Thursday, January 27, 2022

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

 పత్రికా ప్రకటన

విజయవాడ, 

తేది : 27-01-2022.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

గిరిజనుల అభివృద్ది కోసం రెండు గిరిజన జిల్లాలు

అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు.

విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఒంగోలు.. చిన్నజిల్లా విశాఖపట్నం.. 

వివరాలను వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ జి. ఎస్ఆర్ కెఆర్

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని.. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాలను విభజించామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని,  పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే గిరిజనాభివృద్దిలో భాగంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయవాడ ఎం.జీ. రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కార్యాలయంలో విజయ్‌ కుమార్‌ గురువారం మీడియా ప్రతినిధులకు వివరాలను తెలిపారు. 

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలనే అంశంపై భారీ కసరత్తు చేశామన్నారు.  పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధి ఎక్కువ అని.. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. పార్వతీపురం జిల్లాను పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు 4 నియోజకవర్గాలతోను..  అలాగే అరకు జిల్లాను అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం 3 నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటవుతాయని తెలిపారు. అందుకే రంపచోడవరం ప్రాంతం రాజమండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ  అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని తెలిపారు. 

శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని.. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని, విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని, అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించామని తెలిపారు. నరసాపురం జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ వచ్చింది కాబట్టి భీమవరం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందన్నారు.. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాకి కలుపుతామన్నారు. అలాగే నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాకి, హిందూపూర్ లోని రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపూర్ జిల్లాకి కలుపుతామన్నారు. తిరుపతి పార్లమెంట్ లోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకి కలపాలని.. తిరుపతికి చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ.. పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా ఉంటున్నట్లు తెలిపారు. 

26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు..  

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాల ఏర్పాటు పక్రియలో అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లా సరిహద్దు పరిధిలోకి రావాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ఆయన తెలిపారు.  పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 51 రెవిన్యూ డివిజన్లకు కొత్తగా 15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, 4 డివిజన్లను ప్రస్తుత రెవెన్యూ డివిజన్లకు కలపాలని ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్లలో విజయనగరం జిల్లాలో బొబ్బిలి  రెవెన్యూ డివిజన్, విశాఖపట్నం జిల్లాలో భీముని పట్నం రెవెన్యూ డివిజన్, నర్సాపురం జిల్లాలో భీమవరం రెవెన్యూ డివిజన్, విజయవాడ లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో నందిగామ, తిరువూరు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాపట్ల జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ కూడా లేదు కాబట్టి బాపట్ల, చీరాల డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు.  ఒంగోలు జిల్లాలో కనిగిరి రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో ఆత్మకూర్, డోన్ రెవెన్యూ డివిజన్లు, అనంతపూర్ జిల్లాలో గుంతకల్ రెవెన్యూ డివిజన్, హిందూపూర్ జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్, కడప జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్, రాజంపేట (రాయచోటి) జిల్లాలో రాయచోటి రెవెన్యూ డివిజన్, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపి 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్ లలో షిఫ్ట్ చేశామన్నారు. 

భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతను అనుసరించే విభజన జరిగిందని విజయకుమార్ స్పష్టం చేశారు.  26 జిల్లాల్లో అతి పెద్ద జిల్లాలుగా ఒంగోలు, అనంతపురం విస్తీర్ణంలో నిలిచాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాల్లో నల్లమల ఫారెస్ట్ ఎక్కువ భాగం ఉందని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువయినా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, ఇక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. చారిత్రక నేపథ్యాలను చూసి కూడా జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయవచ్చని విజయకుమార్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె. శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.

(జారీచేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ)

Monday, January 24, 2022

New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

 New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

Jan 25, 2022, 02:24 IST

New districts by Ugadi Festival In Andhra Pradesh - Sakshi

నేడో, రేపో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం


తెలుగు సంవత్సరాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికి కసరత్తు


కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు


దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 26కు..


ఇక ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లా


ఒక్క అరకు పార్లమెంటు నియోజకవర్గమే 2 జిల్లాలుగా..


అత్యంత శాస్త్రీయంగా కొత్త జిల్లాలపై అధ్యయనం


కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలూ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తింపు


సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 




కొత్తగా మరో 13 జిల్లాలు 

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. పార్లమెంటు స్థానాన్ని ఒక నియోజకవర్గంగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా సుదీర్ఘంగా విస్తరించి ఉండడంతో దాన్ని రెండు జిల్లాలుగా చేయాలని గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీ ప్రతిపాదనలు తయారుచేసింది. ఆ మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలున్నాయి. అంటే కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవికాక.. అక్కడక్కడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్నచిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది. అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. 

 

శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ 

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్‌ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల అయ్యే వ్యయాన్ని ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. 


తొలుత ప్రాథమిక నోటిఫికేషన్‌ 

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా  ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇస్తారు. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్‌ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయమత్తమవుతోంది.  

‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

 ‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

కేంద్రం నుంచి ఇతోధికంగా లోటు నిధులు

హైదరాబాద్‌ వదులుకున్నందుకు ఏపీకి

రూ. 17,000 కోట్లమేర లోటు గ్రాంట్‌

కేంద్ర పన్నుల్లో 3వేల కోట్లు రాష్ట్రానికి

ఇతరేత్రా కూడా ఢిల్లీ నుంచి సొమ్ములు

ఇవన్నీ కలిపి ఆదాయం 1,40,000 కోట్లు

గత ఏడాది కంటే 23 వేల కోట్లు ఎక్కువ

తెలంగాణ కంటే 2 వేల కోట్లే తక్కువ

అయినా, ఆదాయంపై అడ్డగోలు వాదనలు

2020-21లో రాష్ట్ర ఆదాయం రూ.1,17,000 కోట్లు

2021-22లో ఆదాయ అంచనా రూ. 1,40,000 కోట్లు

(ముగిసిన 8 నెలల కాలానికి ఇప్పటికే 88 వేలకోట్లు ఖజానాకు) 

