Sunday, March 10, 2024

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

 CM Jagan: ‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:13 PM


తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు. ప్రజల చేతులో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు.


CM Jagan:  ‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు


బాపట్ల: తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు. ప్రజల చేతులో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు. అరడజను పార్టీలతో పొత్తుతో, ఎత్తులతో, జిత్తులతో రాజకీయం నడుపుతున్నారని మండిపడ్డారు. జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని అన్నారు. చంద్రబాబు ముగ్గురుతో కలిసి పొత్తు అంటున్నాడన్నారు. ఆదివారం నాడు మేదరమెట్ల వద్ద ‘సిద్ధం’ చివరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పేదలను గెలిపించాలని తాను పోరాడుతున్నానని తెలిపారు. ధర్మం, అధర్మంలా మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని అన్నారు. తనకు స్టార్ క్యాంపైనర్లు లేరని స్పష్టం చేశారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపైనర్లు తనకు ఉన్నారని చెప్పారు. నాలుగు రోజుల్లోనే రాబోయే ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.



ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన చంద్రబాబు


లంచాలు, వివక్ష లేని పాలనతో మన ఫ్యాన్‌కి కరెంట్ వస్తుందన్నారు. మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా లేదని ధ్వజమెత్తారు. 2014లో ఇచ్చిన హామీలు టీడీపీ కూటమి అమలు చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట తప్పారని చెప్పారు. మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు పొత్తుల డ్రామాతో అందరి ముందుకు వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు పొత్తులతో ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిందని తెలిపారు. రూ. 2.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని అన్నారు. డీబీటీ, నాన్ టీబీటీ ద్వారా రూ. 3.75 లక్షల కోట్లు 58 నెలల కాలంలో ప్రజలకు అందించామని వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఏపీ శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 8 సంక్షేమ పథకాలకు రూ. 75 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. చంద్రబాబు చెబుతున్న పథకాలకు మరో రూ. 87,312 కోట్లు కావాలని వివరించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వలంటీర్లు వివరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు


Saturday, January 7, 2023

భయం నీడన జగన్‌!

భయం నీడన జగన్‌!

RK KOTTAPALUKU: 

