Tuesday, December 31, 2019

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Monday, December 30, 2019

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష..

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు.


నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...సీఎం జగన్,కన్నా లక్ష్మీనారాయణ(File Photos)
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 27, 2019, 5:26 AM IST
SHARE THIS:



ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. నేటి ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది.

కాగా, ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవ రాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు. సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు.

అమరావతి అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి

అమరావతి  అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి
30-12-2019 04:25:03

 కేంద్రంతో మాట్లాడే చెప్తున్నా
 రాజధాని రాష్ట్ర నిర్ణయమే..
 కానీ ఇప్పుడు మార్పు కుదరదు
 అమరావతికి రూ.8వేల కోట్లు చాలు
 బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెల్లడి
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్రంతో చర్చించే ఈ మాట చెప్తున్నా. కేంద్రం అధికారాలేంటో అవసరమై న సందర్భంలో చెప్తాం’ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉద్ఘాటించారు. అమరావతి తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ అంగీకారం ఉందన్న వైసీపీ వర్గాల మాటలకు అర్థం లేదన్నారు. ఇలాంటి మూ డు రాజధానుల పనికి ఎవరైనా మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేదో రెండు జిల్లాల ప్రజలు, రైతుల సమస్య కాదని, మొత్తం 13 జిల్లాల రైతుల సమస్య అని పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం రాజధాని ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


అ నంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే వేలకోట్లు ఖర్చుచేశారన్నారు. అమరావతిలో రాజధా ని పెట్టాలని ఆరోజు రైతులు అడగలేదని, నాటి ప్ర భుత్వం, ప్రతిపక్షం, ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిం చి పెట్టారన్నారు. ఆనాడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డే.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలన్నారని గుర్తు చేశారు. ‘ఆ రోజు ప్రభుత్వం వద్ద డబ్బులేక భూసేకరణ పద్ధతిలో కాకుండా.. భూసమీకరణ విధానంలో వెళ్లింది. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. దాదాపు 34వేల ఎకరాలకు అది సుమారు రూ.1.5లక్షల కోట్లు అవుతుంది’ అని సుజనా అన్నారు. రేపు విశాఖపట్నం రైతు కూడా సుఖంగా ఉంటారని చెప్పలేమన్నారు.

రాష్ట్ర నిర్ణయమే అయినా..
రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైతే వాటి రాజధానుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోవాల్సి రావడంతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తామన్నారు. ఆనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా జగన్‌, వైసీసీకి చెందిన ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలా పంపాకే కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. ఇక్కడ రాజధాని ఉందన్న కారణంతోనే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ పథకం కింద ఎంపిక చేసి వెయ్యికోట్లు ఇచ్చింది.

అదేవిధంగా 130 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు కొన్నాయి. రూ.940 కోట్లకు 1293 ఎకరాలను కొనుగోలు చేయగా... అందులో రూ.540కోట్లను ఆయా సంస్థలు ఇప్పటికే చెల్లించాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో ప్రజలకు ఫ్లాట్ల ప్రాజెక్టులో రూ.72 కోట్లు కొనుగోలుదారులు చెల్లించారు. 350 మంది అఖిలభారత సర్వీసు అధికారులు తమకిచ్చిన స్థలాలకు రూ.87.5 కోట్లు చెల్లించారు. అన్నింటికీ మించి రైతులు త్యాగాలు చేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న రాజధానిని ఇప్పుడు తరలిస్తామనేందుకు వీలులేదు. అలా తరలిస్తే అది దేశ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపిస్తుంది. కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయి. అవేంటో అవసరమైన సందర్భంలో చెప్తాం’ అని సుజనా స్పష్టం చేశారు.

అదనపు ఖర్చెందుకు?
‘అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని మంత్రులు చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి మరో రూ.8వేల కోట్లు సరిపోతాయి. ఇంకా అదనంగా కావాలంటే డబ్బులున్నప్పుడే చిన్నగా నిర్మించుకోవచ్చు. డబ్బుల్లేవని అంటున్న ప్రభుత్వం అసలు తరలింపు పేరుతో అదనపు ఖర్చు పెట్టడమెందుకు? ఇక్కడ సచివాల యం ఉంది. హైకోర్టు నడుస్తోంది. ఒకవేళ హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్లినా ఇబ్బంది లేదు. రాజ్‌భవన్‌ కూడా ఏర్పాటుచేశారు. గవర్నర్‌ ఏమైనా ఆ రాజ్‌భవన్‌ సరిపోవడం లేదన్నారా?’ అని సుజనాచౌదరి ప్రశ్నించారు. పొరపాట్లు జరుగుతుంటాయని, ఇప్పటికైనా వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు.

