్నా. మరి ఈ అధికారం సీఎందా? రమేష్‌ కుమార్‌దా?

ఇది.. నిరంతర ప్రక్రియ
- కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉంటున్న మనవాళ్లు రాబోయే రోజుల్లో ఇక్కడకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి.
- అక్కడి పరిస్థితులు, చికిత్స వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలు మనవారిని స్వస్థలాలకు పంపవచ్చు.
- గోదావరి, వైఎస్సార్‌ తదితర జిల్లాల నుంచి చాలామంది గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు.
- విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, 14 రోజుల పాటు క్వారంటైన్, ఐసోలేషన్‌లో పర్యవేక్షణ, జ్వరం వస్తే వెంటనే వైద్యం అందించడం సహజంగానే జరుగుతాయి.

ఇది నిరంతర ప్రక్రియ
-  ఇవాళ ఏదో నిర్ణయం తీసుకుని ఆందోళనకు గురిచేసి రెండు వారాల తర్వాత అంతా నయం అయిపోతుందని అనుకోవాల్సిన పనిలేదు.
- నిజానికి రెండు నుంచి నాలుగు వారాల తరువాత విదేశాల్లో ఇతరులను వెనక్కి పంపే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.

జీవనయానం ఆగిపోదు...
- ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పరిస్థితిని బట్టి సూచిస్తాం.
- స్కూళ్లు, పాఠశాలలకు కొద్ది రోజుల పాటు సెలవులిస్తాం.
- విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్వహిస్తాం.
- కరోనా భయంతో ప్రజల దైనందిక కార్యక్రమాలను నిలుపుదల చేయలేం. జీవనయానం ఆగిపోదు.

ఇదేనా విచక్షణ?
- స్థానిక ఎన్నికలు జరపాలి. 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయండి. అప్పటివరకు మేం మాట్లాడం.
- ఒకవైపు ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ మరోవైపు చర్యలు తీసుకుంటారు.
- ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు.
- ఇటీవల అంతా ఇదే మాట మాట్లాడుతున్నారు.
- ఏం చేసినా విచక్షణాధికారం అంటున్నారు.
- ఎన్నికలు వాయిదా వేసి మీరే ముఖ్యమంత్రి మాదిరిగా కలెక్టర్లు, ఇతర అధికారులను మారుస్తున్నారు.
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. అధికారులకు మెమో జారీ చేస్తారు.
- అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలు ఓట్లేయడం ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు? ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లేసి గెలిపించడం ఎందుకు?

ఎన్నికలపై ఎల్లో మీడియా యాగీ...
- ఎన్నికలపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నానా యాగీ చేస్తోంది.
- రాష్ట్రంలో 10,243 ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
- ఇందులో 54,594 నామినేషన్లు దాఖలైతే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి.
-  2,794 వార్డులు, డివిజన్లలో పోటీ జరుగుతుంటే 15,185 నామినేషన్లు దాఖలయ్యాయి.
- ఇందులో చెదురుమదురు ఘటనలు కేవలం 14 చోట్ల జరిగితే నాలుగు పత్రికలు, టీవీ ఛానళ్లు ఎక్కువగా ఉన్నాయని ఇలా దుష్ప్రచారం చేయడం సరైనదేనా? గుండెపై చెయ్యి వేసుకొని చెప్పండి.

‘స్థానిక’ ఏకగ్రీవాలపై 2013లో ఈనాడు ఏం రాసిందంటే..
- ఏకగ్రీవాల్లో టీడీపీ సత్తా చాటింది. 269 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 105 స్థానాలను టీడీపీ కైవశం చేసుకుంది.
-  75 స్థానాలను వైఎస్సార్‌ సీపీ దక్కించుకుంది.
- కాంగ్రెస్‌ ఆరు స్థానాలకే పరిమితమైంది.
- వామపక్షాలు రెండేసి స్థానాలను, బీజేపీ ఒక్క స్థానం, స్వతంత్రులు 83 స్థానాలను దక్కించుకున్నారు.
- ఏకగ్రీవం కావడమన్నది కొత్తేమీ కాదు.
- నాడు ఒప్పు అనిపించింది.. నేడు తప్పు అయిపోయిందా?

ప్రజలు హర్షించేలా పని చేస్తున్నాం..
- ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాం.
- ప్రజలకు మేలు చేసేలా హర్షించే రీతిలో పని చేస్తున్నాం.
- మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి 90 శాతం కార్యరూపంలోకి తెచ్చాం. 
- ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ సీపీ స్వీప్‌ చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు?
- వ్యవస్థల్లో తనకున్న మోల్స్‌ను ఉపయోగించి వాటిని దిగజార్చే పని ఎందుకు చేస్తున్నారు?

పోలీసుల తీరు ప్రశంసనీయం..
- పోలీసులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారని గర్వంగా చెప్పగలను
- 8 చోట్ల పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
- ఎక్కడా ఉపేక్షించకుండా, ప్రేక్షక పాత్ర వహించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.

ఎవరో రాసింది ఆయన చదువుతున్నారు..
- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కలెక్టర్లకు నిన్న ఓ ఉత్తర్వు ఇచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే సంతోషించాల్సింది పోయి ఎన్నికల ప్రక్రియ జరిగేదాకా ఆపమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.
- నిన్న ఈ లేఖ ఇచ్చారు. ఇవాళ పొద్దున్న ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేశారు.
- నిన్నటికీ, ఇవ్వాళ్టికీ ఏం తేడా కనిపించింది?
- తేడా ఒక్కటే... స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తోందనే. దాదాపు 2 వేల పైచిలుకు ఎంపీటీసీలను వైఎస్సార్‌ సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడం వారికి దుర్వార్తలా వినిపించింది.
- దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, చంద్రబాబు ఇంకా దారుణంగా దెబ్బతింటున్నారని, ఏకంగా ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పొద్దున 4 పేజీల ఆర్డర్‌ వచ్చింది.
- ఇంత పెద్ద ఆర్డర్‌ తయారవుతున్నట్లు ఎన్నికల కమిషన్‌ సెక్రటరీకే తెలియదు.
- అంటే ఎవరో రాస్తున్నారు, ఎవరో ఇస్తున్నారు, ఆ ఆర్డర్‌ను ఆయన చదువుతున్నారు.
- ఇలా చేయడం ధర్మమేనా?
- ఒకవైపు ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఆర్డర్‌ ఇస్తారు. మరోవైపు కలెక్టర్లు, ఎస్పీలను, అధికారులను బదిలీ చేస్తారు.
- ఇళ్ల పట్టాలు లాంటి సంక్షేమ పథకాలను ఆపేస్తున్నారు.
- కరోనా వైరస్‌ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెప్పేటప్పుడు ఎన్నికల కమిషనర్‌ కనీసం ఎవరినైనా అడగాలి కదా? సూచనలు, సలహాలు తీసుకోరా?
- కనీసం ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శిని అడగలేదు. సమీక్ష చేయలేదు.
- సీఎస్‌ను కనీసం అడగలేదు, మాట్లాడలేదు, రివ్యూ చేయలేదు. కనీసం సలహా తీసుకోలేదు.
- ఆర్డర్‌ కాపీలో మాత్రం సీనియర్‌ హెల్త్‌ ఫంక్షనరీస్‌ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్‌ తీసుకున్నామని ఎన్నికల కమిషనర్‌ చెబుతారు.
- ఆరోగ్యశాఖ కార్యదర్శి కన్నా సీనియర్‌ ఫంక్షనరీ ఎవరైనా ఉంటారా? ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? మీరేదో చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. పోనీ చేస్తే చేశారు. కానీ రెండో వైపు అధికారులను బదిలీ చేస్తారు, ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటారు. ఇది సరైనదేనా?
- చంద్రబాబు ఆయనకు పదవి ఇచ్చి ఉండొచ్చు. ఇద్దరి సామాజిక వర్గం ఒక్కటే కావచ్చు. అయినా ఇంత వివక్ష చూపడం ధర్మమేనా, సబబేనా?

వలంటీర్లతో ఇంటింటి సర్వే
- గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటినీ సర్వే చేసి విదేశాల నుంచి వచ్చేవారిని గుర్తించి జాగ్రత్తలు సూచిస్తున్నాం.
- దీనిపై పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చాం.
- 104 ద్వారా అందరికీ చికిత్స అందుబాటులోకి తెచ్చాం.
- రాష్ట్రంలో 70 నమూనాలు సేకరిస్తే ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చింది.
- ఆ వ్యక్తి కూడా కోలుకుంటున్నారు. 
- దేశంలో 51 ల్యాబ్‌లు ఉంటే మన రాష్ట్రంలో తిరుపతి, విజయవాడలో వెంటనే ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం.
- కాకినాడ ప్రాంతంలో మరో ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.
- వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, అదనపు వెంటిలేటర్లు సిద్ధం చేశాం. 