ABN , First Publish Date - 2023-01-08T00:57:45+05:30 IST


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా? రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయించడం చూస్తే ఈ సందేహం కలుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగి మొత్తం 11 మంది దుర్మరణం చెందడంతో దాన్ని సాకుగా తీసుకున్న ప్రభుత్వం జీవో నెంబర్‌ 1 జారీ చేసింది. చంద్రబాబు రోడ్‌షోలకు జనం పోటెత్తుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యం కూడా ఉండటంతో ప్రభుత్వ ఉద్దేశంపై సహజంగానే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో స్వేచ్ఛగా తిరగకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించడం జగన్మోహన్‌ రెడ్డి నిజస్వరూపాన్ని చెప్పకనే చెబుతోంది. కందుకూరు, గుంటూరులో రెండు విషాదాలు జరిగినంత మాత్రాన సొంత నియోజకవర్గానికి వెళ్లే హక్కును కూడా ప్రతిపక్ష నాయకుడు కోల్పోతారా? ప్రజల ప్రాణాలు కాపాడటానికే ర్యాలీలు, సభలను నిషేధించామని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వాదనలు నిజమైతే అధికార పార్టీ నాయకులు మాత్రం రోడ్డుపై ర్యాలీలు, సభలు యథేచ్ఛగా ఎలా నిర్వహించగలుగుతున్నారు? ఈ ప్రశ్నకు పోలీసుల వద్ద కూడా సమాధానం ఉండదు. రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు జరుపుకోకుండా నిషేధించే అధికారం అసలు ప్రభుత్వానికి ఉంటుందా? బ్రిటిష్‌ కాలంలో 1861లో తెచ్చిన చట్టం ప్రకారం జీవో నెం.1 జారీ చేయడం సమర్థనీయమా? సమర్థనీయమే అనుకుంటే 1861 నాటి చట్టంలోని సెక్షన్‌ 30 చెబుతున్నది ఏమిటి? ఆ సెక్షన్‌కు ప్రస్తుతం పోలీసులు ఇస్తున్న నిర్వచనం ఏమిటి? 1861 నాటి చట్టంలోని సెక్షన్‌ 30 ప్రకారం ర్యాలీలు, సభలు నిషేధించే అధికారం పోలీసులకు ఉండదు. సెక్షన్‌ 30లోని సబ్‌ సెక్షన్‌ 3 ప్రకారం ర్యాలీలు, సభలు జరుపుకోవాలనుకునేవారు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరే అధికారం మాత్రమే ఈ సెక్షన్‌ పోలీసు అధికారులకు కల్పిస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ర్యాలీలు, సభలను గంపగుత్తగా నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేసే సమయంలో సంబంధిత అధికారులు సొంత బుర్ర ఉపయోగించిన దాఖలాలు లేవు. సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వం 1861లో డీఎస్పీ, ఆ పైస్థాయి అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఒక చట్టం తెచ్చింది. అప్పట్లో కిందిస్థాయి పోలీసు ఉద్యోగులలో భారతీయులే ఎక్కువగా ఉండేవారు. స్వాతంత్య్ర పోరాట ఆకాంక్షలను మొగ్గలోనే తుంచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేయడానికి విపరీత అర్థాలతో అమలు చేయాలనుకోవడం దుర్మార్గమే అవుతుంది. ముఖ్యమంత్రి ఏదనుకుంటే అది జీవో రూపంలో జారీ చేయడానికి అధికారులు పోటీపడటం వింతగా ఉంది. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుందాం. తాను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానని, ఎవరికైనా చెప్పి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయించాలని కూచిపూడి నాట్య ప్రముఖుడు నటరాజ రామకృష్ణ అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డిని కోరారు. ఎవరికి చెప్పాలి? అని సంజీవరెడ్డి ప్రశ్నించగా అప్పట్లో నిర్మాణదశలో ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీరుకు చెప్పండని రామకృష్ణ సూచించారు. డబ్బు సహాయం చేయమని ప్రభుత్వ అధికారులకు తాను చెప్పలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలా అయితే ప్రాజెక్టు వద్ద తమ బృందంతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటానని, టికెట్లు అమ్మించి పెట్టమని చీఫ్‌ ఇంజనీర్‌కు సూచించడంతో పాటు సదరు నృత్య ప్రదర్శనకు హాజరు కావాల్సిందిగా నీలం సంజీవరెడ్డిని రామకృష్ణ కోరడం, ఆయన అంగీకరించడం జరిగింది. అయితే అప్పట్లోనే 5, 10 రూపాయలుగా టికెట్ల ధరలను నిర్ణయించడంతో వాటిని ఉద్యోగులకు అంటగట్టలేక చీఫ్‌ ఇంజనీర్‌ తలపట్టుకోగా, కాంట్రాక్టర్లు చొరవ తీసుకుని కష్టనష్టాలకోర్చి తలా ఒక చేయి వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ప్రాజెక్టు వద్ద పనిచేసిన ఒక విశ్రాంత అధికారి నాకు లేఖ ద్వారా తెలియజేశారు. ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వ్యక్తిత్వానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడదే రాయలసీమకు చెందిన జగన్మోహన్‌రెడ్డి చేస్తున్నది ఏమిటి? ఫక్తు పాలెగాడి వలే పాలన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టేవారిపైనా, ప్రశ్నించే వారిపైనా కక్ష గడుతున్నారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థను కూడా ఉపేక్షించడంలేదు. నిబంధనలను అతిక్రమించడం వల్ల న్యాయస్థానం మెట్లు ఎక్కుతూ చివాట్లు తింటున్న అధికారులు కూడా ఆదిలోనే అభ్యంతరం పెట్టకుండా ముఖ్యమంత్రికి ఊడిగం చేయడంలోనే అలౌకికానందాన్ని పొందుతున్నారు. జీవో నెంబరు 1 జారీ చేసిన అధికారులు కూడా ఈ కోవలోకే వస్తారు.