ఈ ఆదాయంలో అత్యధికం కేంద్ర నుంచి వచ్చిన నిధులే

అనూహ్యంగా ఆదాయంలో 23 వేలకోట్ల పెరుగుదల

హైదరాబాద్‌ వదులుకున్నందుకు లోటుగ్రాంట్‌ 17 వేలకోట్లు

కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద మరో రూ.3 వేల కోట్లు


PlayUnmute

Fullscreen

VDO.AI


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సొంతంగా సంపద సృష్టించుకుని, ఆదాయం పెంచుకునే చర్యలేవీ లేవు! కానీ... రాష్ట్రానికి రూపాయి రాకలో ఏమాత్రం లోటు లేదు. కేంద్రం నుంచి రకరకాల రూపాల్లో సొమ్ములు ముడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా అదనపు సహాయమూ అందింది. అయినా సరే... కొవిడ్‌తో ఆదాయం పడిపోయిందని, జీతాలు పెంచలేమని సర్కారు చెబుతోంది.  కనీసం తెలంగాణకు తగ్గకుండా వేతన సవరణ చేయాలంటే.. ఆదాయం బాగా ఎక్కువ ఉన్న ఆ రాష్ట్రంతో పోలిక సరికాదంటోంది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని అధికారులే చెబుతున్నారు. రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం అందిస్తున్న చేయూతతో అనూహ్యంగా రూ. 23వేల కోట్ల మేర ఏపీ ఆదాయం పెరగనుంది. కేవలం 2వేల కోట్లు మాత్రమే ఆర్జనలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడింది. ఈ మాట సమ్మెకు వెళుతున్న ఉద్యోగులో, ప్రతిపక్షాలో అంటున్నది కాదు. ఒక ఏడాది రాష్ట్ర ఆదాయ గ్రాఫ్‌ పరిశీలించినా అర్థమయ్యేది ఇదే! నిన్న ‘కాగ్‌’ కూడా ఇదే చెప్పగా...జీతాల సమస్య తలెత్తకముందు ప్రభుత్వం కూడా ఔను..ఔను అంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.  

ఇవిగో గణాంకాలు..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఎవరు కాదన్నా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని సీఎం జగన్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రావత్‌ పదే పదే చెప్తున్నప్పటికీ అందులో పస లేనేలేదని వాస్తవిక గణాంకాలు నిరూపిస్తున్నాయి. కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ 8 నెలల గణాంకాలు పరిశీలిస్తే నెలకు సగటున రూ.11,500 కోట్లు చొప్పున ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో వచ్చిన ఆదాయం రూ.88,600 కోట్లు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు  నాలుగు నెలల పాటు కూడా ఇదే స్థాయిలో ఆదాయం లెక్కిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.1,38,000 కోట్లకు చేరుతుంది. మార్చిలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా కింద అదనంగా దాదాపు రూ.2000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఆదాయం రూ.1,40,000 నుంచి రూ.1,41,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.23,000 కోట్లు ఎక్కువ. 

అంతా కేంద్రం దయే..రాష్ట్రానికి పెరిగిన ఆదాయ అంచనాలో సింహభాగం అంటే రూ.17,257 కోట్లను కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు కింద ఇస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ఈ గ్రాంటుతో భర్తీ చేస్తోంది. ఇందులో మొదటి 8 నెలల్లో రూ.11,500 కోట్లు ఇచ్చేసింది. మిగిలిన రూ.5757 కోట్లను డిసెంబరు నుంచి మార్చిలో నెలల్లో ఇస్తుంది. హైదరాబాద్‌ ను కోల్పోయినందుకు ఇంత భారీగా గ్రాంటు వస్తున్నప్పటికీ విభజన నష్టాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గుతోందంటూ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే అవాస్తవాలు చెప్తున్నారు. ఈ 8 నెలల్లో ఏపీకి వచ్చిన రూ.88,600 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చినవి రూ.23,500 కోట్లు. ఇందులో  రూ.11,500 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు నిధులు, రూ.969 కోట్లు స్థానిక సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, మిగిలిన రూ.11,031 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు ఉన్నాయి. 

తిరిగి మూడేళ్లనాటి స్థితికి..పన్ను ఆదాయానికి వచ్చేసరికి చంద్రబాబు హయంలో తెలంగాణతో పోల్చితే ముందంజలో ఏపీ ఉంది. జగన్‌ వచ్చిన తొలి రెండేళ్లలో బాగా వెనుకబడి ఈ ఏడాది కొంత పురోగతి సాధించింది. చంద్రబాబు దిగిపోయే సంవత్సరం 2018-19లో ఏపీ పన్ను ఆదాయం రూ.62,395 కోట్లు కాగా, ఆ ఏడాది తెలంగాణకు వచ్చిన పన్ను ఆదాయం రూ.59,612 కోట్లు. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఈ వ్యత్యాసం కొంత మేర తగ్గింది. పన్ను ఆదాయం రూ.62,962 కోట్లు రాగా, తెలంగాణకు రూ.64,857 కోట్లు వచ్చింది. అంటే... ఏపీ కంటే తెలంగాణ పన్ను ఆదాయం కేవలం రూ.1895 కోట్లు మాత్రమే ఎక్కువ. 

కొసమెరుపు  ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని సీఎం చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం పెరిగే జీతాలు తమకొద్దని, పాతజీతాలే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నారు. వారు కోరినట్టుగా... పాతజీతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో తక్కువ జీతాలు ఇచ్చి ఖజానాకు రూ.10,700 కోట్లు మిగిల్చినట్టే! మరి ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయడం లేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Thursday, January 20, 2022

PRC issue

 

శక్తికి మించి చేశాం..

Perni Nani Comments about Government employees  - Sakshi

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  

జీతాలు తగ్గితే ప్రభుత్వంపై జీతాల భారం ఎందుకు పెరిగింది? 

వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు గమనించాలి.. ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ

అందుకే సీఎం అయిన వారం లోపే 27 శాతం ఐఆర్‌  

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఎంఎన్‌ఓల జీతాల పెంపు

కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి 

అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది 

ఇవన్నీ గమనించకుండా భ్రమలు కల్పిస్తూ వక్రీకరణలు తగవు 

నేతల పనులతో ఉద్యోగుల భవిష్యత్‌కు ఇబ్బంది కలిగే పరిస్థితి  

ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వమిదని, భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామని సమాచార, పౌర సంబ«ంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రేమ, సానుభూతి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వారంలోనే 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించారని చెప్పారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదన్న విషయం వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు శక్తికి మంచి చేశామని, పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, వ్యయం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొంత మంది వక్రీకరణలను గమనించి, సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతూ మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడకూడదని, ఇది ముమ్మాటికీ మీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

ఉద్యోగులు మనసు పెట్టి ఆలోచించాలి 
► సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణం. ఉద్యోగుల భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. 
► కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నివృత్తి చేస్తాం.