తక్షణమే స్పందించాం..
- మనకు విశాఖ మినహా ఇతర చోట్ల అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నందున మనకంటే
ఇతర రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది.
- కరోనా బాధితుల చికిత్స కోసం విశాఖలోని విమ్స్‌లో 200 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం.
- ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో కూడా 100 పడకలతో అందుబాటులో ఉంచాం. విజయవాడలో 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ వార్డులు, ఐసీయూలను కూడా సిద్ధం చేశాం.
- విజయవాడ, విశాఖ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో ఐసోలేషన్‌ రూమ్స్‌ రేపటి నుంచి అందుబాటులోకి తెస్తాం.
- నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగానే వెంటనే బాధితుడి నివాసానికి కిలోమీటర్‌ పరిధిలోని 20 వేల ఇళ్లలో 40 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు జరిపాం.
- బాధితుడి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచాం.
- ఇలా ఒక పద్ధతి, విధానం ప్రకారం వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.

రాష్ట్రం డబ్బులు పోగొట్టుకోవాలా?
- ఈ ఎన్నికల ప్రక్రియ జరగడం ఎందుకు అవసరమో అంతా ఆలోచించాలి.
- మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు అయిపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది.
- ఎన్నికలు జరగకపోతే ఆ డబ్బులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి?
- ఆ నిధులొస్తే రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అభివృద్ధి కనిపిస్తుంది కదా? ఏదో ఒక పనికి వినియోగిస్తాం కదా?
- ఆ డబ్బులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్‌ నష్టపోవాలని ఎందుకు ఇన్ని కుట్రలు పన్నాలి?
- ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు ఇంత కక్ష సాధించాలి?
- కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదనే కోపంతో ఇలా చేస్తున్నారు.

వాయిదాతో పరిస్థితి మారుతుందా?
- ఎన్నికలు వాయిదా వేస్తే పరిస్థితి మెరుగవుతుందా? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏమైనా మారిపోతాయని చెప్పగలరా?
- కరోనా బాధిత దేశాల నుంచి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ఇంకా చాలా మంది వస్తారు.
- అప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కరోనాను ఎదుర్కోవడం నిరంతర ప్రక్రియ అవుతుంది.
- పది రోజుల్లో ముగిసే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా సాధించేది ఏమిటి?
- వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా ఎన్నికలు జరుగుతాయనే గ్యారంటీ ఏమిటి?
- ఎన్నికలు జరగడం లేదు కాబట్టి ఆ ఏడాది కూడా నిధులు ఆగిపోవాలా?
- ప్రభుత్వం అడుగులు ముందుకు పడకూడదు, అభివృద్ధి జరగకూడదు, మేం ఇలాగే అధికారం చలాయించాలన్న దృక్పథం సరికాదు.
- ప్రజలకు మంచి చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు ఆలోచించాలి.
- దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకోం. గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నికల కమిషనర్‌ను పిలిచి మాట్లాడాలని కోరాం.
- అప్పటికీ మార్పు రాకుంటే ఈ అంశాన్ని ఉన్నత స్థాయి దృష్టికి తెస్తాం.
- స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తే కరోనా లాంటి వ్యాధులను నియంత్రించడం మరింత సులభం అవుతుంది.
- సర్పంచులు, మునిసిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్ల రాకతో పాలన బలోపేతం అవుతుంది.
- స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ఈ అవకాశం కోల్పోవడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ప్రశ్నార్థకంగా మారతాయి.

Thursday, March 12, 2020

టిడిపి కి అచ్చు రాని రాజ్యసభ

టిడిపి కి అచ్చు రాని  రాజ్యసభ

ఆయన అన్నం పెడితే....వీరు మాత్రం ఆయనకు వాతలు పెట్టారు !
Publish Date:Mar 12, 2020

* పత్తా లేని సుధాకర్ యాదవ్, నారాయణ
* కార్పొరేట్ల ను నమ్ముకున్నందుకు, వారు బాబు కు బానే బుద్ధి చెప్పారు

అన్నం పెడితే అరిగిపోతుంది.. చీర పెడితే చిరిగిపోతుంది.. వాత పెడితే నిలిచిపోతుంది అని సామెత! ఈ సామెత ను త్రికరణ శుద్ధిగా ఫాలో అయిన కడప జిల్లా టీ డీ పీ నేతలు, తమకు అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడుకు కావాల్సినన్ని వాతలు పెట్టి మరీ బీ జె పి లోకి, వై ఎస్ ఆర్ సి పి లోకి జంప్ అయ్యారు. 

జమ్మలమడుగులో పార్టీని కాపాడుతూ వచ్చిన రామసుబ్బారెడ్డి ప్రత్యర్ధి, ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని, మంత్రి పదవి ఇచ్చారు. అది, ఆయన వర్గం చేతిలో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు, బాబు తప్పుడు సంకేతాలిచ్చిందన్న విమర్శకు కారణమయింది. చివరకు ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత, బీజేపీలో చేరారు. పోనీ, అలాగని రామసుబ్బారెడ్డినీ బాబు కాపాడుకోలేకపోయారు. ఫలితంగా, ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు. 


సీఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, రెండుసార్లు రాజ్యసభ సీటిచ్చారు. భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆయన చాలాకాలం క్రితమే బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత డీ.ఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడి, బాబుతో చర్చలు కూడా జరిపారు. కానీ, యనమల రామకృష్ణుడు ఒత్తిడితో, ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు సీటు ఇచ్చారు. అప్పటికే టీటీడీ చైర్మన్ పదవి, కాంట్రాక్టులు తీసుకున్న సుధాకర్‌కు మరో అవకాశం ఇవ్వడం, విమర్శలకు దారితీసింది. అయినా యనమల కోసం సుధాకర్‌కు సీటిచ్చారు. ఇప్పుడు అదే సుధాకర్ యాదవ్ కనిపించడం మానేశారు. కడప జిల్లాలో ఎప్పుడూ టీడీపీ బలం పెరగకపోయినా, వర్గాల కారణంతో.. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తల సంఖ్య మాత్రం బాగానే ఉంది.

నిజానికి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీ.ఎం చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల అనుభవం, నలభై ఏడేళ్ల జగన్ ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. చెన్నారెడ్డి, కోట్ల, నేదురుమల్లి, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలను ఎదుర్కొని నిలబడ్డ బాబు ధైర్యం, జగన్ వంటి యువనేత ముంగిట నిలవలేకపోతోంది. చివరకు సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది. నాయకులపై ఆయన లెక్కలు దారుణంగా తప్పుతున్నాయి. ఆయన వేసుకున్న తాత్కాలిక అవసరాలు, రాజకీయ అవసరాలనే పునాదులు కుప్పకూలిపోతున్నాయి. నమ్మిన వారే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడిపోతున్నారు. అందలమెక్కించినవారే అలవోకగా కాడి కిందపడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, కాంట్రాక్టులు పొందిన వ్యాపారులు, విపక్షంలోకి రాగానే వైసీపీ గూటికి చేరుతున్నారు. మంత్రులుగా వెలగబెట్టిన ప్రముఖులు, వ్యాపారాలు చేసుకుని పార్టీ ముఖం చాటేస్తున్నారు. మరి ఏమయింది బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం? ఏమయిపోయింది ఆయన రాజకీయ చాణక్యం? ఎక్కడికి పోయింది ఆయన ఇమేజ్? నేతల విషయంలో ఆయన లెక్కలు ఎందుకు తప్పినట్లు?.. ఇదీ ఇప్పుడు తెలుగుతమ్ముళ్లలో జరుగుతున్న చర్చ.

