Saturday, January 23, 2021

Poor Andhrapradesh - Aranyakrishna

 Poor Andhrapradesh - Aranyakrishna 

పాపం ఆంధ్ర ప్రదేశ్! 

గత పదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే ఇక్కడ ఏమాత్రం బలం లేని బాహ్య శక్తి ఒకటి "ఒత్తిడి రాజకీయాలు" ద్వారా రాష్ట్ర రాజకీయాల్ని అతలాకుతలం చేస్తున్నది.  ఫలితంగా తాజా పరిణామం ఏమిటంటే చివరికి జగన్ గారు కూడా ఆవు తోకని పట్టుకొని రాజకీయ గోదారి ఈదాల్సి వస్తున్నది.  కొన్ని వందలో వేలో దేవాలయాల్లో అదేదో గోపూజ నిర్వహించమని దేవాదాయ శాఖ ఉత్తరువులిచ్చిందట.  రాముడిని, ఆవుని, పెద్ద పెద్ద బొట్లని ఆధారం చేసుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా సీరియస్ గా మొదలయ్యాయి.  ఏనాడూ మత రాజకీయాలకి తావులేని ఈ రాష్ట్రంలో "హిందువునోయీ!  నీ కంటే పెద్ద హిందువునోయీ" అని నిరూపించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నంత కష్ట కాలంలో ఎప్పుడూ లేదు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు పార్టీలున్నాయి.   అవి వైసీపి, టీడీపి, బీజేపి.  జనసేనని నేనెప్పుడూ ఒక రాజకీయ పార్టీగానే గుర్తించలేదు.  బీజేపికి ఒక కుషన్ గా మాత్రమే పనిచేయాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మరెవరి కోసమో ఏర్పరచబడ్డ పార్టీ అది.  (పార్టీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే "జనసేన" అనే పేరుతో ఎన్నికల సంఘంతో రిజిస్టర్ చేయబడింది కాబట్టి.)  ఆ రకంగా బీజేపిని ఆం.ప్ర.లో "ఒకటిన్నర పార్టీ"గా చెప్పుకోవచ్చు.  కానీ ఈ ఒకటిన్నర పార్టీ మిగతా రెండు సింగిల్ పార్టీల కంటే బలమైనది అని కానే కాదు.   ఏదో ఒక రోజు ఈ ఒకటిన్నర పార్టీ ఒకటే పార్టీగా మారిపోవటం ఖాయమని నాతో సహా మీ అందరికీ తెలిసిన విషయమే.  ఇంక కాంగ్రెస్!  రాష్ట్ర విభజన ద్వారా తమ ప్రయోజనాల్ని కాంగ్రెస్ దారుణంగా దెబ్బతెసిందని ఆంధ్రులంతా ముక్త కంఠంతో అనుకోవటం వల్లనే కాక, గతంలో కాంగ్రెస్ ని అధికార పథాన నడిపిన నాయకులు, కేడర్ దాదాపుగా మొత్తం ఇప్పుడు వైసీపిలోనే వున్న నేపథ్యంలోనూ కాంగ్రెస్ ని ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. ఆ సమయంలో సోనియాగాంధి వల్లనే తెలంగాణ కల సాకారమైందని కేసీఆర్ అనటం కూడా కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు మరింత ఆగ్రహం చూపారు.  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద కసి తీర్చుకున్నారు.  మరింక వామపక్షాలేమో తమని తాము సగం ఉద్యమ పార్టీలుగా, సగం ఎన్నికల పార్టీలుగా తీర్చిదిద్దుకున్న నేపథ్యంలోనూ, ఎన్నికల సమయంలో ఏ బూర్జువా పార్టీ వైపుంటారో (ఖచ్చితంగా వుంటారు కూడా) ఊహించలేని కారణంగానూ వారిని ఒక నిర్ణాయక శక్తిగా భావించలేం.    ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడంటే మూడే రాజకీయ పార్టీలున్నాయని చెప్పాల్సి వచ్చింది.  

పైన చెప్పుకున్న మూడు పార్టీల ఆర్ధిక విధానాల్లో ఏమాత్రం వ్యత్యాసం లేకున్నప్పటికీ - రెండింటికి మాత్రం ఆ పార్టీల ఆవిర్భావాలకి ఏదో ఒక సిద్ధాంతం మాత్రం వుంది.  బీజేపికి ఏ మతపరమైన లక్ష్యాలున్నాయో మనందరికీ తెలుసు.  ఇంక టీడీపి తెలుగువారి ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడి, ఆ ప్రాతిపదిక ప్రజలచే ఆమోదించబడి సఫలమైన పార్టీ.  ఆవిర్భావ ప్రాతిపదికని తదనంతర కాలంలో పూర్తిగా విస్మరించింది టీడీపి.  తెలుగువారి ఆత్మగౌరవం అంటేనే స్థానిక సంస్కృతులకి, భాషలకి, జాతీయ పార్టీల వల్ల కలిగే హానిని గుర్తించటం.  ఆ విషయాన్ని విస్మరించి, అధికారంలోకి రావటం కోసం ఆ జాతీయ పార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటూ ప్రస్తుతం గ్లోబలైజేషన్ని, ఉదారవాద ఆర్ధిక విధానాలకి పల్లకీ మోయటం, అధికారంలోకి రావటం తప్ప ప్రస్తుతం మరే ఇతర లక్ష్యాలేవీ లేని పార్టీ టీడీపి.  సాధారణంగా ప్రతి ప్రాంతీయ పార్టీకి ఒక సిద్ధాంతం, లక్ష్యం వుంటాయి. కానీ ఒక వ్యక్తి అధికారంలోకి రావటం మినహా మరే ఇతర సైద్ధాంతిక భూమిక లేదా లక్ష్యం లేని పార్టీ వైసీపి.  ఆయన కాంగ్రెస్లో వుండగా ముఖ్యమంత్రి అయ్యుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పుట్టుండేదే కాదు.  ఆయన కాంగ్రెస్లో వుండగా ఆయనని ముఖ్యమంత్రిగా నియమించలేదు కాబట్టి తన కోసం, తన కొరకు, తనచే ఏర్పరచబడిన పార్టీ అది.  ఆ తరువాత కాంగ్రెస్ వల్ల భవిష్యత్తుని పోగొట్టుకున్న నాయకులు, టీడీపిలోని అసంతృప్త జీవులూ వైసీపితో కలిసి దానిని బలోపేతం చేసారు.  

"పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిన కథ"ని మనం "పంచతంత్రం"లో చదువుకున్నాం.  అదేంటంటే రెండు పిట్టలు ఒక రొట్టెముక్కని సమానంగా పంచుకోవటం దగ్గర తగాదా పడుతుంటే ఎక్కడి నుండో వచ్చిన ఒక పిల్లి వచ్చి ఒక రొట్టెని రెండు ముక్కలు సమానంగా చేస్తానని చెబుతూ - ఇటు కొద్దిగా ఎక్కువైంది, అటు కొద్దిగా తక్కువైందని అంటూ మొత్తం మీద రొట్టెనంతా తినేస్తుంది.  ఇప్పుడు రెండు పిట్టలు ఎవరో, ఆ పిల్లి ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.  ఆ పార్టీ గురించి కొంత చెప్పుకోవాలి.  దక్షిణాది ప్రజలు ఎంతైనా ద్రావిడ సంస్కృతికీ, సిద్ధాంతాలకీ దూరం కాలేరని ఉత్తర భారతంలో మతం పనిచేసినట్లు దక్షిణ భారతంలో పనిచేయదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మోడీ "నాయకత్వాన అభివృద్ధి" అనే మంత్రాన్ని 2014 ఎలక్షన్స్ వరకు ఉపయోగించారు. ఒక్క కేరళలో మాత్రం పైపై రంగుల అభివృద్ధి నమూనాని ఏమాత్రం అంగీకరించని రాజకీయ పరిపక్వత అక్కడి ప్రజలకు వున్నదని, అందువల్ల "వాటెవర్ ఇటీజ్ వర్త్" అనే ప్రాతిపదికన ఎలాంటి ముసుగుల్లేకుండా "ట్రూ కలర్స్"తోనే ఎప్పటిలా ప్రయత్నించి భంగపడ్డారు.  అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో "గుజరాత్ మోడల్"ని మత నమూనాగా కాక అభివృద్ధి నమూనాగా ముందుకు తెచ్చి ప్రచారం చేసుకున్నారు.  అప్పటిలో చాలామంది తటస్థవాదులు కూడా కాంగ్ర్రెస్ అవినీతికి విసిగిపోయి మోడీగారు గుజరాత్ ని అభివృద్ధి చేసారని, దేశం మొత్తం అలానే అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు.   అయినప్పటికీ బీజేపికి ఆశించిన ప్రయోజనం లేకపోయింది. దానితో "గుజరాత్ మోడల్"ని మత రాజకీయ నమూనాగా మొన్నటి హైదరాబాద్ ఎన్నికల్లో "పైలట్ ప్రాజెక్టు"గా ప్రయోగించి అనుకున్నదానికంటే ఎక్కువగానే సఫలం అయ్యారు.  ఇప్పుడు అదే మత అగ్రీకరణ వాదాన్ని ఆంధ్రప్రదేశ్ కి కూడా విస్తరించారు.  ఇదెలా సాధ్యమైందనేది తెలుసుకోవాలంటే కొంచెం ముందు వెనుకలగానైనా గత ఆరేడేళ్ల రాజకీయ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.