ఆదాయం దారుణంగా తగ్గింది 
► వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే నాటికి, అంటే 2018 –19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు. ఏడాది తర్వాత 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండింది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది.
► 2020–21లో ప్రభుత్వ ఆదాయం రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్‌ వల్ల దాదాపు రూ.21 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. కోవిడ్‌ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఒకవైపు ఆదాయం తగ్గగా, మరో వైపు ఖర్చులు పెరిగాయి. మరో వైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను పూర్తిగా రాలేదు. 
► 2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు అది తగ్గిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు.
► పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చలేనందుకు సీఎం జగన్‌ కూడా బాధ పడుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం గతంలో ఉద్యోగులు ఆందోళన చేస్తే, చంద్రబాబు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు.
► ఉద్యోగులపై కేసులను సీఎం జగన్‌ 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేయడం వాస్తవం కాదా? నాడు కేసులు పెట్టిన వారు ఇవాళ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. యూపీ, గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్‌ఆర్‌ఏ ఎలా ఇస్తున్నారు? బీజేపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి.   

ఐఆర్‌పై వక్రీకరణలు తగునా?
► ఐఆర్‌ అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐఆర్‌ ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసి, జీతాలను ఖరారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదట నుంచి అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అంతే. 
► ఈ విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ కూడా ఐఆర్‌ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏర్పాటైన వారం రోజుల్లోనే ఎవరూ అడక్కపోయినా 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 
► 7,55,075 మంది ఉద్యోగులకు ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్‌ శాలరీలో ఒక సబ్‌ కాంపొనెంట్‌. ఇదే హెచ్‌ఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్‌ఇండియా ఆఫీసర్స్, పోస్టల్‌ ఉద్యోగులకూ ఇస్తున్నది వాస్తవం కాదా?

వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా?
► అంగన్‌వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా?
► మినీ అంగన్‌వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7 వేలు చేయ లేదా?
► వీఓఏ, సంఘమిత్రలు, యానిమేటర్స్‌ జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచలేదా?
► శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి 18 వేలకు పెంచలేదా?
► శానిటరీ సూపర్‌ వైజర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచలేదా?
► ఆశా వర్కర్ల జీతాలు 2018కు ముందు రూ.3వేల –6వేలు ఉంటే, వాటిని రూ.10 వేలకు పెంచ లేదా?
► ఎంఎన్‌ఓ జీతాలను రూ.6,700 నుంచి రూ.17,746కు పెంచలేదా?
► కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచ లేదా?
► హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్‌లను రూ.600 నుంచి రూ.710కి పెంచ లేదా?
► కుక్‌ కం హెల్పర్ల జీతాలను రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచలేదా?
► కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఏటా జీతాల రూపంలో రూ.1100 కోట్ల చెల్లింపులు ఉంటే, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నది సుమారు రూ.3 వేల కోట్లు.  ఇది మేలు కాదా?
► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయ లేదా? ఇవన్నీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు కాదా?

ఇవన్నీ నిజాలు కావా?
► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. దీనివల్ల రెండేళ్ల సర్వీసు పెరగడంతోపాటు 24 నెలల జీతం అదనంగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లాభం కాదా? 
► నెలకు రూ.1 లక్ష జీతం అందుకునే ఉద్యోగికి రెండేళ్ల కాలంలో రూ.24 లక్షలు జీతం రూపేణా వస్తాయి. దీనివల్ల ఆయా ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసినట్టు కదా?
► రెండేళ్ల అదనపు సర్వీసుతో పాటు ఆ సమయంలో 4 డీఏలు, 2 ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇది వారికి మేలు చేసినట్టు కాదా? 
► సర్వీసు పెరగడం వల్ల పెన్షన్‌ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ పెరగదా? 
► దేశంలో ఎన్నిచోట్ల 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉంది?
► సర్వీసు కాలానికి గ్రాట్యుటీ కింద ఇదివరకు ప్రభుత్వం ఇచ్చేది రూ.12 లక్షలు. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచడం మేలు చేసే నిర్ణయం కాదా? 
► ఏ ఉద్యోగి అడగకపోయినా ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నది మేలు చేయడం కాదా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10% స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన మాట వాస్తవం కాదా? ఈ స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలన్నది మేలు చేసేది కాదా? దీనివల్ల నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి కలగడం లభించదా?
► కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్‌ 30లోగా నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా?
► ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.28 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగులకు మేలు చేసేలా రెండున్నరేళ్లకే రెగ్యులరైజ్‌ చేస్తోంది. 2022 జూన్‌ 30తో వీరి ప్రొబేషన్‌ ముగుస్తోంది. జూలై 1 నుంచి రెగ్యులర్‌ స్కేలు అమల్లోకి వస్తోంది. దీనివల్ల వారికి గణనీయంగా జీతాలు పెరుగుతున్న మాట నిజం కాదా?
► కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేలు వర్తింపు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది కాదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దళారీల బారి నుంచి బయట పడేయలేదా? వారికి కత్తిరింపులు లేకుండా, లంచాలకు తావివ్వకుండా పూర్తి జీతాలు అందించడం లేదా? వీరందరికీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలను కల్పించడం వాస్తవం కాదా? వీరికి కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింప చేయడం మేలు చేసే నిర్ణయం కాదా? ఇలాంటి పనులు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశాయా?
► కేంద్ర ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సు 14.29 శాతమే. కాని ఈ ప్రభుత్వం ఇంతటి పరిస్థితుల్లో కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజం కాదా? ఐఆర్‌ రూపంలో రూ.17,918 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విషయం వాస్తవం కాదా?
► 2018–19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,503 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.52,513 కోట్లు. అంటే 84 శాతం జీతాల రూపంలో చెల్లించారనే విషయాన్ని గమనించాలి.  
► 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.60,688 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.67,340 కోట్లు. 111% జీతాల రూపంలో చెల్లించడం నిజం కాదా?