విజయసాయి స్థాయిలేని వ్యక్తి
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో తనపైనా ఆరోపణలు చేశారని, సీబీసీఐడీ అధికారులు తన గ్రామంలో కూడా తిరిగి విచారించారని సుజనాచౌదరి చెప్పారు. కానీ ఎక్కడా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట అసెంబ్లీలో కూడా పలువురి పేర్లు చదివిన ముఖ్యమంత్రి జగన్‌... తన పేరు చదవలేకపోయారని, ఏమైనా భయమేమో అని సుజన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా సీబీఐ విచారణ అంటున్నారని, అంటే రాష్ట్రంలో పనికిరాని సీబీసీఐడీ వ్యవస్థ ఉందని అర్థమా? అని ప్రశ్నించారు. విజయసాయిరె డ్డి మీపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్రపతికి ఫి ర్యాదు చేశారు కదా? అని ప్రశ్నించగా... ‘విజయసాయిరెడ్డి స్థాయి లేని వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో నా యకుడైన మనిషి. సీబీఐ విచారణ చేయాలని గతంలోనే స్వాగతించిన వ్యక్తిని నేను. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కేసు వేస్తే... అంతా స్టేకు వె ళ్లారు. నేను స్టేకు కూడా వెళ్లకుండా స్వాగతించా. సాక్షి పత్రికలోనే కోటి రూపాయల ప్రకటన ఇచ్చి... ఎవరైనా వచ్చి విచారించుకోవచ్చని చెప్పా’ అని గుర్తు చేశారు.

బుగ్గనపై పరువునష్టం దావా: రావెల
సుజనాచౌదరిపై విమర్శలు చేసే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని రావెల కిషోర్‌బాబు పేర్కొన్నా రు. సుజనా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ తో మాట్లాడి పలు నిధులను రాష్ట్రానికి తెచ్చారని, సాయిరెడ్డి రాష్ర్టానికి తెచ్చింది ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినట్లు మంత్రి బుగ్గన తనపై ఆరోపణలు చేశారని, మైత్రి సంస్థ పేరుతో తాను 40.48 ఎకరాలు కొన్నానని ఆరోపించారన్నారు. వీటికి ఆధారాలు బయటపెట్టాలని, లేకుంటే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని రావెల అన్నారు.
తలదన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు!
‘రాజధాని రైతులారా ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే... తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం!’’... ఇవీ రాజధాని రైతులను ఉద్దేశించి సుజనాచౌదరి చెప్పిన ఓదార్పు మాటలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఒక ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి మరో ప్రభుత్వం కుదరదంటే కోర్టులు చూస్తూ కూర్చోవన్నారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో నిబంధనలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. దాని ప్రకారం అభివృద్ధి చేస్తామంటేనే రైతులు భూములు ఇచ్చేందుకు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గితే రైతులు లక్ష కోట్లు అడిగే హక్కు ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడు వారు కోర్టుకు వెళితే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే ఏపీ ముగినిపోతుందని సుజన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, అక్రమాలకు వైసీపీ వారికి అవకాశం లేదనే విశాఖ మీద పడ్డారని ఆయన ఆరోపించారు.

ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం జగన్‌కులేదు

జగన్‌కు ఆ అధికారం లేదు
31-12-2019 04:14:30

అమరావతిని ముక్కలు చేస్తారా?.. రాజధానిపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి
ఆ భూములను సెజ్‌లకు ఇచ్చే కుట్ర
విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నేతలు
సీపీఐ నారాయణ
హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఏ మాత్రమూ లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని మొదట జగన్‌ కూడా అంగీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎక్కడా పేర్కొనలేదు. రాజధానిని మార్చాలంటే జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మించారని, రోడ్ల నిర్మాణం కూడా జరిగిందని, కాలువలు, చెరువులను పూడ్చేశారని తెలిపారు. ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చినా, వ్యవసాయం చేసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. మిగిలిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందన్నారు. వాటిని ఎలాగో రైతులు తీసుకోరని, దీంతో ఆ భూములను సెజ్‌లకు ఇవ్వవచ్చని జగన్‌ యోచిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి మిత్రులని, అందుకే ఒకరినొకరు మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లోని భూములకు రేట్లు పెరిగాయని, దీంతో జగన్‌కు కేసీఆర్‌ ధన్యవాదాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌గా మారిందని, అక్కడ ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నారాయణ అన్నారు. అమరావతిని కొనసాగించేదాకా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయన్నారు. భూ దొంగలను కాపాడే విషయంలో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని నారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నాయకులు మారిపోయారని, వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు.

అన్యాక్రాంతమైన భూములివే..
మధురవాడలోని సర్వే నం.331/5లోని 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో స్థానిక నాయకుల ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.28/2లో స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.161/1లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
కొమ్మాది సర్వే నం.7లో 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.154/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.7లో 50 ఎకరాలు మైటాస్‌ సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ మాయమైనా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తికి పరదేశిపాలెం సర్వే నం.66లో 35 ఎకరాలు భూదాన భూమి.
పెందగంట్యాడ సర్వే నం.274లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
గాజువాక సర్వే నం.87లో 1000 చదరపు గజాల భూమి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యుల ఆక్రమణ.
పెందుర్తి మండలం ముదపాక భూముల విషయంలో సిట్‌ నిర్ధారణ బయటపెట్టాలి.
పరదేశిపాలెం సర్వే నం.101/1లో నాలుగు ఎకరాల 89 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు
31-12-2019 04:44:19

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రజల్లో అభద్రతా భావం కలిగించిన ఎన్‌పీఆర్‌, ఎన్సార్సీలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో 13 జిల్లాల మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ‘లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు జగన్‌ విప్‌ జారీ చేయించారు. మద్దతుగా ఓటు వేయించారు. రాష్ట్రంలో ఆఘమేఘాల మీద గెజిట్‌తోపాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ మైనారిటీలను మోసం చేస్తున్నారు’ అన్నారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి టీడీపీకే ఉందని మైనారిటీ నేత హిదాయత్‌ పేర్కొన్నారు.

14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు


14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు
అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటించనున్నారు.

మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లె మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
గుంటూరు: రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలైన రైతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఐకాస నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి కోసం పోరాటం ఆగదని.. ప్రాణాలు అర్పించైనా రాజధానిని సాధిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది. 

ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం : బొత్స


ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు. ఉగాది నాటికి విజయనగరంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత వైకాపా ప్రభుత్వానిదని బొత్స అన్నారు.

రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్‌ లక్ష్యమని బొత్స వివరించారు. విమర్శలు చేసే ముందు తెదేపా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే మద్దాలి !

వంశీ బాటలో మద్దాలి !
జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే
పార్టీ అంగీకరించకపోతే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అడుగుతా: గిరి
ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం: తెదేపా

వంశీ బాటలో మద్దాలి !

ఈనాడు, అమరావతి: తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు... గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే, వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని మద్దాలి తెలిపారు. రాజధానిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రాజధానిపై మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నేను తెదేపా, చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రమే అంటున్నా. రాజధానిపై జనవరిలో కమిటీ నివేదిక వచ్చాక నాకు విషయం చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు అపోహపడనవసరం లేదు. రైతులందరితో మాట్లాడాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని మద్దాలి వ్యాఖ్యానించారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇసుక కొరతపై తెదేపా ఆందోళన చేసినప్పుడు ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, రాజధాని ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు మద్దాలి గిరిని లొంగదీసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.‘‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)ను ఎప్పుడు నియమించారు? ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్యతో ఉన్న స్నేహమే ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించడానికి కారణమా?’’ అని ధ్వజమెత్తారు.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం

అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని, అంత పకడ్బందీగా చట్టాలు, ఒప్పందాలున్నాయని... తెదేపా, భాజపా, ఆంధ్రా మేధావుల ఫోరం, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు, న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలించడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా సోమవారం అమరావతి రైతులు తుళ్లూరు, మందడంలో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు... వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

వ్యతిరేకిస్తే ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
మొండివాడు రాజు కన్నా బలవంతుడని అంటారు. అదే మొండివాడు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించే వారిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని కొందరు మాట్లాడుతున్నారు. 6 రాష్ట్రాల్లో అసలు హైకోర్టులే లేవనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాజధాని కోసం ఇప్పటికే 6 కమిటీలు చేశారు. ఇంకెన్ని కమిటీలు వేస్తారు?