కడప జిల్లాలో మొన్న సీ.ఎం.రమేష్, నిన్న సతీష్‌రెడ్డి, రేపు రామసుబ్బారెడ్డి. ఎల్లుండి ఇంకెవరో? వరస పెట్టి వలస వెళుతున్నారు. వీరిలో రామసుబ్బారెడ్డి మినహాయిస్తే, మిగిలిన వారు కాంట్రాక్టర్లు, సగం రాజకీయ నాయకులు. సీ.ఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, కడప జిల్లాపై పెత్తనంతోపాటు, రెండు సార్లు ఎం.పీ సీటిచ్చారు. ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల వైసీపీ ఎం.పీగా టికెట్ సాధించిన అంబానీ అంతేవాసి పరిమళ్ నత్వానీ వ్యవహారంలో రమేష్ సమన్వయం కూడా ఉందంటున్నారు. సతీష్‌రెడ్డికి వరసగా అసెంబ్లీ టికెట్‌తోపాటు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చి, కౌన్సిల్ పదవి కూడా ఇచ్చారు. ఆయన కూడా తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

ఇదిలా ఉంటె, పార్టీకి అనాదిగా సేవలందించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైసీపీలో చేరిపోయారు . పార్టీ కోసం కుటుంబసభ్యులను, వందలసంఖ్యలో అనుచరులను పోగొట్టుకున్న రామసుబ్బారెడ్డి కూడా, టీడీపీని వీడటమే ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది. వైఎస్ హయాంలో కూడా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ రామసుబ్బారెడ్డిలో ఆత్మస్థైర్యం సడలి, జగన్ వైపు అడుగులు వేయడానికి తమ నాయకత్వం తీరే కారణమన్నది తమ్ముళ్ల విమర్శ. ఇక ఇప్పుడు కడపలో మిగిలింది కొద్దిమంది నేతలే. ప్రకాశంలో ప్రతిసారీ, బాలకృష్ణ సిఫార్సుతో టికెట్ తెచ్చుకునే బాబూరావు కూడా వైసీపీలో చేరారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, అనేక జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీ కండువా వేసుకుంటున్న వైనం, పార్టీవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, ఇతర పార్టీల వారిని తాత్కాలిక అవసరాలకు చేర్చుకున్న ఫలితమే.. ఈ పరిణామాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లిస్తే, ఐదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీ మాత్రం, వరసగా అగ్రకులాలకే సీట్లిచ్చిందని, వారంతా అధికారం పోయిన తర్వాత పార్టీని వీడారని గుర్తు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు కాకుండా, సీఎం రమేష్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిన ప్పటికీ, ఆయన బీజేపీలోకి వెళ్లారు. సీట్లు ఇచ్చిన నలుగురు ఎం.పీలూ బీజేపీలో చేరారని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తప్పిదాలేనని, వారి విషయంలో ఆయన లెక్కలు తప్పాయని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. 

మాగుంట, ఆదాల వంటి వ్యాపారులను చేర్చుకోవడం వల్ల పార్టీ ఏం సాధించిందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి, సీనియర్లను అవమానించారని.. ఇప్పుడు నారాయణ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా, బిజినెజ్ హౌస్ ల అధినేతలను కాకుండా, జనం లోనుంచి వచ్చిన నాయకులను చట్ట సభలకు పంపితే, పార్టీ పరువు నిలుస్తుందని చంద్రబాబు నాయుడు కు పార్టీ కార్యకర్తలు సూచన చేస్తున్నారు.

రాజ్యసభ సభ్యులు టీడీపీకి అచ్చిరావడం లేదా? HIGHLIGHTS పెద్దల సభ తెలుగుదేశానికి అచ్చిరావడం లేదా రాజ్యసభలో గట్టిగా గళమెత్తుతారని, కాచివడబోసి పంపిస్తే, తిరిగి జట్కా... Arun22 Jun 2019 5:16 PM పెద్దల సభ తెలుగుదేశానికి అచ్చిరావడం లేదా రాజ్యసభలో గట్టిగా గళమెత్తుతారని, కాచివడబోసి పంపిస్తే, తిరిగి జట్కా ఇవ్వడమేంటి గతంలోనూ చాలామంది టీడీపీ రాజ్యసభలు, మరో పార్టీలోకి జంపయ్యారు. ఆ లిస్టులో ఎవరెవరున్నారు ప్రస్తుతం ఏయే పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు పెద్దలసభ సభ్యులు, కమలం తీర్థం పుచ్చుకోవడంతో మరోసారి టీడీపీ రాజ్యసభ ప్రతినిధులపై చర్చ మొదలైంది. ఒక్కసారి హిస్టరీ పేజీలు తిరగేస్తే, టీడీపీ ఎంపీలు వరుసబెట్టి పార్టీకి షాకిచ్చారు. తెలుగుదేశం తరఫున రాజ్యసభకు నామినేట్ చేసిన వారిలో కేవలం ఇద్దరు మినహా మిగిలిన వారంతా, పార్టీకి పంగనామాలు పెట్టారు. పదవిలో ఉండగా కొందరు, పదవీ కాలం ముగిసిన తర్వాత ఇంకొందరు, టీడీపీకి రాంరాం చెప్పేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పుడు చంద్రబాబునాయుడు జమానా వరకు, హిస్టరీ మొత్తం ఇదే చెబుతోంది. అందుకే ఒక్కసారి రాజ్యసభకు పంపించామా, ఆ నేత ఇక మనకులేడనుకునే పరిస్థితికొచ్చింది టీడీపీ. Also Read - సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కరణం తెలుగుదేశం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో మోహన్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇక జయప్రద కూడా రాజ్యసభలో టీడీపీ ప్రతినిధిగా వ్యవహరించారు. తర్వాత ఎస్పీలోకి మారారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. రేణుకా చౌదరి కూడా ఒకప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యురాలే. ఇప్పుడామె కాంగ్రెస్‌. పర్వతనేని ఉపేంద్ర నాడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎంపీ. వంగా గీత ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య రాజ్యసభలో టీడీపీ ఎంపీగా గట్టిగానే గళమెత్తారు. కానీ పదవీకాలం ముగిసిన తర్వాత చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా బయటికొచ్చారు. ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడాయన వైసీపీ గూటికి చేరారు. తులసిరెడ్డి కూడా ఇప్పడు కాంగ్రెస్‌లో ఉన్నారు. 

 దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. గుండు సుధారాణి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రామమునిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, మైసూరారెడ్డి వంటి వారు కూడా ఇదే జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టీడీపీలో లేరు. వారంతా రాజ్యసభకు వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పిన వారే. రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో ఇంకా టీడీపీతోనే ఉన్నవారిలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. వారిద్దరూ చంద్రబాబుతోనే ఇంకా నడుస్తున్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్‌లు, కమలం తీర్థం పుచ్చుకోవడంతో, మరోసారి టీడీపీకి రాజ్యసభ అచ్చిరాలేదని తేలిపోయిందని, అదే పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతా రామలక్ష్మి మాత్రమే మిగిలారు. రామలక్ష్మి పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. కనకమేడల రవీంద్ర కుమార్‌కు మరో నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అయితే టీడీపీ సభ్యులు, రాజ్యసభలో విలీనం కావడం చెల్లదంటూ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి విన్నవించారు లోక్‌సభ ఎంపీలు. మొత్తానికి టీడీపీ నుంచి రాజ్యసభకు పంపినవారంతా, మరో పార్టీలోకి వెళ్లడమో, లేదంటే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటమో జరుగుతోంది. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి కలిసిరావడంలేదని, పార్టీలో చర్చ జరుగుతోంది

నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటుపై చంద్రబాబు ఫైర్

నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటుపై చంద్రబాబు ఫైర్

అమరావతి: పరిమళ్ నత్వానీకి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ అధనేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక కుట్ర ఉందని జగన్ అన్నారని గుర్తు చేసిన ఆయన రిలయన్స్ పాత్ర ఉందంటూ ఆ సంస్థ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడుల్ని గుర్తు చేశారు. ఈరోజేమో నత్వానీకి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపుతున్నారని, పార్టీ టికెట్లు అలా ఎలా ఇస్తారని నిలదీవారు. నిజంగానే వైయస్ మరణం వెనుక రిలయన్స్ పాత్ర లేకపోతే నాడు చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపన చెప్పాలని చంద్రబాబు అన్నారు.

దీనికి ముందు తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పరిమళ్‌ నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నత్వానీ ట్వీట్ చేశారు.

Tuesday, March 10, 2020

ఇంత దుర్మార్గమా? ఎన్నికల్లో పోటీకి సర్టిఫికెట్లే ఇవ్వరా?

ఇంత దుర్మార్గమా?
ఎన్నికల్లో పోటీకి సర్టిఫికెట్లే ఇవ్వరా?
ఎస్‌ఈసీ ఎందుకు జోక్యం చేసుకోదు?
నామినేషన్లు వేసే పరిస్థితి లేకపోతే
ఎన్నికలు వాయిదా వేయండి: బాబు
సర్టిఫికెట్ల నిరాకరణ వీడియో ప్రదర్శన
ఎక్కడ అక్రమం జరిగినా వీడియో తీసి
7995014524కు పంపాలని సూచన



అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉండేందుకు వారికి అవసరమైన సర్టిఫికెట్లు జారీ కాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు మద్దతుగా కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో పర్వీన్‌ తాజ్‌ అనే టీడీపీ నేత ఒక గ్రామానికి చెందిన కార్యదర్శికి ఫోన్‌ చేసినప్పుడు జరిగిన సంభాషణ కూడా ఇందులో ఉంది. చిత్తూరు జిల్లా కావేటివారిపల్లిలో ఇంటి పన్ను కట్టించుకోవడానికి ఎండీవో నిరాకరించారని, గుంటూరు జిల్లాలో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకుండా పోయారని చంద్రబాబు చెప్పారు. ‘పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారు చెప్పినా ప్రభుత్వం వినడం లేదా? ప్రభుత్వం బరి తెగించిందా? ఈ సర్టిఫికెట్లు లేక ఒక్క వ్యక్తి నామినేషన్‌ వేయలేకపోయినా దానికి ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో అంద రూ నామినేషన్లు వేసేలా చూడ డం ఎస్‌ఈసీ బాధ్యత. అలా చేయలేని వాతావరణం ఉంటే ఎన్నికలు వాయిదా వేయండి’ అని  డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని ఒక గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఇంటికి తెల్లవారుజామున పోలీసులు వచ్చి బయట ఎక్కడో మద్యం బాటిళ్లు దొరికాయని చెప్పి ఆ ఇంట్లో టీడీపీ నేతపై కేసు పెట్టారని దుయ్యబట్టారు.  అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి బార్‌ కోడింగ్‌ ఉంటే ఆ పని చేయకుండా టీడీపీ నేతపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బాదూరులో నామినేషన్‌ వేయడానికి వస్తున్న టీడీపీ నేతలపై దాడి చేసి కొట్టారని, గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లిలో కూడా నామినేషన్‌కు వస్తున్న టీడీపీ వారిపై దాడి జరిగిందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో రాత్రి సమయంలో టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. టీడీపీ వారిపైనే ఎదురు కేసు పెడితే సీఐ భక్తవత్సలరెడ్డి వెంటనే 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంచబోరని చంద్రబాబు ప్రకటించారు.  వైసీపీ నేతలకు దమ్ముంటే ఈ 15 రోజులూ మద్యం షాపులను పూర్తిగా మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.





ప్రజలు తిరుగుబాటు చేయాలి..

అధికార పార్టీ దౌర్జన్యాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఒకరిపై దాడిచేస్తే వంద సీట్లలో ఓడించాలని.. అప్పుడే భయం వస్తుందన్నారు. ‘ప్రజలు వారికి భయపడినా.. ప్రలోభాలకు లొంగినా రాష్ట్రం నాశనమవుతుంది. అమరావతి రైతులపై 2,200 కేసులు పెట్టారు.   పేదల అస్సైన్‌మెంట్‌ భూములను లాక్కుంటున్నారు. ఇంతగా కాపలా కాయాల్సిన అవసరం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. టీడీపీ నాయకులంతా ప్రజా క్షేత్రంలో ఉండాలి. బెదిరింపులను ప్రతిఘటించాలి. ప్రతి చోటా పోటీ చేయాలి. ఎవరికైనా భయం ఉంటే ముందే చెప్పి తప్పుకోండి. వేరొకరిని సిద్ధం చేసుకుంటాం’ అని చెప్పారు.  ఏ అక్రమం జరిగినా వీడియో తీసి  79950 14524కు పంపాలని, కనీసం సమాచారమిచ్చినా చాలని తెలిపారు.



తొలగించకపోతే నేనే వెళ్తా..

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు, ప్రభుత్వ ప్రచార హోర్డింగులను తక్షణం తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వీటిని తొలగించకపోతే తానే స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తి చూపుతానని ప్రకటించారు. ఎన్నికల సంఘం వైఖరి కూడా మాకు అనుమానాలు కలిగిస్తోంది. నిన్న ఎస్‌ఈసీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్‌ పక్కన ప్రభుత్వ అధికారి విజయకుమార్‌ కూర్చున్నారు. ఆయనకు అక్కడేం పని’ అని ఆయన ప్రశ్నించారు.

Reliance outlets attacked in A.P.

Reliance outlets attacked in A.P.
SPECIAL CORRESPONDENTHYDERABAD, JANUARY 08, 2010 02:18 IST
UPDATED: DECEMBER 17, 2016 05:27 IST
SHARE ARTICLE 0PRINTA A A
Several installations of the Reliance group across Andhra Pradesh were attacked late on Thursday night after a Telugu television channel aired a report alleging a high-level conspiracy behind Chief Minister Y.S. Rajasekhara Reddy’s death in a helicopter crash on September 2.

It was based on a report on a Russian website, The Exiled, which alleged that YSR was the victim of a plot centring around offshore gas reserves in the Krishna-Godavari basin. Reliance Industries Limited owned by Mukesh Ambani is operating these gas fields off the Kakinada coast.

No political party, barring some Congress leaders, gave credence to the report of the website, which could not be accessed. But mobs took to the streets and indulged in vandalism in at least ten districts and Hyderabad city.

Jagan shocked

YSR’s son and Congress MP Y.S. Jaganmohan Reddy, in a statement, expressed shock at the report and said he would mount pressure on the Centre to investigate the conspiracy angle.

He appealed to people to maintain calm, saying destruction of property was not a solution.

YSR’s supporters went on the rampage in Guntur, Anantapur and Kurnool districts and Hyderabad city, where they attacked retail outlets and malls, cell phone towers and petrol stations operated by the two Reliance groups. They burnt effigies of Mukesh and Anil Ambani.

Local Congress leaders called for a bandh in Kadapa and Anantapur districts and several towns in other districts.

Guntur witnessed the maximum attack on the Reliance groups’ outlets, with the mobs attacking fuel stations, cell phone towers and other retail outlets.

Tension prevailed in the district as senior Congress leaders led the attack on the outlets till late in the night.

In Kurnool district, activists set ablaze two buses at the Nandyal bus stand and attacked over a dozen others.

YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ?

YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ?
Mar 10, 2020 08:21 AMYES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ?
YES బ్యాంక్‌ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మంత్రులు. ఎస్‌ బ్యాంక్ స్కామ్‌ తో మాజీ సీఎం చంద్రబాబుకు లింకులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి పేర్నినాని. చంద్రబాబు తన హవాలా కోసం ఎస్‌ బ్యాంకును ఉపయోగించుకున్నారని, అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు  వినియోగించుకున్నారని ఆరోపించారు. ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై కేంద్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు మంత్రి పేర్ని నాని.

వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో... దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీని ప్రమోట్‌ చేయడానికి... YES బ్యాంక్‌ భాగస్వామ్యంతో "టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. పర్యాటక గమ్యస్థానంగా ఏపీని దేశవ్యాప్తంగా ప్రమోట్‌ చేయడంతో పాటు... ఏపీ టూరిజంను అంతర్జాతీయ బ్రాండ్‌ స్థాయికి తీసుకెళ్లడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం YES బ్యాంక్‌కు కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం భారీగానే డబ్బు చెల్లించింది.

ఆ తర్వాత 2017 మార్చిలో ఢిల్లీలో జరిగిన ''YES బ్యాంక్‌ అండ్‌ ది ఎకనామిక్‌ టైమ్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌" కార్యక్రమానికి... ఏపీ, అధికారిక స్టేట్‌ పార్ట్‌నర్‌గా వ్యహరించింది. ఈ కార్యక్రమం ద్వారా 2029 నాటికి ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇది ఏమైందో తెలీదు. తన  హయాంలో రెండుసార్లు YES బ్యాంక్‌తో లింకులు పెట్టుకున్న చంద్రబాబు... అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు అదే బ్యాంక్‌ను ఉపయోగించుకున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అందుకే YES బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఎస్-బ్యాంకు కుంభ‌కోణంతో చంద్ర‌బాబుకు సంబంధ‌మా?March 10 , 2020 | UPDATED 03:30 IST
ఎస్-బ్యాంకు కుంభ‌కోణంతో చంద్ర‌బాబుకు సంబంధ‌మా?
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ఎస్-బ్యాంకు కుంభ‌కోణంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు సంబంధం ఉంద‌ని అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఇప్ప‌టికే అరెస్టు అయిన ఎస్-బ్యాంకు వ్య‌వ‌స్థాప‌కుడు రాణాకూ చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని మంత్రి ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు నాయుడు, రాణా అతి స‌న్నిహితులు అని వీరిద్ద‌రూ త‌ర‌చూ క‌లుస్తూ ఉండేవార‌ని మంత్రి అంటున్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో... త‌ర‌చూ వీరి స‌మావేశం జ‌రిగేద‌ని మంత్రి ఆరోపించారు. ఏపీలో త‌ను సంపాదించిన అవినీతి సొమ్మును రాణా ద్వారా చంద్ర‌బాబు నాయుడు విదేశాల‌కు త‌ర‌లించార‌ని మంత్రి ఆరోపించారు.

నెల‌కోసారి రాణా వ‌చ్చి చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యే వార‌ని కూడా మంత్రి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు..ఎస్-బ్యాంకు కుంభ‌కోణంలో చంద్ర‌బాబునాయుడుకు నోటీసులు వ‌స్తాయ‌ని మంత్రి నాని వ్యాఖ్యానించారు. అందుకే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లో కూర్చుని న్యాయ‌నిపుణుల‌తో చ‌ర్చ‌లు  జ‌రుపుతూ ఉన్నార‌ని నాని అంటున్నారు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఎస్- బ్యాంకును ఉద్ధ‌రించ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని మంత్రి గుర్తు చేశారు.