జీతాలు ఎలా తగ్గుతాయి?
► మొత్తంగా గ్రాస్‌ శాలరీ పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి.  
► ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు రూ.60,177 కోట్లు అయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఇకపై రూ.70,424 కోట్లు  చెల్లింపులు ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం రూ.10,247 కోట్లు పడుతుంది. ఈ పరిస్థితిలో జీతాలు తగ్గుతాయన్న వాదనకు ఆస్కారం ఎక్కడిది?
► ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు వాస్తవాలు చెప్పి ఉద్యోగులను మంచి దిశగా జాగృతం చేయాల్సింది పోయి వక్రీకరణలు చేయడం సబబేనా? ఉద్యోగులను పెడదోవ పట్టించడం న్యాయమేనా?
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు లాంటి వారి చేతిలో నాయకులు కీలు బొమ్మలు కావడం తగునా? వారికి అమ్ముడుపోయి వక్రీకరణలు చేయడం సరైనదేనా? ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా, మేలు జరగనట్టుగా భ్రమలు కల్పించి వక్రీకరణలతో ఉద్యోగులను రెచ్చగొట్టడం కరెక్టేనా?
► ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న పనులు ఉద్యోగుల భవిష్యత్తుకు భంగకరంగా మారదా? భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఐఆర్‌ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఉద్యోగులకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునేలా ఉండాల్సిన పరిస్థితులను ధ్వంసం చేస్తే, దెబ్బతినేది ఉద్యోగులు కాదా? ఈ విషయాలను అందరూ గమనించాలి.  

Wednesday, January 12, 2022

Jagan అంతులేని దోపిడీ!

 అంతులేని దోపిడీ!

Jan 12 2022 @ 02:24AMహోంఆంధ్రప్రదేశ్


గ్రానైట్‌, బాక్సైట్‌, లేటరైట్‌ అన్నీ స్వాహా

కుప్పంలోనే 250 అక్రమ క్వారీలు

సిగ్గువదిలి రెచ్చిపోతున్నారు.. 7 లక్షల కోట్లకు చేరిన అప్పులు

జగన్‌కు పోయేదేమీ లేదు.. రాష్ట్రమే మునిగిపోతుంది

సినిమా టికెట్లు సరే.. సిమెంటూ తగ్గించండి

సినిమా వాళ్లంతా టీడీపీయేనా?.. నాకు వ్యతిరేకంగా 

సినిమాలు తీయలేదా?.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌


అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మొత్తం గనుల దోపిడీ ఆకాశాన్నంటిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రానైట్‌, బాక్సైట్‌, లేటరైట్‌.. అదీ ఇదీ అని లేకుండా దొరికినకాడికి దోచుకుపోతున్నారని దుయ్యబట్టారు. మంగళవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కుప్పంలో ఏకంగా 250 అక్రమ గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయని అన్నారు. ‘అధికార పార్టీ అండతో విచ్చలవిడిగా సంపాదించి అహంకారం తలకెక్కి చిన్న చిన్న రౌడీలు కూడా ఏకంగా నాపైనే బాంబులు వేస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా అక్రమ క్వారీయింగ్‌ను ఆపాలని అడిగితే వారి ఇళ్లకు కరెంటు కత్తిరిస్తామని.. మరీ మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ క్వారీయింగ్‌ లేనే లేదని ఒక మంత్రి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

ఇదే సర్టిఫికెట్‌ ఇవ్వడానికి మరో మంత్రి విశాఖ నుంచి తిరుపతి వచ్చాడు. పోదాం రా.. ఉందో లేదో చూద్దాం. తప్పుడు పనులు చేసేవారు గతంలో సిగ్గుపడేవారు. ఇప్పుడు సిగ్గు వదిలి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. స్మగ్లర్లు పాలకులై పోలీసులు వారికి రక్షణగా నిలవడంతో అక్రమ రవాణా ఇంకా పెచ్చుమీరిపోయింది. దీనిని ప్రశ్నించారని మా వాళ్లపై యుద్ధం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. ఎంత అవినీతి చేసి ఎంత అక్రమంగా సంపాదించినా.. ఆదాయపు పన్ను కట్టారు కాబట్టి అంతా సక్రమమేనని ఐటీ శాఖ ధ్రువీకరణలు ఇచ్చేటట్లయితే దేశంలో ఇక అవినీతి చట్టాలు ఎత్తివేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చెందిన మీ డియా సంస్థకు ఐటీ శాఖ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ వచ్చిన వార్తలను ప్రస్తావించినప్పుడు ఆయనీ వ్యాఖ్య చేశారు. ప్రజల కోసం సినిమా టికెట్లు ధరలు తగ్గించామని చెబుతున్నారని, అదే నిజమైతే ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ తయారు చేసే సిమెంటు రేట్లు ఎలా పెరిగాయని చంద్రబాబు ప్రశ్నించా రు. ‘ఆ సిమెంటును కొనేవాళ్లు ప్రజలు కాదా? కంపెనీలన్నీ కలిసి కార్టెల్‌(ముఠా) కట్టి ఇష్టానుసారం పెంచుకుంటున్నారు. ఈ మధ్య కూడా ముఖ్యమంత్రి కంపెనీ బస్తాకు రూ.30-40 పెంచింది. మేం ఉన్నప్పుడు సిమెంటు కంపెనీలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే గట్టిగా హెచ్చరించి ఆపు చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్లను ఆపేవాళ్లు లేకుండా పోయారు’ అని అన్నారు.

బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనం..వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ ఘోరంగా పడిపోయి ఇతర రాష్ట్రాల వారు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ముఖ్యమంత్రులందరూ కలిసి రూ.3 లక్షల కోట్ల అప్పులు తెస్తే ఈ ముఖ్యమంత్రి రెండున్నరేళ్లలోనే దానిని ఏకంగా రూ.7 లక్షలకు చేర్చారని, వాయిదాలు.. అసలు కలిపి ఇంత అప్పు రాష్ట్రం ఎలా తీర్చగలదని ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి పోయిందేమీ లేదని.. దోచుకున్నంత దోచుకుని పోతాడని, చివరకు రాష్ట్రం మునిగి పోతుందని వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికులు, పేద వర్గాల ప్రజలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగులు సహా ఏ వర్గం కూడా ఆనందంగా పండగ జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా విషయంలో కొంతకాలంపాటు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కుప్పంలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేసి కొట్టారని బాబు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. ’’

సినిమా వాళ్లంతా టీడీపీయా?చిరంజీవి 2009లో పార్టీ పెట్టలేదా?