Powered By

VDO.AI


ర్యాలీలు, సభలు మాత్రమే కాకుండా ఎక్కడ జనసమూహాలు గుమిగూడినా భద్రతా ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు కూడా భద్రతా ఏర్పాట్లు చేసే పోలీసులు ప్రతిపక్ష నాయకుల ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేయకపోవడం ఆక్షేపణీయం కాదా? గుంటూరులో ఈ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ర్యాలీలకు, సభలకు భద్రత కల్పించడం లేదా? అన్న సందేహం కూడా కలుగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమాలకు వేల మంది పోలీసులను నియమించే అధికారులు ప్రతిపక్ష నాయకుడి సభకు కనీస భద్రత కల్పించలేరా? జగన్మోహన్‌ రెడ్డి సైకాలజీని పరిశీలిస్తే కందుకూరు, గుంటూరు దుర్ఘటనల వెనుక కుట్ర కోణం కూడా ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. జనం భారీగా గుమిగూడినప్పుడు తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకొని తొక్కిసలాటకు వ్యూహ రచన చేసి ఉండవచ్చు కదా? చంద్రబాబు సభలకు, ర్యాలీలకు జనం పెద్దగా రావడంలేదని, అయినా జనం వచ్చారని చెప్పుకోవడానికి ఇరుకు సందులలో సభలు పెట్టుకుంటున్నారని జగన్‌ అండ్‌ కో వాదిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా! తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించి ఉంటే సరిపోయేది కదా! అలా చేయకుండా ఏకంగా జీవో నెం.1 జారీ చేశారంటే ప్రభుత్వం ఎవరికో, ఎక్కడో భయపడుతోందని భావించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డితో పాటు ఆయన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేశారు. ఈ రెండు సందర్భాలలోనూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అప్పుడు పాదయాత్రలకు ఆయన ఎటువంటి ఆటంకాలూ సృష్టించలేదు. అవసరమైన మేరకు భద్రత కల్పించారు. దరఖాస్తు చేసుకుంటే పాదయాత్రకు, సభలకు అనుమతిస్తామని పోలీసులు కోరినా జగన్మోహన్‌ రెడ్డి ఖాతరు కూడా చేయలేదు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ కూడా ఇవే ఇరుకు రోడ్లపై సభలు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలలో దురదృష్టకర సంఘటనలు జరగడం అసాధారణం ఏమీ కాదు. అంతమాత్రాన సభలు, ర్యాలీలను ఏ ప్రభుత్వం కూడా నిషేధించలేదు. దేశంలో 29 రాష్ర్టాలు ఉండగా ఒక్క జగన్‌ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలోనే ఈ జీవో జారీ కావడం గమనార్హం. ఇంగితం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా గుంటూరు, కందుకూరు సంఘటనల తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పార్టీలపరంగా, ప్రభుత్వపరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించి ఉండేవారు. ప్రతిపక్షాలతో చర్చించడం ఏమిటి నాన్సెన్స్‌ అని జగన్మోహన్‌ రెడ్డి అనుకున్నట్టున్నారు. అంతే.. తన ఫ్యాక్షన్‌ బుర్రకు పదునుపెట్టి చంద్రబాబు జనాన్ని కలుసుకోకుండా కట్టడి చేస్తే పోలా! అని జీవో జారీ చేయించినట్టున్నారు. కనీస వెరపు ఉండే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేరు. ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయడాన్ని వివేకం ఉన్న వారందరూ సమర్థిస్తున్నారని సలహాదారుడిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు గానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వివేకం, విజ్ఞత ఉన్నవారు ఎవరూ ఈ దుష్ట చర్యలను సమర్థించడం లేదు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ర్టాలలో కూడా ఆయన పాదయాత్ర జరిపారు. ఎక్కడా ఎవరూ అడ్డుకోలేదే! రాహుల్‌ గాంధీ పాదయాత్రలో కూడా జనం విశేషంగా పాల్గొంటున్నారు. అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు భద్రత కల్పించాయే గానీ అభ్యంతరపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నారని స్పష్టమవడం లేదా?


అనుక్షణం విధ్వంసకర ఆలోచనలు!


జీవో నెం.1 ద్వారా ఎవరినో భయపెట్టాలనుకున్న జగన్‌ రెడ్డి వ్యూహం బెడిసికొడుతోంది. కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబుకు ఆటంకాలు సృష్టించి ఉండకపోతే ఆయన పర్యటనకు కూలి మీడియాలో ప్రచారం లభించి ఉండేది కాదు. పోలీసుల ఓవరాక్షన్‌ కారణంగా విధిలేని పరిస్థితులలో వక్రీకరణతోనైనా కూలి మీడియాలో చంద్రబాబుకు చోటు లభించింది. చంద్రబాబు లేదా పవన్‌ కల్యాణ్‌ సభలు పెట్టుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన ప్రజాభిప్రాయం జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతుందా? అలా అయితే 1861లో ప్రత్యేక పోలీసు చట్టాన్ని తెచ్చిన బ్రిటిష్‌ పాలకులు స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయగలిగారా? సిపాయిల తిరుగుబాటు తర్వాత స్వాతంత్య్ర కాంక్ష మరింత పెరిగిందే గానీ తగ్గలేదు కదా! చివరికి బ్రిటిష్‌ పాలకులు తలవొంచి మనకు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిపోయారు కదా! జగన్‌రెడ్డి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎందుకు జరుగుతుంది? తన బటన్‌ నొక్కుడు చూసి ప్రజలంతా మురిసిపోతున్నారని జగన్‌ అండ్‌ కో నిజంగా నమ్ముతుంటే చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ర్యాలీలు నిర్వహిస్తావో, సభలు పెట్టుకుంటావో నీ ఇష్టం అని చంద్రబాబును వదిలేసి ఉండవచ్చు కదా? ఈ కారణంగానే వివేకం, విజ్ఞత కలిగి ఉన్న కొంత మంది మంత్రులు, అధికార పార్టీ నాయకులు జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో మరికొంత వ్యతిరేకత ఏర్పడుతుందే గానీ ఉపయోగం ఉండదని వారంతా అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్న దుష్ట ఆలోచనలు చేసే బదులు 50 శాతానికి పైగా ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్న తనకు కేవలం మూడున్నరేళ్లలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందా అని జగన్‌ ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. అధికారం శాశ్వతం కాదు– ఇవాళ తాను అమలుచేస్తున్న విధానాలే భవిష్యత్తులో తన పాలిట శాపాలుగా మారతాయని ఆయన ఎందుకు అంగీకరించలేకపోతున్నారో తెలియదు. తెల్లారి లేస్తే ఎవరిపై కేసు పెట్టాలి? ఎవరిని అరెస్టు చేయించాలి? ఎవరి ఇళ్లు, కార్యాలయాలపైకి జేసీబీలు పంపాలి? అనే విధ్వంసకర ఆలోచనలు చేసే ముఖ్యమంత్రికి ఎంతటి జనాదరణతో అధికారంలోకి వచ్చినా చివరకు పతనం తప్పదు. భయపెట్టి బతకాలనుకున్న వారు ఎవరూ విజయం సాధించలేదు. జగన్‌ రెడ్డి మాత్రం మినహాయింపు ఎందుకవుతారు? బిల్లులు చెల్లించకపోవడం వల్ల చేసిన అప్పులు చెల్లించడం కోసం కాంట్రాక్టర్లు దొంగతనం చేయాల్సిన దుస్థితి ఏర్పడినందుకు చింతించాల్సింది జగన్‌ మాత్రమే. విశ్రాంత ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు చెల్లించకుండా వారిని జేబు దొంగలుగా మార్చాలనుకుంటున్నారా? అని హైకోర్టు నిలదీయడం జగన్మోహన్‌ రెడ్డికి నామోషీగా అనిపించకపోవచ్చును గానీ ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు అది అవమానమే. రాష్ట్రంలో పుట్టినందుకు ప్రజలు చింతిస్తున్నారని జగన్‌రెడ్డి సొంత బావ బ్రదర్‌ అనిల్‌ తాజాగా వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? ఎంత పెద్ద ఫ్యాక్షనిస్టు అయినా ప్రత్యర్థులను భయపెడుతున్నానని భ్రమిస్తూ భయం నీడలోనే బతుకుతాడు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా ప్రతిపక్షాలను భయపెడుతున్నానని భ్రమిస్తూ భయంతో బతుకుతున్నారు.


