Monday, December 30, 2019

ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం జగన్‌కులేదు

జగన్‌కు ఆ అధికారం లేదు
31-12-2019 04:14:30

అమరావతిని ముక్కలు చేస్తారా?.. రాజధానిపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి
ఆ భూములను సెజ్‌లకు ఇచ్చే కుట్ర
విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నేతలు
సీపీఐ నారాయణ
హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఏ మాత్రమూ లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని మొదట జగన్‌ కూడా అంగీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎక్కడా పేర్కొనలేదు. రాజధానిని మార్చాలంటే జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మించారని, రోడ్ల నిర్మాణం కూడా జరిగిందని, కాలువలు, చెరువులను పూడ్చేశారని తెలిపారు. ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చినా, వ్యవసాయం చేసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. మిగిలిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందన్నారు. వాటిని ఎలాగో రైతులు తీసుకోరని, దీంతో ఆ భూములను సెజ్‌లకు ఇవ్వవచ్చని జగన్‌ యోచిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి మిత్రులని, అందుకే ఒకరినొకరు మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లోని భూములకు రేట్లు పెరిగాయని, దీంతో జగన్‌కు కేసీఆర్‌ ధన్యవాదాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌గా మారిందని, అక్కడ ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నారాయణ అన్నారు. అమరావతిని కొనసాగించేదాకా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయన్నారు. భూ దొంగలను కాపాడే విషయంలో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని నారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నాయకులు మారిపోయారని, వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు.

అన్యాక్రాంతమైన భూములివే..
మధురవాడలోని సర్వే నం.331/5లోని 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో స్థానిక నాయకుల ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.28/2లో స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.161/1లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
కొమ్మాది సర్వే నం.7లో 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.154/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.7లో 50 ఎకరాలు మైటాస్‌ సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ మాయమైనా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తికి పరదేశిపాలెం సర్వే నం.66లో 35 ఎకరాలు భూదాన భూమి.
పెందగంట్యాడ సర్వే నం.274లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
గాజువాక సర్వే నం.87లో 1000 చదరపు గజాల భూమి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యుల ఆక్రమణ.
పెందుర్తి మండలం ముదపాక భూముల విషయంలో సిట్‌ నిర్ధారణ బయటపెట్టాలి.
పరదేశిపాలెం సర్వే నం.101/1లో నాలుగు ఎకరాల 89 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు
31-12-2019 04:44:19

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రజల్లో అభద్రతా భావం కలిగించిన ఎన్‌పీఆర్‌, ఎన్సార్సీలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో 13 జిల్లాల మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ‘లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు జగన్‌ విప్‌ జారీ చేయించారు. మద్దతుగా ఓటు వేయించారు. రాష్ట్రంలో ఆఘమేఘాల మీద గెజిట్‌తోపాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ మైనారిటీలను మోసం చేస్తున్నారు’ అన్నారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి టీడీపీకే ఉందని మైనారిటీ నేత హిదాయత్‌ పేర్కొన్నారు.

14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు


14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు
అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటించనున్నారు.

మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లె మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
గుంటూరు: రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలైన రైతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఐకాస నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి కోసం పోరాటం ఆగదని.. ప్రాణాలు అర్పించైనా రాజధానిని సాధిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది. 

ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం : బొత్స


ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు. ఉగాది నాటికి విజయనగరంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత వైకాపా ప్రభుత్వానిదని బొత్స అన్నారు.

రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్‌ లక్ష్యమని బొత్స వివరించారు. విమర్శలు చేసే ముందు తెదేపా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే మద్దాలి !

వంశీ బాటలో మద్దాలి !
జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే
పార్టీ అంగీకరించకపోతే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అడుగుతా: గిరి
ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం: తెదేపా

వంశీ బాటలో మద్దాలి !

ఈనాడు, అమరావతి: తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు... గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే, వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని మద్దాలి తెలిపారు. రాజధానిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రాజధానిపై మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నేను తెదేపా, చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రమే అంటున్నా. రాజధానిపై జనవరిలో కమిటీ నివేదిక వచ్చాక నాకు విషయం చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు అపోహపడనవసరం లేదు. రైతులందరితో మాట్లాడాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని మద్దాలి వ్యాఖ్యానించారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇసుక కొరతపై తెదేపా ఆందోళన చేసినప్పుడు ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, రాజధాని ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు మద్దాలి గిరిని లొంగదీసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.‘‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)ను ఎప్పుడు నియమించారు? ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్యతో ఉన్న స్నేహమే ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించడానికి కారణమా?’’ అని ధ్వజమెత్తారు.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం

అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని, అంత పకడ్బందీగా చట్టాలు, ఒప్పందాలున్నాయని... తెదేపా, భాజపా, ఆంధ్రా మేధావుల ఫోరం, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు, న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలించడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా సోమవారం అమరావతి రైతులు తుళ్లూరు, మందడంలో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు... వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

వ్యతిరేకిస్తే ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
మొండివాడు రాజు కన్నా బలవంతుడని అంటారు. అదే మొండివాడు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించే వారిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని కొందరు మాట్లాడుతున్నారు. 6 రాష్ట్రాల్లో అసలు హైకోర్టులే లేవనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాజధాని కోసం ఇప్పటికే 6 కమిటీలు చేశారు. ఇంకెన్ని కమిటీలు వేస్తారు?

- చలసాని శ్రీనివాస్‌,ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు

తుగ్లక్‌ పాలన ప్రత్యక్షంగా చూస్తున్నాం
తుగ్లక్‌ పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం. జగన్‌ పాలనతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీఎం మారగానే రాజధానిని మార్చడం తొలిసారి వింటున్నాం. జగన్‌ సీఎం పదవికి అనర్హుడు.

- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

మతిలేని పని
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందో లేదో గానీ.. అమరావతి నుంచి తరలిస్తే మాత్రం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ మతిలేని పని. అభివృద్ధి వికేంద్రీకరణ అందరికీ అంగీకారమే. న్యాయస్థానం మార్పుపై న్యాయవాదుల్ని అడిగారా?

- చలసాని అజయ్‌, న్యాయవాదుల ఐకాస నేత

విశాఖలో భూములు కొనేందుకే ఆగారా?
ప్రమాణస్వీకారం రోజే రాజధాని మారుస్తామని సీఎం జగన్‌ ఎందుకు చెప్పలేదు? విశాఖలో భూములు కొనడానికే ఈ 7 నెలలు ఆగారా? అమరావతి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? మంత్రి బొత్స ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజధాని తరలించవచ్చని ప్రధాని మోదీ ఆయన చెవిలో చెప్పారా?

- మాలతివాణి, భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాలు ఉన్నా లఖ్‌నవూ ఒక్కటే రాజధాని. అలాంటిది 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టడమనేది అవివేకం. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. రైతుల త్యాగాలను గుర్తించకపోగా వారిని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా?

- గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే తరలింపు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే రాజధాని తరలిస్తున్నారా? అని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు కుమారస్వామి, పి.శివాజీ ప్రశ్నించారు. 151 శాసనసభ స్థానాలు వచ్చాయని జగన్‌ కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత జేడీ రాజశేఖర్‌ అన్నారు. హైకోర్టును తరలించడానికి వీళ్లేమీ సుప్రీంకోర్టు కాదని శ్రామిక వికాస సంఘటన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు యజ్ఞనారాయణ పేర్కొన్నారు.