నేను సీఎంగా ఉండగానే నాకు వ్యతిరేకంగా సినిమాలు తీయలేదా: బాబుసినిమా వాళ్లతో తగాదా వస్తే వాళ్లంతా టీడీపీ అంటూ పనికిమాలిన నిందలు వేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘సినిమా వాళ్లంతా మా పార్టీ వాళ్లా? 2009లో చిరంజీవి పార్టీ పెట్టి మాపై పోరాడలేదా? ఆయన అప్పుడూ, ఇప్పుడూ నాకు మంచి మిత్రుడే. కానీ పార్టీ పెట్టాడు.. పోరాటం చేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే నాకు వ్యతిరేకంగా సినిమా తీశారు. అంతా మా వాళ్లయితే నాపై సినిమాలు ఎలా వస్తాయి? ప్రతి వాడినీ చెయ్యి మెలిపెట్టి తమ మాట వినాలని వేధించడం నీచం’ అని మండిపడ్డారు.

Thursday, January 6, 2022

పీఆర్సీపై సీఎం వద్దా వాయిదా దరువే

 అన్నీ అబద్ధాలే!

Jan 7 2022 


ఆదాయం, జీతాలపై వాస్తవ విరుద్ధ అంకెలతో అడ్డగోలు వాదన


పీఆర్సీపై సీఎం వద్దా వాయిదా దరువే సంపన్న రాష్ట్రాన్ని దెబ్బతీసి.. బీద అరుపులా?

జగన్‌ తీరుపై నిపుణులు, ఉద్యోగుల ఆగ్రహంఇసుక నుంచి మద్యం దాకా అన్నీ అస్తవ్యస్తమే రాజధానీ లేకుండా చేసి ఆర్థికానికి చేటుపన్నుల్లో నాడు తెలంగాణ కంటే 3 వేల కోట్ల మిగులు.. నేడు 5 వేల కోట్ల వెనకబాటుతెలంగాణతో పోల్చవద్దంటూనే ఆదాయ వ్యత్యాసాల ప్రస్తావనపది వేల కోట్ల తేడా ఉన్నప్పుడే 43ు ఫిట్‌మెంట్‌ ఇచ్చిన చంద్రబాబుఇప్పుడు ఆ వ్యత్యాసం తగ్గినా గగ్గోలుసర్కారు తీరుపై ఉద్యోగుల మండిపాటు

రాష్ట్ర ఆదాయం రెండేళ్లుగా తగ్గుతోందని.. వేతన సవరణపై ప్రాక్టికల్‌గా ఆలోచించాలని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మిగులు రాష్ట్రాన్ని చేజేతులా దెబ్బతీసి.. బీద అరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాంతర వ్యవస్థలను తెచ్చి కార్యకర్తలకు వేల కోట్లు చెల్లించడం భారం కాదా అని నిలదీస్తున్నారు. పెరిగిన ఆదాయాలను దాచి.. పెరగనివాటిని ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయేముందు 2018-19లో పన్ను ఆదాయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశే సంపన్న రాష్ట్రం. ఆ ఏడాది తెలంగాణ కంటే  మన రాష్ట్ర పన్ను ఆదాయం రూ.3,000 కోట్లు ఎక్కువ. పన్ను ఆదాయమనేది రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన సూచిక. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రతిబింబం. అలా రూ.3,000 కోట్ల మిగులుతో చంద్రబాబు అప్పజెప్పిన రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి తన తలాతోకా లేని విధానాలతో కుళ్లబొడిచి.. రూ.5,000 కోట్లు వెనుకబడేలా చేశారని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ఈ నష్టాలకు కారణం ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడం కాదని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ఇసుక విధానాన్ని అల్లకల్లోలం చేసింది. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. పనులు ఆగిపోయాయి. కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. సిమెంటు, ఐరన్‌ ఇతర వస్తువుల అ మ్మకాలు తగ్గి రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గింది. ఆ తర్వాత మద్యం పాలసీ. 2020-21లో కేవలం ఏపీ లిక్కర్‌ విధానం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారిగా మద్యంపై ఆదాయం రూ.4 వేల కోట్లు పెరిగింది. ఇవన్నీ ఆంధ్ర ఖజానాకు నష్టం కలిగించినవే. అన్నిటినీ మించి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో అప్పటి వరకు రాజధాని అమరావతి చుట్టూ అల్లుకున్న ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. దీనివల్ల పన్ను ఆదాయం తగ్గింది. రెండు రాష్ట్రాల నడుమ 2015-16లో సొంత ఆదాయంలో దాదాపు పది వేల కోట్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ అప్పుడు చంద్రబాబు ఉద్యోగులకు భారీగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్ర వృద్ధి ఎక్కడా ఆగలేదు. 2018-19లో తెలంగాణ కంటే పన్ను ఆదాయంలో ఆంధ్ర మెరుగైన వృద్ధి సాధించింది. తెలంగాణ ఉద్యోగులకు ఆ ప్రభుత్వం జీతాలు ఎంత ఇస్తుందో కాగ్‌ నివేదికలో చూసిన వాళ్లు ఈ రెండేళ్లలో మన రాష్ట్ర పన్ను ఆదాయం ఏ రకంగా పడిపోయిందో చూడలేదా? కేవలం రాష్ట్రాల సొంత ఆదాయాల లెక్కలే చెప్పిన సీఎం.. ఏపీ, తెలంగాణల మొత్తం ఆదాయాల జోలికి ఎందుకు పోలేదు? ఎందుకంటే మొత్తం ఆదాయం చూసుకుంటే తెలంగాణ కంటే ఏపీ ఆదాయమే రూ.18 వేల కోట్లు ఎక్కువ కాబట్టి! అలాగే తెలంగాణకు ఈ రెండున్నరేళ్లలో ఆదాయం పెరగడానికి కారణం జగన్‌ అస్తవ్యస్త విధానాలేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కంపెనీలన్నిటినీ తరిమేయడంతో అవి హైదరాబాద్‌ వెళ్లిపోయాయని.. వాటి వల్ల తెలంగాణకు ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. గురువారం జగన్‌తో  భేటీ అనంతరం ఉద్యోగులంతా ఆయన మాట్లాడిన మాటలపై అంతర్గతంగా చర్చించారు. ఆయన చెప్పిన ఆదాయం లెక్కలపై పెదవివిరిచారు. ఆదాయంలో వ్యత్యాసం భారీగా ఉన్నా.. చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