నవ్విపోదురుగాక..


తన అధికారానికి ప్రమాదం పొంచి ఉందని గుర్తించి భయపడుతున్న జగన్‌రెడ్డి, ప్రజలను మభ్య పెట్టడం కోసం సరికొత్త మాయోపాయాలను తెర మీదకు వదులుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెత్తందార్లకు, పేదలకు మధ్య పోరాటం జరుగుతున్నదని ఆయన సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే బాటలో నీలి మీడియా, కూలి మీడియా కూడా ఇదే పల్లవిని అందుకున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండకపోతే పేదలకు చదువు అందుబాటులోకి వచ్చి ఉండేది కాదన్న స్థాయి వరకు ఈ ప్రచారం జరుగుతోంది. ఎంతోమంది పేదవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగడాన్ని మనం చూశాం. అయినా జగన్‌ దయతోనే పేదలకు చదువు అందుబాటులోకి వచ్చిందని ప్రచారం చేయడం రాజశేఖర రెడ్డిని కూడా అవమానించడమే. ఇంతకూ పేదలు ఎవరో తెలుసు కానీ పెత్తందార్లు ఎవరో తేలాల్సి ఉంది. పేదల తరఫున తాను పోరాటం చేస్తున్నానని జగన్‌ కొత్తగా బిల్డప్‌ ఇస్తున్నారు. తనకు సొంత పత్రిక, చానల్‌ లేదని కూడా నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారి వారసులు ఎవరికీ తాడేపల్లి, హైదరాబాద్‌, బెంగళూరు, ఇడుపులపాయ తరహాలో ప్యాలెస్‌లు లేవే? జగన్‌రెడ్డికి ఉన్నన్ని వ్యాపారాలు కూడా లేవే? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ ముఖ్యమంత్రి కుమారుడు కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తలేదే? మాజీ ముఖ్యమంత్రులు అయిన నీలం సంజీవరెడ్డి, డాక్టర్‌ చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, ఎన్టీరామారావు వారసులు ఎవరూ ఆస్తులు, వ్యాపారాలలో జగన్మోహన్‌ రెడ్డితో పోటీ పడే పరిస్థితిలో లేరే! ఇద్దరు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పంచనే బతుకుతున్నారు కదా? ఏ మాజీ ముఖ్యమంత్రి కుమారుడి మీద కూడా లేనటువంటి సీబీఐ, ఈడీ కేసులు జగన్‌పైనే ఎందుకున్నాయి? ఊరికో ప్యాలెస్‌ నిర్మించుకున్న జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే అసలైన పెత్తందారు. ఆయన చెబుతున్న పెత్తందారులు ఎవరికీ జగన్‌కు ఉన్నన్ని ఆస్తులు, వ్యాపారాలు లేవే? అంతటి విలాస జీవితం కూడా లేదే? అయినా తనను తాను అభినవ చెగువేరా, పుచ్చలపల్లి సుందరయ్య, అల్లూరి సీతారామరాజు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లతో పోల్చుకుంటూ ప్రచారం చేయించుకుంటున్న జగన్‌రెడ్డి కపట విన్యాసాలు చూశాక ఎవరికైనా దిమ్మ తిరిగి బొమ్మ కనపడకుండా ఉంటుందా? చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ఆయన ఏమైనా తన తండ్రి ఖర్జూర నాయుడు ఆస్తులు అమ్మి ప్రజలకు ఇస్తున్నాడా? అని ఇదే జగన్‌ అండ్‌ కో ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు జగన్‌రెడ్డి ఏమైనా తాత రాజారెడ్డి పోగేసిన ఆస్తులు అమ్మి బటన్లు నొక్కుతున్నారా? లేదే! అప్పులు చేసి పంచిపెడుతూ అపర దానకర్ణుడిలా పోజు కొట్టడం ఏమిటి? తన ప్రత్యర్థులను గజదొంగలతో జగన్మోహన్‌ రెడ్డి పోల్చుతున్నారు. అసలైన గజదొంగ తానేనన్న విషయం ప్రజలు మరచిపోవడానికే ఇలా అంటూ ఉండవచ్చు. జగన్‌రెడ్డి అంతటి విలాసవంతమైన రాజప్రాసాదాలలో జీవితం గడుపుతున్న ముఖ్యమంత్రి మరొకరిని మనం చూడలేదు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. పేదల తరఫున పోరాడే వాడికి అనతికాలంలో అంత సంపద పోగెయ్యడం సాధ్యమా? అయినా ఇతరులను పెత్తందారులుగా పోల్చే తెంపరితనం వచ్చిందంటే ప్రజలు ఉట్టి అమాయకులు అన్న బలమైన అభిప్రాయం జగన్‌లో ఉండి ఉంటుంది. నిజానికి ఇంతటి అధికార దర్పాన్ని కూడా గత ముఖ్యమంత్రులు ఎవరూ ప్రదర్శించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మినహాయిస్తే దేశంలోనే సొంత పత్రిక, చానల్‌ పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్‌ రెడ్డే. అయినా తనకు సొంత మీడియా లేదని చెబుతున్నారంటే ఆయన కళ్లకు ప్రజలు ఎలా కనబడుతున్నారో? ప్రజలను మభ్యపెట్టే వ్యూహాలతో పాటు ప్రతిపక్షాలను అణచివేసే విధానాలతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చునని జగన్‌ కలలు కంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడినట్టుగా జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుణ్ని కూడా బతకనివ్వరు. తాడేపల్లి ప్యాలెస్‌ లేదా విశాఖలోని రుషికొండపై తలపెట్టిన ప్యాలెస్‌ అధికారానికి తలవంచే బానిసలు మాత్రమే కనిపిస్తారు. జగన్‌ వంటి విపరీత మనస్తత్వం ఉన్నవారిని దీర్ఘకాలం భరించడం కష్టం. అందుకు ప్రకృతి కూడా సహకరించదంటారు. అందుకే ప్రజలు కళ్లు తెరుస్తున్నారు. అది చూసి అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. దుర్మార్గులు చేసే విధ్వంసం వల్ల కలిగే నష్టం కంటే విజ్ఞుల మౌనం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని నెపోలియన్‌ బోనపార్టీ ఎప్పుడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విజ్ఞులు అంటూ ఎవరైనా ఉంటే జీవో నెం.1 వంటి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. భయంతో మేధావుల నోళ్లు పెగలకపోతే ప్రజలే ఆ విజ్ఞత ప్రదర్శిస్తారు. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలో వారే చూసుకుంటారు.