తిరుమ‌ల శ్రీవారికి సంబంధించిన 1,300 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఎస్-బ్యాంకులో డిపాజిట్ చేయించ‌డం వెనుక చంద్ర‌బాబు నాయుడి ఒత్తిడి ఉంద‌ని అన్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మ‌న్ అయ్యాకా ఆ నిధుల‌ను ఎస్-బ్యాంకు నుంచి విడుద‌ల చేయించిన సంగ‌తిని మంత్రి ప్ర‌స్తావించారు. క‌మిష‌న్లకు ఆశ‌ప‌డి, రాణా క‌పూర్ తో చంద్ర‌బాబుకు ఉన్న సంబంధాల మేర‌కే.. అప్ప‌ట్లో టీటీడీ నిధుల‌ను కూడా ఎస్-బ్యాంకుకు త‌ర‌లించార‌ని మంత్రి అంటున్నారు!

Monday, March 9, 2020

Parimal Dhirajlal Nathwani

Parimal Dhirajlal Nathwani (born 1 February 1956) is an Indian politician and industrialist who has been twice elected Member of Parliament (Rajya Sabha) from Jharkhand. He was first elected to Rajya Sabha in March 2008 and then re-elected in March 2014.

He was an entrepreneur and a trader until the mid-1990s. He joined Reliance Group in 1997.[2] As of 2016, he was the Group President of Corporate Affairs at Reliance Industries Ltd., a part of the headed by Mukesh Ambani.[3] Nathwani closely worked with Dhirubhai Ambani and now has been working with RIL CMD Mukesh Ambani.He is a key member in the core leadership at RIL.[4] Nathwani helped Dhirubhai Ambani in realizing his dream.[clarification needed] He played a pivotal role in land acquisition and setting up the biggest grassroots crude oil refinery on the western coast near Jamnagar in Gujarat.[5]

Nathwani became the face of Reliance Industries Limited (RIL) in Gujarat and other parts of the country. He spearheaded several of the group's projects including land acquisition for the Jamnagar refinery and building infrastructure to roll out 4-G broadband in 22 circles of the country.[6].[clarification needed]

Mukesh Ambani meets AP CM YS Jagan, discusses investments

Mukesh Ambani meets AP CM YS Jagan, discusses investments
V Rishi Kumar  Hyderabad | Updated on February 29, 2020  Published on February 29, 2020

Andhra Pradesh CM Y S Jagan Mohan Reddy greets Reliance Chief Mukesh Ambani during a meeting in Hyderabad, on Saturday. - PTI

SHARE SHARE SHARE

EMAIL SHARE COMMENT
Reliance Industries Chairman Mukesh Ambani called on Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy at the CM’s Camp Office in Tadepalli near Vijayawada on Saturday.

YSRCP MP V Vijayasai Reddy received Ambani at the Gannavarm airport and they together met the Chief Minister to discuss the Reliance Group's investments in the state.

Ambani's son Ananth Ambani, Rajya Sabha member and industrialist Parimal Natwani accompanied the industrialist and were present at the meeting.

Mukesh Ambani headed Reliance Industries Limited has made significant investments in the Krishna Godavari basin. The company is gearing up to kick off next phase of growth in the State with production from new locations

Andhra CM meets PM Modi, discusses special status to state, release of central funds

Andhra CM meets PM Modi, discusses special status to state, release of central funds
1 min read . Updated: 13 Feb 2020, 07:04 AM IST
PTI
Y S Jaganmohan Reddy also sought the early nod of the Parliament for the resolution passed by the state assembly for abolishing the legislative council
Andhra CM also sought early release of the central grants due to Andhra Pradesh since the state's bifurcation

Topics
YS Jagan Mohan ReddyNarendra Modi
Andhra Pradesh Chief Minister Y S Jaganmohan Reddy on Wednesday met Prime Minister Narendra Modi here and discussed various issues, including special status to the state, sources said.

During the 90-minute long meeting at the prime minister's residence, Reddy also sought early release of the central grants due to Andhra Pradesh since the state's bifurcation, they said.

The YSRCP president sought the Centre's approval to the long pending demand of according special status to Andhra Pradesh and reimbursement of ₹3,880 crore spent by the state for the Polavaram irrigation project, the sources said.

Reddy also sought the early nod of the Parliament for the resolution passed by the state assembly for abolishing the legislative council, they said.

YSRCP MPs Vijaisai Reddy, Mithun Reddy, Y S Avinash Reddy and V Prabhakar Reddy accompanied the chief minister to the meeting.

Jagan Mohan Reddy meets Amit Shah, seeks funds for Andhra Pradesh

Jagan Mohan Reddy meets Amit Shah, seeks funds for Andhra Pradesh

During their 40-minute discussion, the leaders spoke about the State government’s plan to set up three capitals, and the move to abolish the Legislative Council, among other things.

Published: 15th February 2020 09:07 AM  |   Last Updated: 15th February 2020 09:07 AM  |  A+A A-
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy with Home Minister Amit Shah in New Delhi. (Photo| PTI)By Express News Service
VIJAYAWADA: Days after meeting Prime Minister Narendra Modi with a list of demands for the State, Chief Minister Jagan Mohan Reddy on Friday met Home Minister Amit Shah in New Delhi and presented his wish list to him. During their 40-minute discussion, the leaders spoke about the State government’s plan to set up three capitals, and the move to abolish the Legislative Council, among other things.

After telling Shah that the Council had lost its utility and was being used for ulterior motives, Jagan requested him to direct the Law Ministry to take necessary steps towards abolishing the House.
Reminding the Home Minister about the provisions made to the State in the AP State Reorganisation Act, the Chief Minister asked the Centre to fulfil them. He also sought financial help for completion of projects such as the Kadapa Steel Plant, Visakhapatnam-Chennai corridor, Ramayapatnam port and the Kakinada Petroleum Complex.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


With regard to Central-sponsored schemes and grants, Jagan pointed out that the State has received only Rs 10,610 crore in the current fiscal, which is only half the funds that were released to the State in a year during the previous government’s term. He requested for clearance of the pending grants to Andhra Pradesh. Sources said Jagan has also sought appointments with other mnisters, and will meet them on Saturday.

The CM told Shah that most of the police department’s infrastructure remained in Hyderabad after the bifurcation of the State, hampering the effective functioning of the department. Lack of funds and shortage of staff are some of the hurdles being faced, and there is an urgent need to address them to strengthen the police force, he said.

Jagan explained that the Centre had allotted State Forensic Lab in 2017 with a total budget of Rs 253.4 crore, of which Rs 152 crore is the Central share. The project was put aside due to the negligence of the previous government, he said, and asked Shah to reconsider it.

He also sought the Centre’s assistance in setting up a State operation command, control centre, centralised data centre, and AP police academy. Enhancement of the State cadre strength from 79 to 96 was also requested.

Apprising Shah on the objective of introducing the Disha Act, he requested him to direct the Home Ministry to approve the Act to provide protection to the women in the State. Across Andhra Pradesh, 18 Disha police stations have been set up with special teams, and fast-track courts to try these cases are also being set up, he explained.

As for the Polavaram project, he said the State is determined to complete it by 2021, and sought assistance for the rehabilitation package for all the families to be evacuated as per the schedule. He said that the total estimated cost of the project turned out to be Rs 55,549 crore and Rs 33,010 crore was needed as part of the R&R package.

He recalled that the Central water Resources Ministry has estimated the cost of Polavaram Project to be Rs 55,549 crore in February 2019.The administrative sanction for the same is yet to be accorded, he said and requested the Home Minister to intervene and address the issue.

Jagan has also requested reimbursement of Rs 3,320 crore, the balance of the amount spent by the State on the project so far.He brought to the notice of Shah that the State has received only Rs 1,050 crore for backward districts development to date and the funds for the last three years were not released.
While Rs 4,000 was given per head on an average in the special package for Bundelkhand district in Uttarpradesh and Kalahandi district in Orissa, the seven backward districts in AP only got Rs 400 per head. He requested for allocation of funds on par with Bundelkhand and Kalahandi regions.

He said as per CAG report in 2014, Andhra Pradesh’s revenue deficit was Rs 22,948.76 crore, but to date, the state was reimbursed only Rs 3,979.50 crore and the balance Rs 18,969.26 crore is yet to be released.
The chief minister requested the immediate clearance of the pending dues.

As regards to the allocation of Rs 2,500 crore for construction of the State capital, he reminded that only Rs 1,000 crore was released by the Centre. He sought the release of the pending funds for the purpose.
Sources said Chief Minister has also sought an appointment with other ministers and would be meeting them on Saturday for discussing the release of funds to the state from respective departments, before returning to the State.