రూ.700 కోట్లలో 200 కోట్లయినా రాలేదు


రాష్ట్రంలో ఇసుక అమ్మే పనిని జగన్‌ ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పింది. ఆ కంపెనీ ఖజానాకు రూ.700 కోట్లు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు కనీసం రూ.200 కోట్లు కూడా జమ చేయలేదు. మరి ఈ విధానం వల్ల రాష్ట్రానికి,  ప్రజలకు ఏం ఒరిగింది? అదే చంద్రబాబు చేసిన తరహాలో ఇసుకను ఉచితం చేస్తే నిర్మాణ రంగం ఊపందుకునేంది.రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి పన్నుల రూపంలో ఖజానాకు డబ్బులు వచ్చేవి. అలా వచ్చే డబ్బులు కచ్చితంగా రూ.700 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటాయనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. కాగ్‌ నివేదికల్లో జీతాలకు ఎంతెంత ఖర్చవుతుందో చూడడం కంటే.. పన్ను ఆదాయంలో ఏయే రంగాల్లో తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తుందో చూసి వాటిపై కసరత్తు చేస్తే ఖజానా నిండుతుందని వారు జగన్‌ సర్కారుకు సలహా ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో పన్ను ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువ పెరగడానికి గల కారణాల్లో ఇసుకను ఉచితంగా ఇవ్వడమూ ఒకటని చెబుతున్నారు. అదే సమయంలో రాజధాని అమరావతి పేరుతో ఊపందుకున్న కార్యకలాపాలు, ఉపాధి అవకాశాల వల్లా పన్ను ఆదాయం పెరిగిందని అంటున్నారు. 

7 నెలల్లోనే 4 వేల కోట్లు ఎక్కువరెండు తెలుగు రాష్ట్రాల సొంత ఆదాయాలను పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లోనే ఆంధ్ర కంటే తెలంగాణ ఆదాయం రూ.4,000 కోట్లు ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు మన రాష్ట్రానికి రూ.45,064 కోట్ల సొంత ఆదాయం రాగా.. తెలంగాణ సొంత ఆదాయం రూ.49,991 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచే నిర్ణయాలు తీసుకోకుండా ఖజానాపై భారం వేసే నిర్ణయాలు అమలు చేస్తుండడంవల్లే మన ఆదాయం తగ్గిందని ఉద్యోగులు  విమర్శిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికి, తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్‌ తీసుకొచ్చారని.. ఇప్పుడున్న వ్యవస్థలకు సమాంతరంగా తెచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని వారికి వేతనాల రూపంలో మళ్లిస్తున్నారని.. ఏటా ఖజానాపై రూ.2,040 కోట్ల భారం మోపారని దుయ్యబడుతున్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏడాదికి ప్రభుత్వంపై రూ.7,136 కోట్ల భారం పడుతుందని సీఎం చెప్పారని.. మరి రాజకీయ అవసరాల కోసం ఏర్పాటుచేసిన పై వ్యవస్థలపై పెడుతున్న రూ.2,040 కోట్ల ఖర్చు భారం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు.


అసలు విషయం దాచి..2014-15 నుంచి 2021-22 అక్టోబరు వరకు తెలంగాణతో పోల్చితే ఏపీ ఆదాయమే చాలా ఎక్కువగా ఉంటోంది. సీఎం చెప్పిన కాగ్‌ నివేదికల్లోనే ఈ అంశాలన్నీ ఉన్నాయి. కానీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయానికొచ్చేసరికి మొత్తం ఆదాయాల మాట పక్కనపెట్టి.. రాష్ట్ర సొంత ఆదాయాన్నే జగన్‌ ప్రస్తావించారు. తెలంగాణకు సొంత ఆదాయం కొంచెం ఎక్కువే అయినా.. ఆంధ్రకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఆ రాష్ట్రం కంటే మూడు రెట్లు ఎక్కువ. కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఏపీకే ఎక్కువగా వస్తోంది.



మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం 

Jan 07, 2022, 04:13 IST

Bandi Srinivas Rao Says We Hope CM Jagan Good PRC Employees - Sakshi

ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు 


సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై ప్రకటన వస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా ఆయన నోట్‌ చేసుకున్నారని తెలిపారు. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని పదే పదే తెలిపారన్నారు.




పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారని తెలిపారు. రాష్ట్ర విభజన, కోవిడ్‌ కష్టాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని సీఎం చెప్పారని, తెలంగాణకు హైదారాబాద్‌ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని సూచించారని తెలిపారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమావేశం సానుకూలంగా, ప్రశాంతంగా మంచి వాతావరణంలో సాగిందని చెప్పారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పని చేస్తామని తెలియజేశామన్నారు.  


సీఎం మంచి పీఆర్సీ ప్రకటిస్తారు.. 

ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది. కోవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వస్తుంది. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌కు తగ్గకుండా చూడాలని, కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎంను కోరాయి. హైదరాబాద్‌ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు.  

– ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) 


సీఎం మంచి చేస్తారనే నమ్మకం 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. 34 శాతం ఫిట్‌మెంట్‌ అడిగాం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్‌ అడిగాం. సీఎం జగన్‌ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుంది. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారని సమావేశంలో సీఎం జగన్‌ స్వయంగా చెప్పారు. అంత మాట చెప్పిన సీఎం.. ఉద్యోగులకు ఎందుకు మంచి చేయకుండా ఉంటారు? ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథం చూపే విషయంలో తనకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారని కూడా సీఎం తెలిపారు. ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను బేరీజు వేసుకోవాలనీ సీఎం చెప్పారు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.  

– కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 


రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం 

పీఆర్సీ సమస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ నెల 9వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోజున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఉంటుంది. అశుతోష్‌ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎం జగన్‌ను కోరాం. అధికారుల కమిటీ నివేదిక కరెక్టు కాదని సీఎంకు తెలియజేశాం. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో తేడాలు ఉన్నాయని వివరించాం. నాలుగు అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపాం. పది పీఆర్సీల్లో ఎక్కడా ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గిన దాఖలాలు లేవని వివరించాం. హెచ్‌ఆర్‌ఏపై చేసిన సిఫార్సులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపాం. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి వివరించాం. ఏడెనిమిది ఏళ్లుగా హెల్త్‌ కార్డులు నిర్వీర్యమయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాం. ఉద్యోగుల డిమాండ్లకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. 