అక్కడా కులాల రొచ్చేనా?


ఈ విషయం అలా ఉంచితే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో తెలుగువారి మధ్య జరిగిన ఘర్షణలు, వాటికి కూలి మీడియా పూసిన రంగు రోత పుట్టిస్తోంది. తెలుగువాళ్లు ఎంతో మంది పొట్టచేతబట్టుకొని అమెరికా వెళ్లి ఉన్నతంగా బతుకుతున్నారు. అయితే అదే సమయంలో వారి బుద్ధులు కుంచించుకుపోతున్నాయి. కుల వైషమ్యాలతో కుళ్లిపోతున్నారు. ఈ మధ్యలో రాజకీయాల యావ. అమెరికాలోని తెలుగువాళ్లు ప్రాంతాలుగా, కులాలుగా విడిపోయి ప్రస్తుతం రాజకీయ పార్టీలవారీగానూ విడిపోయి కలహించుకోవడం విషాదం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి సంబంధం ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మాత్రం వారికి ఏం సంబంధం? అమెరికాలో వారి జీవితాలలో ఎలాంటి మార్పూ ఉండదు కదా? అయినా బతుకుదెరువు కోసం వెళ్లిన వారికి కులాలు, రాజకీయాలు ఎందుకు? విమానం ఎక్కే ముందే కులాన్ని వదిలిపెట్టి భారతీయులుగా మారిపోయేవారు మళ్లీ విదేశీ గడ్డపై కాలు మోపాక కులం తగిలించుకోవడం ఎందుకు? తమను తాము ఎన్‌ఆర్‌ఐలుగా చెప్పుకొనే ఈ ప్రబుద్ధులు కులాల రొచ్చులో కూరుకుపోతుండటం మహా విషాదం!