- చలసాని శ్రీనివాస్‌,ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు

తుగ్లక్‌ పాలన ప్రత్యక్షంగా చూస్తున్నాం
తుగ్లక్‌ పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం. జగన్‌ పాలనతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీఎం మారగానే రాజధానిని మార్చడం తొలిసారి వింటున్నాం. జగన్‌ సీఎం పదవికి అనర్హుడు.

- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

మతిలేని పని
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందో లేదో గానీ.. అమరావతి నుంచి తరలిస్తే మాత్రం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ మతిలేని పని. అభివృద్ధి వికేంద్రీకరణ అందరికీ అంగీకారమే. న్యాయస్థానం మార్పుపై న్యాయవాదుల్ని అడిగారా?

- చలసాని అజయ్‌, న్యాయవాదుల ఐకాస నేత

విశాఖలో భూములు కొనేందుకే ఆగారా?
ప్రమాణస్వీకారం రోజే రాజధాని మారుస్తామని సీఎం జగన్‌ ఎందుకు చెప్పలేదు? విశాఖలో భూములు కొనడానికే ఈ 7 నెలలు ఆగారా? అమరావతి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? మంత్రి బొత్స ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజధాని తరలించవచ్చని ప్రధాని మోదీ ఆయన చెవిలో చెప్పారా?

- మాలతివాణి, భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాలు ఉన్నా లఖ్‌నవూ ఒక్కటే రాజధాని. అలాంటిది 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టడమనేది అవివేకం. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. రైతుల త్యాగాలను గుర్తించకపోగా వారిని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా?

- గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే తరలింపు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే రాజధాని తరలిస్తున్నారా? అని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు కుమారస్వామి, పి.శివాజీ ప్రశ్నించారు. 151 శాసనసభ స్థానాలు వచ్చాయని జగన్‌ కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత జేడీ రాజశేఖర్‌ అన్నారు. హైకోర్టును తరలించడానికి వీళ్లేమీ సుప్రీంకోర్టు కాదని శ్రామిక వికాస సంఘటన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు యజ్ఞనారాయణ పేర్కొన్నారు.

Sunday, December 29, 2019

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి - BV Raghavulu

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి 
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సవాల్‌

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి



విశాఖ: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అనడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పూర్తిస్థాయి రాజధానిని విశాఖ తరలించాలని సవాల్‌ విసిరారు. రాజధానిగా అమరావతి ఉండాలనే విషయంపై అన్ని రాజకీయపక్షాలు ఒకే మాటపై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడం సరికాదన్నారు. జనాభా లెక్కల గురించి తెలియని వాళ్లు అమరావతి విషయంలో సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ విశాఖ పర్యటనలో ఈ ప్రాంతం గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ అలా జరగలేదన్నారు.

Saturday, December 7, 2019

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’
07-12-2019 20:15:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, రాజ్యసభ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నేత  సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి.!  ఇవాళ టీడీపీకి చెందిన కీలక నేత బీద మస్తాన్ రావు ఆ పార్టీకి టాటా చెప్పేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీదమస్తాన్ రావు పార్టీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారని మంత్రి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు!.

మేం ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. అంతటితో ఆగని మంత్రి త్వరలో టీడీపీ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. అయితే అనిల్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ పార్టీ మారబోతున్నదెవరు..? అనిల్‌కు నిజంగానే సమాచారం ఉందా..? ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి టచ్‌లో ఉన్నారా..? అనే దానిపై మాత్రం మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Friday, December 6, 2019

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని పవన్‌ కల్యాణ్‌


బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
ఢిల్లీ బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్

Updated: Nov 15, 2019, 12:05 PM IST
కామెంట్ చేయండి | 
ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
File photo
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పవన్ మాత్రం అక్కడ కేంద్రంలోని పెద్దలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించి, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో భోదన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్... అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లి కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పవన్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలోనే  కేంద్రంలోని పలువురు పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.