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి  


మరో భేటీ ఉండకపోవచ్చు   

పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని, ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారు. పీఆర్సీపై మరో సమావేశం ఉంటుందని మేము భావించడం లేదు. ఇంత సేపు ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడిన పరిస్థితి గతంలో లేదు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. అందరం వారి వారి సమస్యల్ని సీఎం జగన్‌కు తెలియజేశాం. 

– కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత   



Jan 7 2022 @ 03:24AMహోంఆంధ్రప్రదేశ్కె

అంకెల్లో అన్నీ అసత్యాలే!


కేంద్ర సర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం

సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదు

పదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండి

కుదరకపోతే తెలంగాణస్థాయిలో ప్రయోజనాలు 

పీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

కల్లా ప్రకటన రాకపోతే ఆందోళనే: నేతలు 

కేంద్రసర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం

సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదుపదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండిపీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సీఎస్‌ కమిటీ చెప్పినట్టు కేంద్రం తన ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేసిందనేది పూర్తి అవాస్తవమని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తన ఉద్యోగులకు 32 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని పూర్తిస్థాయి లెక్కలతో సీఎంకు సమర్పించారు. అలాగే, హెచ్‌ఆర్‌ఏపై సీఎస్‌ కమిటీ చేసిన సిఫారసుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, ఉద్యోగులందరూ వేతనాలు కోల్పోతారని సీఎంతో జరిగిన సమావేశంలో వారు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు సీసీఏ ఎత్తేయడం దారుణమని, ప్రస్తుతం ఉద్యోగులకు సీసీఏ ఎంత ఆవశ్యకమో వివరిస్తూ సిద్ధం చేసిన నోట్‌ను సీఎంకి సమర్పించారు. అలాగే, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనం పొందే వయసును 70 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెంచుతూ సీఎస్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు తమ వ్యతిరేకతను సీఎం వద్ద తెలిపారు. 

సీఎంకు సమర్పించిన నోట్‌లోని అంశాలు: 11వ పీఆర్సీ కమిషన్‌ 27 శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసిందని సీఎస్‌ కమిటీ తన నివేదికలో చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పీఆర్సీ అమలులో 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చారని కూడా అదే నివేదికలో రాశారు. కాబట్టి రాష్ట్రంలో కూడా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాలని చెప్పి సీఎస్‌ కమిటీ సిఫారసు చేసింది. అయితే, కేంద్రం 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చిందనడం తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటికే తీసుకుంటున్న వేతనాలపై 157 శాతం (డీఏ + ఫిట్‌మెంట్‌) పెంపును అమలు చేసి వచ్చిన మొత్తాన్ని కొత్త బేసిక్‌ పే గా ఫిక్స్‌ చేశారు. ఈ 157 శాతంలో 125 శాతం డీఏ, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అయితే మిగిలిన 17.71 శాతం సంగతేంటి? దీన్ని బట్టి చూస్తే కేంద్రంలోని ఉద్యోగుల వేతనాలు ఏడో పీఆర్సీ అమల్లో 125 శాతం డీఏ, 32 శాతం ఫిట్‌మెంట్‌గా నిర్ధారించినట్టు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని సమాన కేడర్‌ ఉద్యోగుల వేతనాలను పరిశీలిస్తే కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు ఇప్పటికీ చాలాతక్కువగానే ఉన్నాయి. 11వ పీఆర్సీలో తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన వేతన స్కేళ్లను పరిశీలించినప్పుడు అక్కడ పీఆర్సీ కమిషన్‌ ఫిట్‌మెంట్‌ 7.5 శాతం అని చెప్పినప్పటికీ డీఏ + 15.75 శాతంతో వేతన స్కేళ్లను సవరించినట్టు అర్థమవుతోంది.  11వ పీఆర్సీ అమలు తేదీ 1.7.2018. ఆనాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌గా ప్రకటించి ఆ ప్రకారం, వేతనస్కేళ్లను సవరించింది. ఈ నేపథ్యంలో 11 పీఆర్సీ కమిషన్‌ నివేదికను అమలు చేయాలనేది ఉద్యోగుల డిమాండ్‌. కుదరని పక్షంలో కనీసం తెలంగాణ స్థాయిలోనైనా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబు కుదించారు.. పీఆర్సీ కమిషన్‌ హైదరాబాద్‌ నుంచి షిఫ్ట్‌ అయిన ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతం సిఫారసు చేసింది. గరిష్ఠ పరిమితిని రూ.26,000గా నిర్ణయించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 22ు హెచ్‌ఆర్‌ఏను బేసిక్‌ పే మీద సిఫారసు చేసింది. ఈ శ్లాబులో గరిష్ఠ పరిమితి 22,500 గా నిర్ణయించింది.  2నుంచి 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో 20ు హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేసింది. 20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. 50,000 నుంచి రెండు లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ 14.5 శాతం,  ఈ శ్లాబులో రూ.20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేస్తూ, గరిష్ఠ పరిమితిని రూ.17,000గా నిర్ణయించింది. అయితే, ఈ సిఫారసులను సీఎస్‌ కమిటీ పూర్తిగా విస్మరించి, కేవలం 3 శ్లాబులను సూచించింది. 5 లక్షల్లోపు జనాభా ఉండే ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 8 శాతంగా, 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉండే ప్రాంతాల్లో 16 శాతం, 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 24 శాతంగా సూచించింది. 