ఆర్కే


Sunday, December 4, 2022

Maharashtra and Karnataka : బెల్గావి మహా వివాదం

 Maharashtra and Karnataka : మహా వివాదం

ABN , First Publish Date - 2022-12-05T04:21:07+05:30 IST


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం..


Maharashtra and Karnataka : మహా వివాదం


బెళగావి సహా 4 జిల్లాల్లోని 865 గ్రామాలు/పట్టణాలపై


కర్ణాటక, మహారాష్ట్ర మధ్య రగులుతున్న సరిహద్దు గొడవ


చల్లారకుండా చేసి చలికాచుకుంటున్న రాజకీయ నేతలు


2004లో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర సర్కారు


18 ఏళ్ల తర్వాత.. దానిపై వచ్చేవారం జరగనున్న విచారణ


ఒకవైపు మరాఠా పౌరుషం.. మరోవైపు కన్నడ ఆత్మగౌరవం! రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బెళగావి సహా నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు/గ్రామాలు తమవంటే తమవని తగువు! కర్ణాటక, మహారాష్ట్ర నడుమ దశాబ్దాలుగా రగులుతున్న ఈ సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా చేసి చలికాచుకుంటున్నది మాత్రం రాజకీయ నేతలే!! కర్ణాటక రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి మొదలై సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది!


(బెంగళూరు-ఆంధ్రజ్యోతి)


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం.. ఒకరి జాతి ప్రతీకలను మరొకరు అవమానించడం.. ఇదిలాగ కొన్నిరోజులపాటు సాగి క్రమంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. మళ్లీ డిసెంబరులో మామూలే. ఈ సెగలో రాజకీయ పార్టీలు చలికాచుకుంటుంటాయి. ఇంతకీ ఏటా డిసెంబరు నెలలో సరిహద్దు వివాదం ఎందుకు రేగుతుందంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం తమ శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహించడమే అందుకు కారణం. బెల్గావితోపాటు ఒకప్పుడు బొంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపూర్‌, ధార్వాడ్‌, ఉత్తర కెనరా జిల్లాలను.. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూరులో కలపడమే ఈ వివాదానికి మూలం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికే బెళగావి జిల్లా నాటి బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక దాన్ని బొంబాయి రాష్ట్రంలో భాగంగా గుర్తించారు. 1948లో.. బెళగావి సిటీ కౌన్సిల్‌ ఆ జిల్లాను ప్రతిపాదిత ‘సంయుక్త మహారాష్ట్ర’లో విలీనం చేయాలని తీర్మానం చేసింది. ఇదే డిమాండ్‌తో 1948లోనే ‘మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఈఎస్‌)’ కూడా ఏర్పాటైంది. అయితే.. 1953లో ఏర్పాటు చేసిన ఫజల్‌ అలీ కమిషన్‌.. ఆ నాలుగు జిల్లాలపై మైసూరు రాష్ట్రానిదే పూర్తి అధికారం అని నివేదిక సమర్పించింది. ఈమేరకు 1956లో బొంబాయి రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలతోపాటు.. ఆంధ్ర రాష్ట్రంనుంచి బళ్లారి, మద్రాసు రాష్ట్రం నుంచి దక్షిణ కెనరా.. హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి కొప్పల్‌, రాయ్‌చూర్‌, కలబుర్గి, బీదర్‌ జిల్లాలను, కూర్గు స్టేట్‌ను ఒక జిల్లాగాను చేసి.. మైసూరు రాష్ట్రంలో కలిపారు. వీటిలో.. బొంబాయి రాష్ట్రం నుంచి కలిపిన నాలుగు జిల్లాలపైనే ప్రస్తుత వివాదం సా...గుతూ వస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లోని మొత్తం 865 పట్టణాలు/గ్రామాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. ఫజల్‌ అలీ కమిషన్‌ నివేదికను మహారాష్ట్ర అంగీకరించట్లేదు. గతంలో పలుమార్లు ఇదే అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1966లో సుప్రీం కోర్టు సూచన మేరకు జస్టిస్‌ మెహర్‌చంద్‌ మహాజన్‌ సారథ్యంలో కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ సమర్పించిన నివేదిక కూడా కర్ణాటకకు అనుకూలంగా వచ్చింది. అనంతరం 2004లో మహారాష్ట్ర దీన్ని సవాల్‌ చేస్తూ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 18 ఏళ్ల తర్వాత.. దానిపై తుది విచారణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి సరిహద్దులో మరింత తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొన్నాయి.


ఆరనివ్వని రాజకీయాలు..


కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ. మహారాష్ట్రలోనూ చీలిక శివసేనతో కలిసి అధికారంలో ఉన్నది బీజేపీనే. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సమస్య తీవ్రం కాకుండా సంయమనం పాటించడం కద్దు. ఈ వివాదం మొదలైన తొలినాళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్‌ పార్టీ అదే రీతిలో వ్యవహరించేది. కానీ, మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి మాత్రం అప్పట్నుంచీ ఈ వివాదం చల్లారకుండా చూస్తూ వస్తోంది. 1957లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి.. 2018 దాకా ఆ జిల్లాలో ఒకటి, అంతకు మించి సీట్లను సాధిస్తూ వస్తూనే ఉంది. డిసెంబరులో శీతాకాల సమావేశాలను బెళగావిలో నిర్వహిస్తున్నప్పుడు.. దానికి పోటీగా ‘మరాఠీ మహావేలవ’ను నిర్వహిస్తోంది. అలాగే.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే కన్నడ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి చేస్తూ 1986లో నాటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే తీసుకున్న నిర్ణయం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. కాలక్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలూ తమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోసినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవలికాలంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ కోవలోనివే. కర్ణాటకలోని సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇద్దరు మంత్రులను పంపాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించడం.. వారు వస్తే అడ్డుకుంటామని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ సంఘాల సమాఖ్య తదితర సంఘాలు ప్రకటించడం.. కర్ణాటకకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చేసిన హెచ్చరికలతో రెండు రాష్ట్రాల సరిహద్దులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. బెళగావిలో కేఎస్‌ ఆర్టీసీ బస్సులకు మసిపూయడం, కన్నడ పతాకాన్ని ప్రదర్శించిన యవకుడిపై దాడి చేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. కాగా.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఈ కేసుపై బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేకంగా దృష్టిసారించారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఈ కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రొహతగి బృందంతో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. గతంలో రెండు కమిషన్ల నివేదికల సిఫారసులను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని కోరారు. సుప్రీం కోర్టు నిర్ణయం రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Thursday, November 24, 2022

ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

 ఇళ్లు కూల్చివేతపై ముందస్తు నోటీసు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇప్పటం గ్రామ రైతులకు లక్ష రూపాయల  ఒప్పున హైకోర్టు జరిమానా .


AP Highcourt: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

ABN , First Publish Date - 2022-11-24T12:55:59+05:30 IST


గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు జరిమానా విధించింది.


AP Highcourt: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు (AP Highcourt) జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో విచారణ సందర్భంగా తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను ఈ రోజు హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటం గ్రామస్తులు ఈరోజుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే తమకు అవగాహన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి వాదనను తిరస్కరించిన హైకోర్ట్... ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది.

Friday, November 11, 2022

అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

 CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

ABN , First Publish Date - 2022-11-11T02:54:51+05:30 IST


బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు.


CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఫొటోల పిచ్చి


‘జగనన్నే’ భూ యజమాని అన్నట్లు కలరింగ్‌


అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?


పుస్తకం కవర్‌ పేజీ, చివరా జగన్‌ ఫొటోలు


లోపల ప్రతి పేజీలో ఆయన ఫొటో


పట్టాదారు రూపురేఖలు మార్చేసిన సర్కారు


తమ భూమిపై ఆయన


‘హక్కు’ ఏమిటని రైతుల ధ్వజం


‘భూమి మనది... హక్కు మనది... కష్టం మనది... పత్రం మనది! నడుమ జగనేందిరో... ఆయన ఫొటో ఏందిరో’... అని రైతన్నలు పాడుకునే రోజు త్వరలోనే రానుంది. భూమి ఎవరిది, దాని యజమాని ఎవరు, ఫొటో ఎవరిది... అనే సందేహం వచ్చేలా.. ప్రతి పేజీలో జగన్‌ కనిపించేలా ‘జగనన్న భూరక్ష పథకం’ పుస్తకాన్ని సిద్ధం చేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు. చివరికి... ఎవరికో చెందిన భూములపై తన ఫొటో వేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఇది ముఖ్యమంత్రి జగన్‌ సొంత భూమికి సంబంధించిన పాసు పుస్తకమా? లేక... ‘జగనన్న భూ రక్ష పథకం’ ప్రచారం కోసం అధికార వైసీపీ రూపొందించిన కరపత్రమా? అని సందేహం కలిగేలా పాస్‌ పుస్తకాలు సిద్ధం చేశారు. సమగ్ర సర్వే అనంతరం భూ యజమానులైన రైతులకు ఈ పుస్తకాలను అందిస్తారు. 12 పేజీలున్న ఈ పాస్‌పుస్తకంలో... మొదటి పేజీలోనే పెద్దగా జగన్‌ ఫొటో, చివరి పేజీలో మళ్లీ జగన్‌ ఫొటో, దాని చుట్టూ ‘నవరత్నాల’ పేర్లు ముద్రించారు! పోనీ... లోపాలి పేజీలనైనా వదిలేశారంటే అదీ లేదు. 2, 11 పేజీ మినహా మిగిలిన అన్ని పేజీల్లో ‘జగన్‌’ కనిపిస్తారు. ప్రతిపేజీపైనా జగన్‌ ఫొటో ఉన్న నవరత్నాల లోగో ముద్రించారు. భూమి శాశ్వతం! ప్రభుత్వం శాశ్వతం! కానీ సీఎంగా జగన్‌ శాశ్వతం కాదుకదా? మరి ఎవరికో చెందిన భూమి హక్కు పత్రాల మీద ఆయన ఫొటో ముద్రించడమేమిటన్నదే రైతు సంఘాల ప్రశ్న. ఏపీ భూ హక్కుల చట్టం, దాని అమలు నిబంధనలు, సంప్రదాయాలు, పద్ధతులన్నీ తుంగలో తొక్కి ఈ పాసుపుస్తకాన్ని డిజైన్‌ చేశారు. ఈనెల 4నే పట్టాదారు పుస్తకాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేద్దామని భావించారు. కానీ అనుకోని ఆటంకాలేవో ఎదురైనట్లు ఉంది! అందుకే... ప్రస్తుతానికి ఆపేశారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రకటనలు, పథకాలు, కార్యక్రమాలను జగన్‌ ఫొటోలతో నింపేస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ ఫొటోల పిచ్చిని రైతులకు ఇచ్చే సొంత ఆస్తిపత్రాలకూ పట్టించారు. గత 49ఏళ్లలో ఏ సీఎం ఈ పుస్తకాలపై తమ ఫొటోలు వేసుకోలేదు.