****

2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.  పుష్కలమైన ఆవేశం కలిగివుండి, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఏదో మేథోమథనంలో వుంటాడనే ఇమేజితో, యువతని ఆకర్షించి, ప్రభావితం చేసే విధంగా చేగువేరా తరహా సాహస ఆదర్శాల్ని అవపోసన పట్టినవాడిగా తనకంటూ ఒక ఇమేజి సృష్టించుకున్న పీకే తాను సామాన్య, బడుగు, బలహీన ప్రజల తరపున ప్రశ్నించటానికే రాజకీయ పార్టీ పెట్టగానంటూ ముందుకు రావటంతో చాలామంది ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు.  ఆయన పార్టీ ఆవిర్భావ సభలోనే కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగాడు. కాంగ్రెస్ వి దేశ విచ్చిన్నకర రాజకీయాలని తేల్చిపారేశాడు.  "కాంగ్రెస్ హటావో - దేశ్ కీ బచావో" అంటూ ఊగిపోతూ నినాదాలు, పిలుపులూ ఇచ్చాడు. అప్పటికే ఆయన సోదరుడు చిరంజీవి కేంద్రమంత్రిగా వున్నారు.  కాంగ్రెస్ పట్ల వున్న తిరస్కార వాతావరణం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు చరమాంకంకి వచ్చేసింది. తాను రాజకీయాల విషయంలో తన సోదరుడితో కూడా ఘర్షణ పడ్డానని, తాము ఒకరితో మాట్లాడుకోవటం లేదని కూడా పదే పదే పీకే ప్రకటించారు.  ఆ విధంగా "పార్టీని అమ్ముకున్న చిరంజీవి సోదరుడు" అనే సెట్ బాక్ నుండి బైటపడి తానొక ఇండివిడ్యువల్ అనే విశ్వసనీయత కోసం ప్రయత్నించారు.  "పబ్లిక్ మెమొరీ ఈజ్ షార్ట్" అనే సిద్ధాంతాన్ని బాగా నమ్మారేమో పార్టీ పెట్టాక "మా అన్నయ్యకి జరిగిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటా" అని అన్నారు.  కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ప్రజలు వోట్లు వేసి గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి కోసం వారికే ధోకా ఇచ్చిన ఈయనకి ఎవరు ద్రోహం చేసారో మరి!  "కేంద్రంలో మోడీ అభివృద్ధి పాలనకి, రాష్ట్రంలో చంద్రబాబు అనుభవానికి మద్దతునిస్తునిస్తున్నా" అన్న ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా ప్రచారం అయితే నిర్వహించాడు.  ఆ సమయంలో ఆయన జగన్ అవినీతి, కేసులు అంటూ తీవ్రంగా దాడి చేసి, యువతలో జగన్ పట్ల వున్న సానుకూల వైఖరిని దెబ్బ కొట్టి వారి వోట్లని ఎన్.డీ.ఏ. వైపు చీల్చేందుకు దోహదం చేసారు.  ఆ విధంగా ఆయన మొదట జగన్ అవకాశాల్ని దెబ్బ కొట్టాడు.  ఆయన కానీ, ఆయన పార్టీ కానీ ఎక్కడా ఒక్క సీట్లో కూడా పోటీ చేయకపోయినా ఒక ఏక వ్యక్తి పార్టీగా ఎన్.డీ.ఏ.లో భాగస్వామి హోదాలో మోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యాడు.  2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే రాజకీయం చేసిన ఆయన బీజేపీ అమ్ములపొదిలో వున్న అస్త్రం అని అర్ధం అవుతుంది.  2014 ఎన్నికల తరువాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు మౌనంగా వున్నారాయన.  మధ్యలో ఒకసారి మాత్రం అమరావతి రైతుల నుండి అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని, వారికి తన మద్దతు వున్నదని చిన్న హడావిడి చేసారు. 

ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణంలో సహకరిస్తామని ప్రామిస్ చేసి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది కేంద్రం.  విభజన చట్టంలోని ఏ ఒక్క ఏర్పాటుకి పూర్తి స్థాయిలో సహకరించకుండా మొండి చేయి చూపించింది.  ముఖ్యమైన పరిపాలన భవంతుల్ని కట్టుకొని అమరావతి నుండే పాలన సాగిస్తున్న చంద్రబాబుకి ఏమాత్రం సహకరించని కేంద్ర యంత్రాంగాన్ని కానీ, మోడీని కానీ ప్రశ్నించటమే తన ఊపిరని పదేపదే పేర్కొన్న పీకే ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.  ఆ నాలుగేళ్ల కాలంలో తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.  ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు మాత్రమే ఆయన నోరు విప్పాడు.  అది కూడా ప్రధానంగా తెలుగుదేశంకి వ్యతిరేకంగానే.  2014 ఎన్నికల్లో వైసీపికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కంటే 2019 ఎన్నికల్లో టీడీపికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రచారం చేసారు.  2019లో రాష్ట్రంలో ఎలాగూ బీజేపి అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు కాబట్టి ఎవరికీ శాశ్వతంగా మద్దతు ఇవ్వకపోతే ఎవరూ బలపడరనే బీజేపి రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే ఆయన పనిచేసారు.  ఆయన తక్షణ లక్ష్యం ఎన్నికల్లో గెలవటం కాదు.  "ఒక్క అవకాశం ఇవ్వండి" అని తన పాదయాత్ర ద్వారా దుమ్ము రేపుతూ బలపడిన జగన్ కి వున్న వ్యతిరేక వోటుని చీల్చటానికే పీకే ఉపయోగపడ్డారు.  2014 & 2019 ఎన్నికల సందర్భంగా తన వైఖరి కారణంగానే పీకేని ఒక "పొలిటికల్ పర్సన్"గా కాక "పొలిటికల్ హిట్ మాన్"గా గుర్తిస్తాను.  