సీసీఏ ఎక్కడ...ఎంత..?ఏపీలో 11వ పీఆర్సీ సూచించిన ప్రకారం విజయవాడ, విశాఖపట్టణంలో సీసీఏ నెలకు గరిష్ఠంగా రూ.1,000, మిగిలిన ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.750 ఇవ్వాల్సి ఉంది. కానీ, సీఎస్‌ కమిటీ సీసీఏ ప్రయోజనాలను ఏపీలోని ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా ఎత్తేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.24,280 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు 600, మిగిలిన ప్రాంతాల్లో రూ.300, రూ.24,280 నుంచి రూ.42,300 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు రూ.850, మిగిలిన ప్రాంతాల్లో రూ.450, రూ.42,300 నుంచి రూ.54,220 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ.950, మిగిలిన ప్రాంతాల్లో రూ.550, రూ.54,220 కంటే ఎక్కువ పే పొందుతున్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ1250 మిగిలిన ప్రాంతాల్లో రూ.700 సీసీఏ ఇస్తోంది. కేంద్రం తన ఉద్యోగులకు సీసీఏ బదులుగా రవాణా అలవెన్సు ఇస్తోంది. నెలకు కనిష్ఠంగా రూ.900 + డీఏ, గరిష్ఠంగా 7,200 + డీఏ వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ ప్రకారం సీసీఏ కొనసాగించాలి. లేదంటే కేంద్రం ఇస్తున్నట్టు రవాణా అలవెన్సు అయినా ఇవ్వాలి.

అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రస్తుతం రాష్ట్రంలో అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తున్నారు. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇది   ఇస్తున్నారు. కేంద్రంలో 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకే ఈ ప్రయోజనం అందజేద్దామంటూ సీఎస్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 15 శాతం, 75 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 20 శాతం పెన్షన్‌ నష్టపోతారు. ప్రస్తుతం ఆ ప్రయోజనాలు పొందుతూ సీఎస్‌ కమిటీ సిఫారసు వల్ల నష్టపోయే పెన్షనర్లకు పర్సనల్‌ పెన్షన్‌ రూపంలో ప్రయోజనాలు కల్పించి నష్టం భర్తీ చేస్తామని అదే  కమిటీ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో 70 నుంచి 75 ఏళ్లు ఉన్న వాళ్లకి 15 శాతం, 75 నుంచి 80 ఏళ్ల వయసు వారికి 20 శాతం అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు. కొవిడ్‌ సమయంలో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు వైద్య ఖర్చుల రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు అయ్యే వైద్య ఖర్చులకు, ప్రభుత్వం విడుదల చేసే డబ్బులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. కాబట్టి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనాలను సీఎస్‌ కమిటీ చెప్పినట్టుగా కాకుండా యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.



Jan 7 2022 @ 02:59AMహోంఆంధ్రప్రదేశ్ఉద్యోగులూ మీరు కాస్త తగ్గాలిఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

ప్రాక్టికల్‌గా ఆలోచించాలి

తెలంగాణతో పోల్చుకోవద్దు

భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ సూచన

2-3 రోజుల్లో పీఆర్సీ అని వెల్లడి

రెండేళ్లుగా ఆదాయం తగ్గింది

2018-19లో జీతాలు, పెన్షన్లకు

రూ.52,513 కోట్ల ఖర్చు

2020-21కి 67,340 కోట్లకు చేరింది

ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువ

ఆదాయం ఎలా ఉన్నా..

మేం రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం

మంచి చేయాలనే మా తపన: సీఎం

నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. 

అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. 


PlayUnmute

Fullscreen

VDO.AI


ఆర్గ్యుమెంట్‌కు బలం చేకూరుతుందని.. తెలంగాణతో పోలిక చేస్తే బాగుంటుందని అనిపించవచ్చు. నిజంగా ఆ రాష్ట్రంలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒకసారి పరిశీలన చేయాలని కోరుతున్నా. 

సీఎం జగన్‌


అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని హితవు పలికారు. రెండు, మూడ్రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామన్నారు. గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏటా ప్రభుత్వంపై రూ.7,136 కోట్ల భారం పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆయనకు నివేదిక ఇచ్చింది. జీతాలు, పెన్షన్ల వ్యయం తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధికమని పేర్కొంది. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘అధికారులు చెప్పినదానికి, మీరు చెప్పినదానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది.

వాళ్లకు కూడా చె బుతున్నాను. పరిష్కరిద్దాం. మీకు మనసా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను’ అని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. ప్రతి ఏటా ఆదాయాలు పెరుగుతుంటాయని.. రాష్ట్రానికి కనీసం 15 శాతం పెరిగేదని.. కానీ గత రెండేళ్లుగా ఆదాయం పెరిగిందా అని ఆలోచన చేయాలని కోరారు. పెరగకపోగా.. తగ్గాయని చెప్పారు. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ్‌స-ఎ్‌సవోఆర్‌) 2018-19లో రూ. 62,503 కోట్లు ఉండేదని.. 2020-21లో రూ.60,688 కోట్లకి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామని తెలిపారు. 2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా.. 2020-2021 నాటికి రూ.67,340 కోట్లకు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని.. రూ.18 వేల కోట్ల వరకు చెల్లించామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేల్‌ సహా ఇతర ప్రయోజనాలు అందించామన్నారు. 


తెలంగాణలో జీతాల ఖర్చు 17 వేల కోట్లు..‘తెలంగాణతో పలుమార్లు పోలిక వస్తోంది. అక్కడ వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ. 2,37,632 కాగా, ఏపీలో అది రూ.1,70,215 మాత్రమే. అక్కడ జీతాల మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.5,603 కోట్లు. మొత్తం కలిపి (కాగ్‌ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు. ఇది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు తొలి ఏడు నెలల కాలానికి అయిన ఖర్చు. అదే మన రాష్ట్రంలో అదే కాలానికి జీతాలకు రూ.24,681.47 కోట్లు, పెన్షన్లకు రూ.11,324 కోట్లు.. మొత్తం దాదాపు రూ.36 వేల కోట్లు చెల్లించాం’ అని సీఎం తెలిపారు. ఈ కాలంలో గుజరాత్‌లో వేతనాలు, పెన్షన్ల కోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లని.. బిహార్‌లో రూ.25,567.5 కోట్లు చెల్లించారని.. ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ‘తెలంగాణలో హైదరాబాద్‌ను కోల్పోయాం. మనకు ఆదాయాలు తగ్గుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు’ అని పేర్కొన్నారు.

ఎంత మంచి చేయగలిగితే అంత..ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నట్లు సీఎం చెప్పారు. మనం ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలని.. అదే సమయంలో వారు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. ‘ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తాను. ఇది నా హామీ. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తాం. మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. కమిటీ చెప్పినట్లుగా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై పడే భారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం. ఇచ్చిన డీఏలు కూడా ఉద్యోగులకు అందాలి. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.