పవన్ కళ్యాణ్  మోదీ

బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు.


బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్తిరుపతి సమావేశంలో పవన్ కళ్యాణ్
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 4, 2019, 2:47 PM IST
SHARE THIS:

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్... అదే జరిగి ఉంటే... వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారని.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. తెలుగ సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.





ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం - Chandrababu

ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం
06-12-2019 03:38:36

దుష్ప్రచారంతో అమరావతిని చంపేస్తున్నారు
ప్రసిద్ధ రాజధానిని కోరుకోవడం తప్పా?
నష్టం నాకు కాదు.. భావితరాలకే
రాజధాని అంటే ఆదాయం, ఉద్యోగాలు
విభజనతో ఒకసారి నష్టపోయాం
రాజధానిని పాడుచేసుకుని నష్టపోవద్దు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తున్నాయి
వర్సిటీలు, దాదాపు పూర్తయిన టవర్లు, పేదల ఫ్లాట్లు గ్రాఫిక్సేనంటారా?
రౌండ్‌ టేబుల్‌ భేటీలో బాబు ప్రశ్న
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మనకొక ప్రపంచస్ధాయి ప్రసిద్ధ రాజధాని ఉండాలనుకోవడం తప్పా.. అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో తాను తప్పు చేశానని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు అభిప్రాయపడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. చరిత్ర పొడవునా ఒక మంచి రాజధాని నగరం లేని దురదృష్టం ఆంధ్రులను వెన్నాడాల్సిందేనా అని వాపోయారు. గురువారం విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాలులో ప్రజా రాజధాని అమరావతిపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనకొక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకోలేమా? హైదరాబాద్‌లో సాధ్యమైంది అమరావతిలో ఎందుకు కాదు’ అని ప్రశ్నించారు. అక్కడ తన త ర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ సహా ఎవ రూ హైదరాబాద్‌ను చెడగొట్టలేదని.. ఆ ప్రణాళికల ను కొనసాగించారని తెలిపారు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందన్నారు. రకరకాల దుష్ప్రచారాల తో అమరావతిని చంపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘దానిని చంపేస్తే నాకొచ్చిన నష్టమేమీ లేదు. భావితరాలు, తెలుగు జాతి నష్టపోతాయి. ఒక పెద్ద రాజధాని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం, సంపద, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణకి వస్తున్న ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మహారాష్ట్రకు 57 శాతం ముంబై నుంచి వస్తోంది. నా కులం వారో.. నా బంధువులో ఉన్నారని హైదరాబాద్‌ కోసం శ్రమించానా? మొత్తం తెలుగు జాతి కోసం శ్రమించాను’ అని తెలిపారు.

స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలిచ్చారు..
‘భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాం. రైతులకు ఒక్క పిలుపు ఇస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చా రు. ఇంత కంటే మంచి నమూనా లేదని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ దీనిని అధ్యయన అంశంగా స్వీకరించింది. సింగపూర్‌లో అవినీతి మచ్చుకైనా కనిపించదు. నాపై కుదిరిన నమ్మకంతో అడిగిన వెంటనే మన రాజధానికి ప్రణాళిక తయారు చేసి ఇవ్వడానికి సింగపూర్‌ అంగీకరించింది. మన వద్ద స్టార్టప్‌ ఏరియాలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రెండున్నర లక్షల ఉ ద్యోగాలు సృష్టించాలని అనుకున్నారు. ఈ ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టింది. నాపై కోపం ఉంటే ఉండవ చ్చు. కానీ రాజధానిపైనా.. ఇక్కడకు రావాలనుకున్న సంస్థలపైనా కోపమెందుకు?. రాష్ట్ర ప్రజలు, యువత, మేధావులు ఆలోచించా లి. రాజకీయంగా మాతో విభేదించేవారు ఉండవ చ్చు. కానీ మీ దారిలో మీరు రాజధాని కోసం పోరాడండి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి.. విభజనతో ఒకసారి నష్టపో యాం. రాజధానిని పాడుచేసుకుని మరోసారి నష్ట పోవద్దు’