CM explains plan for decentralised administration
Speaking to the Home Minister, Jagan explained at length the need for decentral-isation of administration (three capitals) and development in the State, while asserting that his government is committed to balanced development of the entire State without neglecting any region

Asks to start process of shifting High Court
Jagan requested Shah to initiate steps for relocating the High Court to Kurnool and said a High Court in Rayalaseema on a permanent basis was also part of the BJP’s election manifesto. He also briefed the Home Minister on the move to abolish the Legislative Council

‘Special status needed to overcome financial constraints’
The Chief Minister told Shah that Andhra Pradesh needs special status to overcome financial constraints, and pointed out that the approval of the Finance Commission was not needed for this. He also recalled that the 15th Finance Commission had made it clear that granting special status to the State was in the purview of the Central government

Stay up to date on all the latest Andhra Pradesh news with The New Indian Express App. Download now(Get the news that matters from New Indian Express on WhatsApp. Click this link and hit 'Click to Subscribe'. Follow the instructions after that.)

Friday, March 6, 2020

ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు.. ప్రతీకారానికే!

ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు.. ప్రతీకారానికే!
ఆ రెండు జీవోలను రద్దు చేయండి
వాటికి శాస్త్రీయత లేదు
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
విధాన నిర్ణయాలను సమీక్షించే అధికారం ప్రస్తుత సర్కారుకు లేదు
హైకోర్టులో వర్ల రామయ్య పిటిషన్‌


అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను.. దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. టీడీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకే రాష్ట్రప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీని, సిట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎలాంటి శాస్త్రీయత లేని ఆ జీవోలు నిరాధారమైనవి, అస్పష్టమైనవని పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోలను రద్దు చేయాలని అభ్యర్థించారు. ‘రాష్ట్ర విభజన జరిగాక 2014 జూన్‌ 2 నుంచి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐదేళ్ల తర్వాత గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై సమీక్షించేందుకు గతేడాది జూన్‌ 26న మం త్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో 1411ను జారీ చేసింది. ఆ ఉపసంఘం ఇచ్చిన సిఫారసు మేరకు గత ఫిబ్రవరి 21న రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 344ను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేశారు’ అని వర్ల పేర్కొన్నారు.



ప్రభుత్వం నిరంతరం కొనసాగుతుంది..

‘ఐదేళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తుంది. రాజకీయ పార్టీల విధానాలు వేర్వేరు కాలాల్లో వివిధ రకాలుగా, ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో మేరకు నిర్ణయాలు తీసుకునే హక్కు, కాలానుగుణంగా అవసరం మేరకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించజాలదు. అదేవిధంగా పునఃపరిశీలించనూలేదు. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభు త్వం అనడంలో అర్థం లేదు. ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు మునుముందు జరుగబోయే వాటి గురించి ఉంటాయి తప్ప.. అంతకు ముందున్న వాటి గురించి కాదు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వానికి గత ఏడాది మే 30కి ముందు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షించే అధికారం లేదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై పునఃసమీక్షించేందుకు ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అధికార పరిధిని అతిక్రమించడంతో పాటు రాజ్యాంగవిరుద్ధమైనవి. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడానికి, పరిశీలించడానికి, రద్దు చేయడానికి వీలులేదు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు గానీ, సిట్‌ ఏర్పాటుకు గానీ తగిన కారణాలే లేవు. ఆ జీవోలు సహజ న్యాయసూత్రాలకు, రాజ్యాంగానికి విరుద్ధమైనవి. అందువల్ల వాటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో పాటు వాటిని రద్దు చేయండి’ అని పిటిషన్‌లో వర్ల పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్‌) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.


52వ రోజుకు చేరిన నందిగామ దీక్షలు
నందిగామ, మార్చి 6 : రాజధాని తరలింపును నిరసిస్తూ నందిగామ జేఏసీ చేపట్టిన ఆందోళన 52వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని శుక్రవారం మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ కుట్రపూరితంగా రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజా పోరాటాలు, న్యాయస్థానాల ద్వారా రాజధాని తరలింపును అడ్డుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేఏసీ నాయకులు నీరుకొండ నరసింహారావు, వైఎస్‌ బాబు, చలమల శ్రీనివాసరావు, బండారు హనుమంతరావు, కోగంటి బాబు, అమ్మినేని జ్వాలాప్రసాద్‌, వడ్డెల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ ఎపిసోడ్‌లో వైసీపీకి మైనస్ మార్కులు.. బెడిసికొట్టిన ప్లాన్

విశాఖ ఎపిసోడ్‌లో వైసీపీకి మైనస్ మార్కులు.. బెడిసికొట్టిన ప్లాన్

విశాఖ ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకుని వారం గడిచినా ఇంకా దానిపై చర్చ సాగుతూనే ఉంది. ఈ ఎపిసోడ్‌పై ఒక్కొక్కరిది ఒక్కో వాదన. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ మొత్తం సంఘటన వల్ల వైసీపీ లాభపడిందా? నష్టపోయిందా? తెలుగుదేశం పార్టీకి ఎంత మైలేజ్ వచ్చింది? పోలీసుల పాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? ఆసక్తికర కథనం మీకోసం!

  వారు తలిచింది ఒకటైతే జరిగింది మరొకటి. విశాఖలో చంద్రబాబు ఎపిసోడ్‌లో వైసీపీ పరిస్థితి ఇలాగే తయారైంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధినేతను అడ్డుకోవడం, గంటల తరబడి ఆయన కారులోనే నిరీక్షించడం, వాతావరణం ఉద్రిక్తంగా మారడం, పోలీసుల నోటీసుతో చంద్రబాబు హైదరాబాద్‌కి తిరిగి రావడం వంటి ఘటనలు తెలుగునాట సంచలనం రేపాయి. ఈ ఘటన జరిగి వారం కావస్తున్నా.. ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు లాభపడ్డారన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబుని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకుని ఆయనకి తగిన శాస్తి చేశామని వైసీపీ నేతలు భావిస్తున్నప్పటికీ.. ఈ వ్యవహారం బూమరాంగ్‌ అయి వారికే డ్యామేజ్‌ జరిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి.. టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం వెనుక పెద్ద ప్రణాళికే రచించారు. ఆయన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఇక్కడ కొనసాగితే.. అధికార వైసీపీ నేతల ఆగడాలు బయటికి వెల్లడవుతాయి. ముఖ్యంగా విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రకు వెళ్లేముందు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ల్యాండ్‌ పూలింగ్‌ వల్ల నిరాశ్రయులైన రైతులను పరామర్శించాలని బాబు నిర్ణయించుకున్నారు. అదే విధంగా, పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్‌రాజు కుటుంబీకులు చదును చేస్తున్న చెరువును పరిశీలించాలని కూడా డిసైడ్‌ అయ్యారు. ఈ సంగతి గ్రహించిన విశాఖ వైసీపీ నేతలు ఒక వ్యూహం ప్రకారమే తమ పార్టీ క్యాడర్‌ని ఎయిర్‌పోర్ట్‌ వద్ద మొహరించి చంద్రబాబును అడ్డుకున్నారు.

   విశాఖను పాలనా రాజధానిగా అంగీకరించమని చెబుతున్న చంద్రబాబును ఇక్కడ అడ్డుకోవడం ద్వారా తాము పైచేయి సాధించామనీ, గతంలో ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే జగన్‌ని అడ్డుకుని వెనక్కి పంపించారో.. బాబును కూడా అక్కడే నిరోధించి వెనక్కి పంపించామనీ వైసీపీ నేతలు లోలోపల సంబర పడుతున్నారు. ఒకవేళ విశాఖలో చంద్రబాబు యాత్ర సాఫీగా సాగి టూర్‌ మొత్తం సక్సెస్‌ అయితే.. ఈ ప్రాంత ప్రజలు రాజధానిని బలంగా కోరుకోవడం లేదన్న సంకేతాలు బయటికి వెళతాయనీ.. అందుకే ఆయనను వ్యూహాత్మకంగా అడ్డుకున్నామనీ వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌ వల్ల ఉత్తరాంధ్రులు రాజధాని కోసం పట్టుదలతో ఉన్నారన్న ప్రచారం గట్టిగా చేయగలుగుతామనీ, విశాఖతోపాటు మొత్తం ఉత్తరాంధ్రలోనే తమకి ఆదరణ పెరుగుతుందనీ వైసీపీ వ్యూహకర్తలు భావించారట.