ఆ ప్రాంతంలో రాజధాని నెలకొల్పటం కరెక్టే కానీ ఒక మహా నగర నిర్మాణం చేయటం అనేకరకాలుగా నష్టకరం.  రాజధాని అంటే  మౌలిక వసతులు కలిగివుండి, రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులో వుంటే చాలు.  ముప్ఫై నలభై ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగే అమరావతి అనే బడా ప్రాజెక్ట్ తనకి తిరుగులేని రాజకీయ బలం అవుతుందని చంద్రబాబు అనుకోవటం ఆయన దురాశ తత్వానికి చిహ్నం.  సంవత్సరానికి మూడు పంటలు పండే పచ్చని భూముల్ని రియల్ ఎస్టేట్లోకి దింపాడాయన.  అమరావతి తన బంగారు బాతు అనుకున్నాడాయన.  అమరావతి అనే ప్రపంచ స్థాయి నగర నిర్మాణం జరగాలంటే నిలకడైన రాజకీయ సుస్థిరత, కేంద్రం నుండి బలమైన మద్దతు సాధ్యమా అనే కనీస సెన్స్ ఆయనకి లేదు.  రియల్ ఎస్టేట్ అభివృద్ధే ప్రజల అభివృద్ధి అని ప్రచారం చేసుకోవటం దారుణం.  ఆయన అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు సహజంగానే.  

చంద్రబాబు పాలనలో పోలవరం, అమరావతి నిర్మాణానికి బీజేపి సహాయ నిరాకరణ, "స్పెషల్ స్టేటస్ సాధ్యపడదని ఏం చేస్తారో చేసుకోండని చెప్పటం, హైదరాబాద్ ని పోగొట్టుకోవటం వల్ల ఆదాయ నష్ట నివారణ కోసం కొంత ఆర్ధిక స్వాంతన కలిగించే విధంగా నిధులు మంజూరు చేయకపోవటం, చంద్రబాబు బీజేపిని ఏమీ అనలేక ప్రతీసారి బాధని వ్యక్తం చేసే బలహీనతకి గురికావటం,  "ప్రత్యేక హోదా" బదులు ప్రత్యేక ఆర్ధిక పాకేజిని ప్రకటిస్తామని హామీ ఇచ్చి, తిరిగి అదీ నిలబెట్టుకోని బీజేపిని ఆయన నిలదీయలేని పరిస్తితిలో దానికీ తలొగ్గటం వైసీపికి కలిసి వచ్చింది.  అప్పుడు జగన్ గారు "ప్రత్యేక హోదా" కోసం విజృంభించి డిమాండ్ చేయటం మొదలెట్టడంతో బీజేపితో తెగతెంపులు చేసుకొని ప్రత్యేక హోదాని మరిచిపొమ్మన్న చంద్రబాబే ఢిల్లీలో దీక్షా శిబిరం నిర్వహించారు.  ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి ఎంతో అరచి, గగ్గోలు పెట్టిన వైసీపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చిపోయింది. గుర్తు చేసుకొని కూడా ప్రయోజనం లేదు.  కేంద్రంలో "దున్నపోతు మీద జడవాన"వంటి బ్రూట్ మెజారిటీ పవర్ వుందని జగన్ గారికి బాగా తెలుసు. ఎవరి బలహీనతలు వాళ్లకుంటాయని బీజేపీకి కూడా బాగా తెలుసు.  ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే  రాష్ట్రంలో తనకి ఏమాత్రం బలం లేనప్పటికీ కేవలం కేంద్రం వున్న అధికారాన్ని వాడుకొని ఏ పార్టీకి తన స్టాండ్ ని వుంచుకోనివ్వని ఒత్తిడిని బీజేపి సృష్టించిందని అర్ధం అవుతుంది.  