ప్రభుత్వ నిధులు అక్కర్లేదు..
‘ఏ పనికీ రోడ్డు తవ్వే అవసరమే ఉండదు. కరెం టు తీగల కోసం చెట్ల కొమ్మలు కొట్టే పని ఉండదు. చివరకు గ్యాస్‌, ఏసీ కూడా పైపులతో ఇంటింటికీ అందేలా ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్‌ స హా దేశంలో ఏ నగరంలో ఇన్ని వసతులు లేవు. ఇ ప్పటికి ఖర్చు చేసింది కాక అమరావతిలో పూర్తి స్థాయి వసతుల నిర్మాణానికి ఇంకా రూ.లక్ష కోట్లు కావాలి. దీనికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం చేతిలో 8 వేల ఎకరాల భూమి ఉంది. దానిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ ఆ నిధులతోనే ఈ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉండేది. ప్రపంచ బ్యాంకు నిధులివ్వడానికి ముందుకొచ్చింది. జగన్‌ ప్రభుత్వానికి ఆసక్తి లేదని వెనక్కి వెళ్లిపోయింది. ఏపీలో జగన్‌ మాదిరిగా పాత ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచిస్తూ జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిని ఈ దేశంలోకి వచ్చే పెట్టుబడులు తగ్గుతున్నాయని కేంద్రమే బాధపడే పరిస్థితి వచ్చింది’

అన్నిటినీ పోగొట్టారు..
‘రాష్ట్రంలో అమరావతి ఒక్కదానినే అభివృద్ధి చే యాలని మా ప్రభుత్వం అనుకోలేదు. పలు నగరాలను అభివృద్ధిచేసి వికేంద్రీకరణ జరపాలనుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యకు సమాధానమిచ్చారు. ‘ప్రముఖ కంపెనీ అదానీని ఒప్పించి విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా సెం టర్‌ పెట్టడానికి తీసుకొచ్చాం. అది వస్తే విశాఖ స్వరూపమే మారిపోయేది. దానిని పోగొట్టారు. విశాఖలో ఒక పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ పెట్టడానికి లులూ గ్రూప్‌ను తెచ్చాం. వాళ్లనూ పోగొట్టారు. మేం రాక ముందు తిరుపతిలో సెల్‌ఫోన్ల తయారీ లేదు.

ఇప్పు డు దేశంలో తయారయ్యే సెల్‌ఫోన్లలో 20-30 శా తం అక్కడే తయారవుతున్నాయి. ఏభై శాతానికి పెంచ డానికి రిలయన్స్‌ కంపెనీని తెచ్చాం. అదీ పోయింది. ప్రకాశం జిల్లాలో రూ.25 వేల కోట్లతో పే పర్‌ పరిశ్రమ తెచ్చాం. వాళ్లూ వెళ్లిపోయారు. ఎంతో పోటీ ఎదుర్కొని అనంతపురం జిల్లాకు కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. దానికంత సబ్సిడీ ఎందుకని మా ట్లాడారు. మనం ఇవ్వకపోతే దానిని ఎగరేసుకుపోవడానికి అప్పట్లో మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. కర్నూలుకు ఎయిర్‌ పోర్టు, సోలార్‌ పరిశ్రమలు, యూనివర్సిటీలు తెచ్చాం. అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి కట్టుబడే పనిచేశాం’ అని వివరించారు. అమరావతి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికలతో ఆకర్షితుడైన ప్రధాని మోదీ స్వయం గా ఫోన్‌ చేసి కజక్‌స్థాన్‌ దేశ రాజధాని అస్తానా (నూర్‌-సుల్తాన్‌)ను చూసి రావాలని కోరారని.. మ నం చేయగలమన్న నమ్మకం వల్లే ఇలాంటి సలహా ఇచ్చారన్నారు. ఇక్కడ ఆస్పత్రులు లేనందువల్ల హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తున్నట్లు జగన్‌ చెప్పారని.. రాజధానిని అభివృద్ధి చేసుకోకపోతే మన ఆస్పత్రులు ఏనాటికీ ఎదగలేవన్న సత్యాన్ని విస్మరిస్తున్నారనివ్యాఖ్యానించారు.