   లోకల్‌గా బాబు పర్యటిస్తే.. ల్యాండ్‌ పూలింగ్‌లో బాధితుల గోడు చర్చనీయాంశం అవుతుందనీ, పెందుర్తి ఎమ్మెల్యే బాగోతాలు కూడా బహిర్గతమై తమ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనీ వైసీపీ నేతలు భావించారట. అందుకే బాబు యాత్రకి బ్రేక్‌ వేయాలని ముందే ఫిక్సయ్యారట. కానీ ప్రజలేం తక్కువవాళ్లు కాదు కదా? జరిగిన ఘటనలో దాగిన మర్మం ఏంటో వారు గ్రహించేశారు. వైసీపీ నేతల ఆరాచకాన్ని ప్రత్యక్షంగా చూశారు. విశాఖని రాజధాని చేస్తే రేపటినాడు రాయలసీమ గ్యాంగులు సాగరతీర సంస్కృతిని నాశనం చేస్తారన్న అభిప్రాయం వారిలో మరింత బలపడింది. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఈ మేరకు మూల్యం చెల్లించుకుంటుందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు కూడా! ఇలా అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తే విశాఖ ఎపిసోడ్‌ వల్ల వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీయే లాభపడిందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై టీడీపీ ముఖ్య నేతలు కూడా అంతర్మథనం జరుపుతున్నారు. విశాఖ నగర పరిధిలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలను ఎందుకు అడ్డుకోలేకపోయామని వారు అంతర్గతంగా చర్చిస్తున్నారు.

    విశాఖ ఎపిసోడ్‌లో పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి స్పష్టమైన కారణాలున్నాయి. తొలుత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతించినప్పటికీ.. కొన్ని షరతులు పెట్టారు. పరిమిత సంఖ్యలోనే నేతలను అనుమతిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో బాబు పర్యటనను పురస్కరించుకుని నిరసనలు తెలియజేస్తామని వైసీపీ నేతలు పోలీసులకు తెలియజేశారు. అదే జరిగితే నిరసనకారులను అరెస్టుచేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో తెలుగుదేశం నేతలు సైలెంట్‌ అయ్యారు. చంద్రబాబు వచ్చే ముందు వరకూ వైసీపీ క్యాడర్‌ని అడ్డుకున్న పోలీసులు.. ఆయన వచ్చాక మాత్రం వారిని ఎయిర్‌పోర్ట్‌లోకి వదిలేశారు. దీంతో జరిగిన రభస, బాబూ టూర్‌ క్యాన్సిల్‌ కావడం, తెలుగుదేశం నేతలు కోర్టు గడప తొక్కడం, ప్రభుత్వం డిఫెన్స్‌లో పడటం వంటి ఘటనలన్నీ అందరికీ తెలిసినవే!

   విశాఖ ఘటన తర్వాత వైసీపీ పెద్దలు నష్టనివారణ చర్యల కోసం ప్రయత్నించారు. బాబు పర్యటనను అడ్డుకున్నది తాము కాదనీ, విశాఖ ప్రజలు, ప్రజాసంఘాల నేతలని బుకాయించారు. కానీ కోర్టు సీరియస్‌ అయ్యి, పోలీసులు కేసులు నమోదు చేయడం మొదలయ్యాక.. వారి స్వరం బలహీనమైపోయింది. విశాఖలోని అధికారపక్ష నేతలతోపాటు.. కార్యకర్తల్లోనూ భయం తాండవిస్తోంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారని తెలుగు తమ్ముళ్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో, క్యాడర్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది. చూద్దాం ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఎవరిది పైచేయి అవుతుందో..!

అమరావతిపై తీర్మానం చేసినా.. కేంద్రం వినాలని లేదు

అమరావతిపై తీర్మానం చేసినా.. కేంద్రం వినాలని లేదు
మా రాష్ట్ర పార్టీ కోరినవన్నీ చేయాలని లేదు

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదే!: జీవీఎల్‌

న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానించింది నిజమేనని, అయితే కేంద్రం దానిని వినాలని లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. పీపీఏ రద్దుపై రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టినప్పటికీ, కేంద్రం రాష్ట్రంపై చర్యలు తీసుకోగలిగిందా అని ప్రశ్నించారు. సహచర బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడిన 2-3 గంటలకే గురువారం రాత్రి జీవీఎల్‌ హడావుడిగా మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని లేదని చెప్పారు. పార్టీపరంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయాలని కోరుతుంటామని.. కానీ కేంద్రం అలా చేయదని తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని పునరుద్ఘాటించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి సైతం వేసవి రాజధానిని ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు.



అమరావతి గురించి గానీ, రాజకీయాల గురించి గానీ బీజేపీ అధిష్ఠానం అనుమతితోనే తాను ప్రతి విషయం మాట్లాడతానని స్పష్టీకరించారు. రాజధాని విషయంలో పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వంతో చర్చించాకే చెబుతుంటానన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందని, నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పేర్కొందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదన్నారు. ఎవరైనా కేంద్రం చేతిలో అధికారం ఉందని అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని స్పష్టంచేశారు.



ఇటీవల విజయవాడలో నగర ప్రముఖులు, మేధావులతో ఆ ప్రాంత సమస్యలపై సమావేశం జరిగిందని, కొందరు జేఏసీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, వారు రాజధానిపై ఉన్న అనిశ్చిత పరిస్థితిని ప్రస్తావించారని తె లిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో పరిమితులు ఉంటాయని వారికి చెప్పానన్నారు. రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చిందని తెలిపానని చెప్పారు. సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు గనుక కచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పానన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందో, ఏయే మౌలిక సదుపాయాలు కల్పించనుందో వివరంగా చెప్పానని తెలిపారు.



నాపై ఫేక్‌న్యూస్‌..

తనను కించపరిచే విధంగా ఒక చానల్‌ ఫేక్‌న్యూస్‌ నడుపుతోందని జీవీఎల్‌ ఆరోపించారు. ఆ చానల్‌ పేరు చెప్పనని.. మరోసారి ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మళ్లీ తనపై కట్టుకథలు అల్లితే సమాచార ప్రసారశాఖకు ఫిర్యాదు చేస్తానని సదరు చానల్‌ను హెచ్చరించారు.

రాజ్యసభకు నత్వానీ ఖాయం!

రాజ్యసభకు నత్వానీ ఖాయం!
మిగతా 3 స్థానాలకు పోటాపోటీ
రేసులో వైవీ, అయోధ్య, మస్తాన్‌రావు
మంత్రులు బోస్‌, మోపిదేవిల్లో ఒకరికే?
ద్వైవార్షిక పోరుకు నోటిఫికేషన్‌ జారీ
ఎన్నిక అనివార్యమైతే 26న పోలింగ్‌


అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ వ్యవహారాలు) పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో వైసీపీకి మూడు మాత్రమే దక్కుతాయని అధికార పక్షంలో జోరుగా చర్చ జరుగుతోంది. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఇటీవల కలసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పార్టీలోని వారికే రాజ్యసభను ఇవ్వాలని భావిస్తున్నామని సీఎం చెప్పినా.. నత్వానీకి సీటు ఖాయమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎం.ఎ.ఖాన్‌, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, కె.కేశవరావు పదవీ విరణ చేయనుండడంతో.. ఆ ఖాళీల భర్తీ కోసం అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి బాలకృష్ణమాచార్యులు శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌  జారీ చేశారు. శుక్రవారం నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ దాఖలు చేయవచ్చు. 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఆఖరు తేదీ ఈ నెల 18. ఎన్నికలు అనివార్యమైతే 26న వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో పోలింగ్‌ జరుగుతుంది. కాగా, రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకూ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, నరసరావుపేట లోక్‌సభ టికెట్‌ను ఆశించి.. చివరిలో రేసు నుంచి వైదొలగిన ‘రాంకీ’ అయోధ్యరామిరెడ్డి, ఒంగోలు పార్లమెంటు టికెట్‌ దక్కని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్‌ ఖాయమని పార్టీ వర్గాలు ఇప్పటి వరకూ చెబుతూ వచ్చాయి. అయితే ఇటీవల శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడంతో.. మండలి సభ్యులైన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పదవులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బలహీన వర్గాలకు చెందిన ఈ ఇద్దరికీ రాజ్యసభలో అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే సమయంలో నెల్లూరు నేత బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని అంటున్నారు. నత్వానీ, వైవీ సుబ్బారెడ్డి, మస్తాన్‌రావులకు రాజ్యసభలో స్థానం కల్పిస్తే.. మిగిలేది ఒక సీటే. దానిని బోస్‌కు ఇవ్వాలా.. మోపిదేవికి ఇవ్వాలా అనేది ప్రస్తుతం చిక్కుముడిగా మారినట్లు తెలిసింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారని సమాచారం.

చక్ర బంధంలో చంద్రబాబు! 530 Cr. Hawala Case.