"విజయవాడ పరిసర ప్రాంతాలలోనే రాజధానిని ఏర్పాటు చేయటాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, అప్పటికే 13 జిల్లాలతో చిన్న రాష్ట్రమైపోయిన ఆంధ్రప్రదేశ్ ని ప్రాంతాలవారీగా విడదీయటం తమకు ఇష్టం లేద"ని జగన్ నిండు అసెంబ్లీలో గట్టిగా అన్నప్పటికీ తాను అధికారంలోకి వచ్చాక అదే అమరావతి బీజేపి మళ్లీ కేంద్రంలో రావటంతో తనకో గుదిబండ కాగలదని గ్రహించిన జగన్ గారు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని అమలు చేయటానికి పూనుకున్నారు.  (నా దృష్టిలో మూడు రాజధానులో పెద్ద మాయ.  ఈయన కూడా "రాజధాని చుట్టూ అభివృద్ధి" అనే స్కీముని ముందుకు తెచ్చాడు.  కాకుంటే మూడు రాజధానులట.  రాజధాని అంటే అభివృద్ధి చెందితే మూడేం ఖర్మ?  ముప్ఫై పెట్టొచ్చుగా! ) ఆ క్రమంలో ఆయన, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఆయన పత్రిక కుల, ప్రాంతీయ విభేదాల కుంపట్లు కూడా రాజేసారు. సాధారణంగా రెడ్లు కాంగ్రెస్ కి, కమ్మలు టీడీపీకి వత్తాసు ఇచ్చేవారే కానీ ఆంధ్రప్రదేశ్లో కులం ఇంతగా రాజకీయం కావటం అంతకు మునుపు ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ దారుణంగా నష్టపోయింది అర ఎకరం నుండి ఆరెకరాల వరకు అమరావతి కోసం 34వేల ఎకరాలు పోగుచేసి పెట్టిన 29వేల మంది చిన్న సన్నకారు రైతులే.  ఇప్పుడు వారికి తిరిగి ప్లాట్ల పట్టాలే ఇవ్వగలరు కానీ ఆ భూమిని వ్యవసాయ యోగ్యం చేయటం సాధ్యం కాదు.  ఇది పైకి చూడటానికి వైసీపి-టీడీపి మధ్య వ్యవహారంలా కనిపిస్తుంది కానీ ఈ పరిణామానికి మూల సూత్రధారి మాత్రం బీజేపీనే.    ఇప్పటికే విజయవాడ-మంగళగిరి ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్ట్, డీజీపి ఆఫీస్ వంటివి ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి నుండే పూర్తి స్థాయి పాలన చేయాలంటే  జగన్ కి అమరావతి తలనొప్పే.  అందుకే ఆయన అదే "రాజధాని చుట్టూ అభివృద్ధి" అనే మంత్రం జపిస్తూ తనకి అనుకూలమైన పరిస్తితులు వున్న చోటికి, అదే లాండ్ పూలింగ్ విధానంలో రాజధానిని వికేంద్రీకరిస్తున్నాడు.  రేపు చంద్రబాబో లేదా మరొకరో అధికారంలోకి వచ్చి విశాఖ, కర్నూలు నుండి మిగతా రాజధానుల్ని మళ్లీ అమరావతికి తరలిస్తామంటే మళ్లీ నష్టపోయేది భూములిచ్చిన సామాన్యులే.   ఎందుకంటే విశాఖలో కూడా లాండ్ పూలింగ్ జరుగుతుంది. ఇవి బాధ్యత లేని రాజకీయాలు.  కేంద్రంలో ప్రభుత్వమేమో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోది అని తేల్చి చెప్పేస్తుంది.  రాష్స్ట్ర స్థాయిలోనేమో బీజేపీ అమరావతి పరిరక్షణకి కట్టుబడి వున్నానంటుంది.  మోడీ ఒప్పుకోరు, అమిత్ షా ఊరుకోడు అంటూ డబుల్ గేం ఆడుతుంది.  విగ్రహ ధ్వంసాల తరువాత అందరూ మత రాజకీయాలకి పాల్పడుతున్నారు కానీ అంతకుముందు మూడు ప్రధాన పార్టీలలో ఆర్ధిక విషయాల్లో ఒకటే పంథా అయినప్పటికీ బీజేపీది మత రాజకీయాలు కాగా, చంద్రబాబుగారివి పెట్టుబడిదారీ అవకాశవాద స్వార్ధ రాజకీయాలు కాగా, జగన్ గారివి తన కులం వారిని అందలం పైకి ఎక్కించటంతో పాటు ఓ పర్టిక్యులర్ కులాన్ని తొక్కేయాలనే కుల రాజకీయాలు, ద్వేష రాజకీయాలు.  ఆయన ద్వేష రాజకీయాల బాటన్ ని ఆయన నుండి అందుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, విజయసాయి రెడ్డి, బొత్స, అంబటి రాంబాబు వంటి వారి పరుషమైన, హేయమైన, అవమానకరమైన మాటల దాడుల్లో మరీ కనిపిస్తుంది.  తెలుగుదేశం వదిలి వైసీపిలోకి జంపైన ప్రతివాడూ "వెన్నుపోటు" రాజకీయాల గురించే మాట్లాడతాడు.  ఆ సోకాల్డ్ వెన్నుపోటు సంభవించిన ఇరవై ఏళ్ల తరువాత కూడా అదే పార్టీలో ఎందుకున్నాడో ఒక్కడూ చెప్పడు.  వాళ్లు ప్రజలకి తాము జవాబుదారీలం కాదనుకోవటం వల్లనే అలా మాట్లాడగలుగుతున్నారు.  మరో వైపు ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేయటమంటే సుస్థిర ఆదాయ వనరుల్ని ఏర్పాటు చేయగల ఉత్పాదక సంపద సృష్టికాక వేల కోట్ల రూపాయిల్ని అప్పులు తీసుకొచ్చి ప్రజలకి పంచటం చేస్తున్నారాయన.  ఎక్కడ వోటమి చెందుతానో అన్న భయానికి సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ఏదో పసుపు కుంకుమ పథకం పేరుతో డబ్బులు పంచిపెట్టారు.  దాన్ని జగన్ మరో లెవెల్ కి తీసుకెళ్లారు.  ఇవి వోటు బాంక్ రాజకీయాలు కాక ప్రజానుకూలమైనవి ఎలా అవుతాయి?  ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దారుణమైన దుస్థితి.   

ఇప్పుడు రాష్ట్రంలో రథాల దగ్దం, విగ్రహాల విధ్వంసంతో బీజేపీతో పాటు మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా మతాన్ని నెత్తికెత్తుకోవాల్సి వస్తున్నది. బీజేపీవాళ్లు సరే సరి, ఇప్పుడు చంద్రబాబు, జగన్ కూడా పెద్ద బొట్లు పెట్టుకొని హిందూత్వ ప్రతినిధులుగా, పరిరక్షకులుగా ముందుకొస్తున్నారు.  (బీజేపిని ఎదుర్కోవటానికి తెలంగాణలో కేసీఆర్ కూడా తానే అసలైన హిందువునని ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి,  కాకుంటే ఆయన పర మత విమర్శలకి, ద్వేషాలకి పాల్పడలేదు.  భవిష్యత్తు సంగతి తెలియదు.) అలా నెత్తికెత్తుకోకపోతే బీజేపీ బలపడిపోతుంది.  బీజేపిని నిలువరించటానికి లేదా బీజేపితో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోడానికో ఎన్నడూ లేనిది చంద్రబాబు కూడా మైనారిటీ వ్యతిరేకిగా ముద్ర వేయించుకోటానికి సిద్ధమైపోయాడు.  మెజారిటేరియనిజం ఉచ్చులో చిక్కుకున్నారు. ఆయన ఎంత భయంకరంగా క్రైస్తవ ద్వేషాన్ని వెల్లడించాడు?   ఈ ప్రెజర్ పాలిటిక్స్ పరిస్తితికి ప్రధాన కారణం మాత్రం బీజేపీనే.   

ఎన్నికల్లో ఏదో ఒక బూర్జువా పార్టీ పల్లకీకి బోయీగా వామపక్షాలు మారనప్పుడే ప్రజల్ని హేతుబద్ధ రాజకీయాల వైపు ప్రజల్ని నడిపించగలవు.  వైసీపి, టీడీపిల బలహీనతల కంటే ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లల్లో విజయాల కోసం వామపక్షాల ఆశ్రిత లక్షణమే అతి పెద్ద బలహీనత.  గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న రైట్ వింగ్ ఫోర్సెస్ మీదకి నెపాన్ని ఎంతగా తోసేసినా తమ బలహీనతల్ని నిజాయితీగా అంచనా వేసుకొని కార్యాచరణకి పూనుకునేంత వరకు ఈ ప్రజావ్యతిరేక రాజకీయాలు చచ్చిపోవు.  కాకుంటే కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు సెక్యులరిజం అనే పదాన్ని మరిచిపోయి, వామపక్షాల పరిస్తితి మరింత దయనీయమై,  పరిస్తితి "ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్"కి వెళుతుందేమోనన్న సంశయం కూడా నాలో వుంది.

***

ఇంక అన్ని పార్టీల వారూ నన్ను బడితె పూజకి చేయటానికి సిద్ధం అయిపోండి మరి!  ఎందుకు ఆలస్యం? 🙂






Friday, January 22, 2021

ఎన్నికల విధులు నిర్వర్తించలేం NGO Association

 ఎన్నికల విధులు నిర్వర్తించలేం

Jan 23, 2021, 03:24 IST

Amravati Employees JAC And AP Govt Employees Federation Request to CS - Sakshi

బందరురోడ్డులోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఏపీజేఏసీ అమరావతి స్టేట్‌ టీం సభ్యులు


వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు వాయిదా వేయాలి


ప్రతి ఉద్యోగికి రెండు డోసులు ఇచ్చాకే ఎన్నికలు జరపాలి


సీఎస్‌కు అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వినతి  


సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్‌ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్‌ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. 



ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం?

అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్‌ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్‌ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం

కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు.  



ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది

Jan 23, 2021, 03:39 IST

There is a constitutional right to defend the lives of employees - Sakshi

మీడియాతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి


రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 


వ్యాక్సినేషన్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి 


ఎన్నికల కమిషనర్‌ ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలి


సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్‌ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్‌ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.


ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. 

ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. 



కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలు - CPI

 కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలు

Jan 23 2021 @ 03:49AMహోంఆంధ్రప్రదే 


26న కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్‌ ర్యాలీలు: సీపీఐ

అందరూ కలసి శక్తిగా మారాలి: ఉండవల్లి

 రాజమహేంద్రవరంలో రైతు సంఘీభావ సదస్సు 


రాజమహేంద్రవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘కార్పొరేట్‌ సంస్థల కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. వాటివల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన రైతులు పోరాడుతున్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉద్యమం చేస్తున్నాయి. ఈ ఉద్యమం రాజకీయ పార్టీలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇక. కేంద్రం దిగిరావాలి. వ్యవసాయ సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. రైతు ఉద్యమానికి సీపీఐ అండగా ఉంటుంది. ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నాం. మనిషన్న ప్రతీవాడు రైతు ఉద్యమానికి సంఘీభావమే కాదు. మద్దతిచ్చి ఉద్యమంలోకి రావాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని ఆనంరోటరీ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన రైతు సంఘీభావ సదస్సులో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్‌, జీవీ హర్షకుమార్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.  సెక్యులర్‌ పార్టీలైన టీడీపీ, వైసీపీ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయని రామకృష్ణ ప్రశ్నించారు. కార్పొరేట్ల చేతిలోకి వివిధ రంగాలు వెళితే, దేశం విచ్చిన్నమవుతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. కార్పొరేట్లకు ఉపయోగపడే సాగు చట్టాలను కేంద్రం తీసుకుని రావడం వల్ల పెద్ద దళారీ వ్యవస్థ రాబోతుందని హర్షకుమార్‌ అన్నారు. 



ఎన్నికలు నిర్వహించలేం! CS of AP to SEC

ఎన్నికలు నిర్వహించలేం!