చక్ర బంధంలో చంద్రబాబు!
Mar 07, 2020, 03:52 IST
IT department to issue notices to Chandrababu - Sakshi
సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు మూడోసారి ఐటీ నోటీసు

విరాళంగా సేకరించిన రూ.550 కోట్లకు లెక్కలు చెప్పాల్సిందేనని స్పష్టీకరణ

ఆ రూ.550 కోట్లను హవాలా మార్గంలో అహ్మద్‌ పటేల్‌కు చేరవేసిన బాబు

పటేల్‌ విచారణ తర్వాత.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్న ఐటీ శాఖ

హవాలా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐవో

సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్‌–13ఏ ప్రకారం రాజకీయ పార్టీలు రూ.2,000 వరకూ విరాళాలను నగదు రూపంలో తీసుకోవచ్చు. అంతకంటే అధిక మొత్తాన్ని విరాళంగా స్వీకరించాల్సి వస్తే చెక్‌ రూపంలో గానీ.. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా గానీ.. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు హవాలా మార్గంలో రూ.550 కోట్లను ఎన్నికల విరాళంగా చేరవేసినట్లు బాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌) పెండ్యాల శ్రీనివాస్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డాక్యుమెంట్ల ద్వారా ఐటీ శాఖ గుర్తించింది.


నిబంధనలకు విరుద్ధంగా రూ.550 కోట్లను విరాళంగా సేకరించడంపై విచారణకు హాజరు కావాలని సెక్షన్‌–131 కింద ఐటీ శాఖ తొలుత ఫిబ్రవరి 11న అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. రెండోసారి ఫిబ్రవరి 18న ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుకూ అహ్మద్‌ పటేల్‌ స్పందించలేదు. దాంతో మార్చి 5న ఐటీ శాఖ మరోసారి నోటీసు జారీ చేసింది. ఈసారి విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అహ్మద్‌ పటేల్‌ను హెచ్చరించింది. అహ్మద్‌ పటేల్‌ను విచారించిన తర్వాత ఆయనకు హవాలా మార్గంలో నిధులు చేరవేసిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి, విచారిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

- ఐటీ శాఖ ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు కాంట్రాక్టు సంస్థల్లో సోదాలు చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్‌  పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, నారా లోకేశ్‌ సన్నిహితుడు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి(డీఎన్‌సీ ఇన్‌ఫ్రా), మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌(అవెక్సా ఇన్‌ఫ్రా) నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
- పెండ్యాల శ్రీనివాస్‌ ఇల్లు, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీగా అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.550 కోట్లను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ద్వారా హవాలా మార్గంలో చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వాటి ఆధారంగానే అహ్మద్‌ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేశారు.
- ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లుగా వసూలు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఖర్చుల కోసం చంద్రబాబు సమకూర్చారని ‘సాక్షి’ అప్పట్లోనే వెల్లడించింది.
- హవాలా మార్గంలో చంద్రబాబు చేరవేసిన నిధులను అహ్మద్‌ పటేల్‌.. అదే పద్ధతిలో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహిత కాంట్రాక్టు సంస్థలకు, కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే డీకే శివకుమార్‌ను ఈ అంశంపై విచారించిన ఐటీ శాఖ.. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌తోపాటు ఆయన సన్నిహిత కాంట్రాక్టు సంస్థలను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది.
- అహ్మద్‌ పటేల్‌ను, కమల్‌నాథ్‌ సన్నిహితులను విచారించిన తర్వాత.. అక్రమ లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది.
- విచారణలో చంద్రబాబు వెల్లడించే అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

రంగంలోకి ఎస్‌ఎఫ్‌ఐవో!
- చంద్రబాబు నిర్వహించిన హవాలా రాకెట్‌ను తీవ్రమైన ఆర్థిక నేరంగా సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసు(ఎస్‌ఎఫ్‌ఐవో) పరిగణిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమైంది.
- ఐటీకి సమాంతరంగా ఈ నేరంపై విచారణ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐవో డైరెక్టర్‌ అమర్‌దీప్‌సింగ్‌ భాటియా నిర్ణయించారు.
- చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎస్‌ఎఫ్‌ఐవో బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

Thursday, March 5, 2020

ఏకకాలంలో ప్రజా, న్యాయ పోరాటం

ఏకకాలంలో ప్రజా, న్యాయ పోరాటం
రిజర్వేషన్‌ తగ్గింపు వైసీపీ ఉన్మాద చర్య: చంద్రబాబు

అమరావతి, మంగళగిరి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది. పూలే, ఎన్టీఆర్‌ ఆదర్శాలను వైసీపీ కాలరాస్తోంది. బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గింపు వైసీపీ ఉన్మాద చర్య. దీనిపై అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలి. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు జరపాలి. దీనిపై ఇప్పటికే బీసీ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపాం. సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ వేస్తున్నాం. అటు న్యాయపోరాటాన్ని, ఇటు ప్రజాపోరాటాన్ని ఉధృతం చేయాలి’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గురువారం ఉదయం టీడీపీ బీసీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.



‘‘టీడీపీ అంటే బీసీ.. బీసీ అంటే టీడీపీ. అందుకే జగన్‌ బీసీలపై కక్ష సాధిస్తున్నారు. బీసీ రాజకీయ సాధికారతకు వైసీపీ సమాధి కడుతోంది’’ అని ధ్వజమెత్తారు. మౌనంగా ఉంటే వైసీపీ ఉన్మాదం పెట్రేగిపోతోందన్నారు. బీసీల హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, బీసీ రాజకీయ సాధికారతను కాపాడుకోవాలని, 34 శాతం బీసీ రిజర్వేషన్‌ను కాపాడుకోవాలని సూచించారు. బీసీలు పోరాడి సాధించుకున్న హక్కు 34% రిజర్వేషన్‌ అనీ, ఇప్పుడు పోగొట్టుకుంటే తిరిగి రాదని స్పష్టం చేశారు. దీనిని తాకట్లు పెట్టే అధికారం, పొట్టకొట్టే అధికారం వైసీపీకి లేదన్నారు. కాగా.. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ కోత విధించిన వైసీపీకి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఓ ప్రకటనలో పిలుపిచ్చారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే హైకోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని బీసీలకు జగన్‌ తీరని అన్యాయం చేశారని.. 60 శాతం రిజర్వేషన్‌ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు పాలకొల్లులో డిమాండ్‌ చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 140 బీసీ కులాలకు నష్టం: అచ్చెన్న

140 బీసీ కులాలకు నష్టం: అచ్చెన్న
టీడీపీకి అండనే అణగదొక్కే కుట్రలు: అచ్చెన్న

గవర్నర్‌ని కలిసిన టీడీపీ బీసీ నేతలు

విజయవాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోంది. జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలు కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్‌ ఈ విధంగా చేస్తున్నారు’’ అని టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పార్టీ బీసీ నేతల బృందం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నరు హరిచందన్‌ను బుధవారం కలిసింది. అచ్చెన్నాయుడుతోపాటు అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. బీసీలకు 1987వ సంవత్సరం నుంచి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు 24 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. బీసీలకు నాడు తండ్రి, నేడు కొడుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. బీసీలకు 24 శాతం రిజర్వేషన్లపై ఆర్టినెన్స్‌ ముందుగా గవర్నరు వద్దకు వస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలని కోరారు.

Finance Commission doubles the local body grants

Finance Commission doubles the local body grants
According to the central government, there are over 2.6 lakh panchayats in India
Akshat Kaushal  |  New Delhi 
Last Updated at February 25, 2015 01:35 IST
Tiny URLAdd to My PagePrint Email
2

ALSO READ
Finance Commission gets 2-mth extension
Finance Commission raises questions on exclusion of goods from GST
Highlights of the 14th Finance Commission Report
Faces behind the 14th Finance Commission
Fourteenth Finance Commission in Hyderabad for consultations with Telangana govt


The Fourteenth Finance Commission has more than doubled the grant for local bodies and recommended that nearly all of this money be spent on improving basic services.

In its report, which covers the period between 2015 and 2020, the commission has fixed the grant at Rs 2.87 lakh crore - over Rs 2 lakh crore more than the Thirteenth Finance Commission's..


Read our full coverage on Union Budget

Of this money, nearly Rs 2 lakh crore has been allotted to panchayats, while the rest will go to municipalities. According to the central government, there are over 2.6 lakh panchayats in India. The Finance Commission's report notes the allotted grant works to Rs 488 per capita per annum.

The commission has divided the grant in two parts: A basic part and a performance part. The performance part would be dependent two factors. One, the local authority would need to have an audited account for the previous year. Second, it will have to demonstrate that it has increased its own revenue over the previous year.

In the case of gram panchayats, the commission has recommended the ratio between basic and performance grant as 80 and 20, while in the case of municipalities it has been kept at 90 and 10. To improve the utilisation of funds, the commission has recommended the grants should go directly to the gram panchayats and municipalities, without any share for other levels.

The commission has also asked the state governments to take action to facilitate local bodies to compile accounts and have them audited in time. To improve the resources of local bodies, the Finance Commission has suggested the state governments to empower local governments to impose advertisement tax and to assign productive local assets to panchayats.

The Commission also said "it is of the view that mining puts a burden on the local environment and infrastructure and therefore, it is appropriate that some of the income from royalties be shared with the local body in whose jurisdiction the mining is done. This would help the local body ameliorate the effects of mining on the local population."