Jan 23 2021



ఏకకాలంలో వ్యాక్సినేషన్‌, ఎన్నికలు అసాధ్యం

మీరు తొలగించిన అధికారులు టీకా విధుల్లో బిజీ 

సుప్రీం ఆదేశాలు వచ్చేవరకూ ప్రక్రియను ఆపండి  

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ లేఖ

2 డోసులు వేసేవరకు ఆపాలి.. ఉద్యోగ నేతలు



అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సినేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుశాఖతో సహా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మొదటి, రెండోదశ వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు 60రోజులు పడుతుందని, అప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. వాక్సినేషన్‌ను నిర్వహిస్తూనే, స్థానిక ఎన్నికలను సజావుగా పూర్తిచేయాలంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఎన్నికల ప్రక్రియపై ముందడుగు వేయవద్దని ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శుక్రవారం రాసిన మూడు పేజీల లేఖలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు.




కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయకుండా ఎన్నికలు నిర్వహించలేమన్నారు. ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన మరుక్షణమే కోడ్‌ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాలనా విధానాలు పాటించకుండానే కొంతమంది అధికారులను తొలగిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని, అయితే వారంతా ఇప్పటికే వ్యాక్సినేషన్‌ బాధ్యతల్లో బిజీగా ఉన్నారని ఆ లేఖలో సీఎస్‌ స్పష్టం చేశారు. కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్‌ చేపడుతూనే, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంతో ఎస్‌ఈసీ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సన్నాహకాల గురించి తెలుసుకోవడాన్ని సీఎస్‌ స్వాగతించారు. ఎస్‌ఈసీ పట్ల సీనియర్‌ అధికారులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్పందించిన సీఎస్‌.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అంటే ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించారు. తొలిదశ, రెండోదశ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు 60 రోజులు పడుతుందన్నారు.




ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసుకోవడమే మంచిదని సీఎస్‌ సూచించారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలూ రెండూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సుజావుగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందువల్ల కొత్తగా స్థానిక సంస్థల షెడ్యూల్‌ను విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నామని, అందుకే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశామన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలన్నారు.






 

SEC - JAGAN - HIGH COURT Controversy

 రాజ్యాంగ వ్యవస్థలపై రంకెలు!


Jan 23 2021 


ఎస్‌ఈసీపై సర్కారు ధిక్కారం

హైకోర్టు తీర్పునకు తిరస్కారం

కోర్టు ఆదేశించినా సహాయ నిరాకరణ

సుప్రీంకోర్టుకు వెళ్లామంటూ సాకులు

ఎన్నికలపై ఎస్‌ఈసీ ఆదేశాలే  అంతిమం

పట్టించుకునేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం

అధికారుల బదిలీ ఆదేశాలు అమలయ్యేనా?

నేడు తొలి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌

కలెక్టర్లు తమ నోటీస్‌లు జారీ చేస్తారా?

ఎస్‌ఈసీని పట్టించుకోకుంటే జరిగేదేంటి?

రాజ్యాంగ సంక్షోభం, ప్రతిష్టంభన తప్పవా?



రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అంటే లెక్కలేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునకే దిక్కులేదు. ‘మా  ఇష్టం. మేం చెప్పిందే జరగాలి’ అనే మొండితనమే తప్ప... రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేదు. ఇదీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ! ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు సహకరించవద్దని సర్కారు పెద్దలు! ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ‘సుప్రీంకోర్టుకు వెళ్లాం’ అనే నెపంతో ధిక్కారం ప్రదర్శిస్తున్నారు. ఇది ఏకకాలంలో రెండు రాజ్యాంగ వ్యవస్థలతో సర్కారు చేస్తున్న యుద్ధం! రాష్ట్ర చరిత్రలోనే కాదు... బహుశా దేశంలో ఎక్కడా, ఎప్పుడూ తలెత్తని సంక్షోభం!  ఇదే పరిస్థితి కొనసాగితే... ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక న్యాయ నిపుణులు, విశ్లేషకులే తలలు పట్టుకుంటున్నారు.




(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదాతో మొదలైన సమరం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఎస్‌ఈసీతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఢీ అంటే ఢీ’ అంటున్న సందర్భం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిష్కృతమవుతోంది. అదే సమయంలో... హైకోర్టు ఇచ్చిన తీర్పునూ గౌరవించకుండా సర్కారు తన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీతో సహకరించాలని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టమైన తీర్పు చెప్పింది. ‘టీకా, ఎన్నికలూ... రెండూ ముఖ్యమే. సమన్వయంతో రెండింటినీ విజయవంతం చేయండి’ అని స్వయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీనిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. అక్కడ తీర్పు ఎలా వస్తుందో చూసి... దానిని బట్టి సహకరిస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.




శుక్రవారం ఇదే వైఖరి కనబరిచారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఎస్‌ఈసీ కూడా కేవియట్‌ వేసినందున... తన వాదనలు కూడా వినాల్సిందే! ఈ విషయం ఒక్కరోజులో తేలవచ్చు, తేలకపోవచ్చు. ఆ సంగతి పక్కనపెడితే... సుప్రీం కోర్టులో ఎలాంటి నిర్ణయం రానంత వరకు, హైకోర్టు ఆదేశాలు అమలులో ఉన్నట్లే. దీని ప్రకారం ఎస్‌ఈసీకి అధికారులు సహకరించాల్సిందే. ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి  అనుకూలంగా వస్తే... ఎన్నికలు ఆగిపోతాయి. అప్పటిదాకా, హైకోర్టు ఆదేశాలే అమలులో ఉంటాయి. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ... ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ‘సుప్రీం కోర్టులో ఏదో జరుగుతుంది’ అనే ఒక వూహాజనిత కారణంతో హైకోర్టు ఆదేశాలనూ తుంగలో తొక్కేయడం కనీవినీ ఎరుగని పరిణామనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.




ఎస్‌ఈసీతో యుద్ధం 


కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఇటీవల కేరళ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదేం కుదరదని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం ఎస్‌ఈసీదే అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేరళ సర్కారు ఎస్‌ఈసీకి సంపూర్ణంగా సహకరించింది. ఇప్పుడు... ఏపీలో ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ఏదిఏమైనా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హయాంలో ఎన్నికలు నిర్వహించరాదని సర్కారు భావిస్తోంది. దాదాపు 9 నెలలుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ‘గొడవ’ నడుస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాలు, సూచనలేవీ ప్రభుత్వం పాటించలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున... ఎలాంటి వివాదాల్లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావించింది. కరోనా అని ఒకసారి, టీకా అని  మలిసారి... సర్కారు సహాయ నిరాకరణ చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శుక్రవారం ఒకవైపు ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండగా... అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో ‘ఎన్నికలను  ఆపడం ఎలా’ అనే ప్రతివ్యూహాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.




 ‘ఆయన ఏం చెప్పినా వినొద్దు’ అనే సంకేతాలను అధికార యంత్రాంగానికి పంపించారు. ఈ క్రమంలో భేటీకి రావాలని పిలిచినా... పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య అధికారులు ఎస్‌ఈసీకి ముఖం చాటేశారు. ఇది ఎస్‌ఈసీతోపాటు, హైకోర్టునూ ధిక్కరించడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సర్కారు పెద్దల ‘మూడ్‌’ గమనించిన ఎస్‌ఈసీ... శుక్రవారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది స్థానిక ఎన్నికల సమయంలో అధికారిక విధులు సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ... రెండు జిల్లాల కలెక్టర్లు, ఒక ఎస్పీసహా 9 మందిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కానీ... ఈ ఆదేశాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎస్‌ఈసీ ఆదేశాలను సర్కారు బుట్ట దాఖలు చేస్తే ఏం చేయాలి? ఈ బదిలీలు అమలులో ఉన్నట్టా, లేనట్టా? రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే... ఇలాంటి సందర్భం ఎప్పుడూ తలెత్తలేదు. ఈ క్రమంలోనే ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ శుక్రవారం గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది.



నోటిఫికేషన్‌ ఇచ్చినా...


హైకోర్టు ఆదేశించినప్పటికీ... ఎస్‌ఈసీతో కనీసం భేటీకి కూడా సర్కారు ఇష్టపడటంలేదు. అటు ఉద్యోగ సంఘాలూ ‘ఎన్నికలకు మేం సహకరించం’ అని తేల్చి చెబుతున్నాయి. అయినా సరే... ఎస్‌ఈసీ  తన పని తాను చేసుకుపోవాలనే భావిస్తున్నారు. దీని ప్రకారం... ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం ఉదయం విడుదల చేయనున్నారు. దీని మేరకు సోమవారం (25వ తేదీ) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాతే రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు ముందుకు సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాతే వస్తుంది. అంటే... ఈలోపే కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో... ఆ అవకాశం ఎంతమాత్రం కనిపించడంలేదు. సర్కారు పెద్దల నుంచి ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితి ఏమిటి? హైకోర్టు తీర్పునకు, ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువలేకపోతే.. రాజ్యాగ సంక్షోభం తలెత్తదా? అటు... ఈ వివాదంలో గవర్నర్‌ కూడా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఎస్‌ఈసీ ఏం చేస్తారు? మళ్లీ మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనా? ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని సర్కారు, ఇకముందైనా ఆ పని చేస్తుందా? అప్పటిదాకా... పరిస్థితి ఏమిటి? ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ప్రతిష్టంభన తప్పదా? ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా? వేచి చూడాల్సిందే!




ఏర్పడింది ఇలా... 


గతంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేవి. ఈ ప్రక్రియను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నడిపించేవారు. అయితే... ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సందర్భంలో పదేళ్లపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో... కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తితో రాష్ట్రాల స్థాయిలో ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఈసీ విధులు, అధికారాలను రాజ్యాంగంలోని 243(కె) అధికరణలో పొందుపరిచారు. కేంద్రంలో ఈసీఐ ఎంతో... రాష్ట్రంలో ఎస్‌ఈసీ  అంతే! ఏపీలో 1994 సెప్టెంబరులో కాశీ పాండ్యన్‌ తొలి ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాకి మాధవరావు, ఏవీఎస్‌ రెడ్డి, రమాకాంత్‌ రెడ్డి ఎస్‌ఈసీలుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత... నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా నియమితులయ్యారు.