రైతుల ఆగ్రహం... అభ్యంతరం


‘‘మా కష్టార్జితం, సొంత ఆస్తి అయిన భూమి రికార్డుల్లో సీఎం ఫొటోలు ఎందుకు? ఆ భూములు ఏమైనా జగన్‌ దానం చేస్తే వచ్చాయా?’’ అంటూ రైతులు మండిపడుతున్నారు. ‘‘హక్కుదారుడిని కాబట్టి భూమి హక్కుపత్రంపై నా ఫొటో ఉండాలి. సీఎం ఫొటోలు ఎందుకు? జగన్‌ పుట్టకముందు నుంచే నాకు భూమిఉంది. ఇప్పుడు కొత్తగా జగనన్న భూమి హక్కుపత్రం అని ఎందుకు పేరుపెట్టారు?’’ అని కృష్ణాజిల్లా రైతు ధ్వజమెత్తారు.


ఇదేమి వేలం వెర్రి?


‘‘జగనన్న భూ యాజమాన్యపు హక్కుపత్రం అని రాయడం ఏమిటి? అధికారులకు సీఎంపై అభిమానం ఉండొచ్చు. కానీ, మరీ ఇంత వేలంవెర్రి ప్రదర్శించడం సరికాదు. పాసుపుస్తకాల డిజైన్‌ మార్చాలి. రైతు భూ యజమాన్యపు హక్కుపత్రంగా దాన్ని మార్చాలి!’’


- దివాకర్‌, ఏపీ రైతు కూలీ సంఘం నేత


అది... ‘వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’! సమగ్ర సర్వే అనంతరం పంపిణీ చేసే ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ రికార్డు పుస్తకాలకు ‘జగనన్న భూ హక్కుపత్రం’ అని నామకరణం చేశారు. లోపలి పేజీల్లో ‘జగనన్న భూ యాజమాన్య హక్కుపత్రం’ అని ముద్రించారు. ఆ భూమి యజమాని జగనన్నా? లేక... రైతా? జగన్‌ తన సొంత భూమిపై హక్కులను మరొకరికి కల్పిస్తున్నారా?


Sunday, August 7, 2022

కార్యశూరుడూ – కామమ్మ మొగుడు

 కార్యశూరుడూ – కామమ్మ మొగుడు

Aug 07, 2022, 00:31 IST

Vardhelli Murali Article On AP Politics TDP Chandrababu Naidu - Sakshi

జనతంత్రం


ఎదిగే పిల్లల మధ్య పోలికలు తేవద్దంటారు మానసిక నిపుణులు. ఇది పెంపకానికి సంబంధించిన సూత్రం. ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన సూత్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అది కూరగాయల ఎంపికైనా సరే... ఇంకే కొనుగోలు వ్యవహారమైనా సరే! ఎందుకంటే ‘డబ్బులు ఊరికే రావు కదా’! నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన ప్రతిరోజూ టీవీల్లో కనపడి ఈ విషయంపై హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క క్యాంపెయిన్‌తో ఆయన యాంకర్‌ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు. అట్లుంటది మరి పబ్లిసిటీతోటి!


బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్‌ల సహకారంతో పుచ్చు కూరలూ, పచ్చళ్లు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సొంత మీడియా చేతిలో ఉంటే నాయకుల్ని తయారుచేయవచ్చు, వీలైతే గద్దెపై కూడా కూర్చోబెట్టొచ్చునన్న ఆలోచన నేటి యెల్లో మీడియా ఆద్యులకు ఆనాడే వచ్చింది. ‘ఓన్లీ విమల్‌’ అనే ఒకే ఒక్క యాడ్‌ క్యాంపెయిన్‌ టెక్స్‌టయిల్‌ సింహాసనంపై నుంచి ‘రేమండ్స్‌’ను దించేసి, ‘రిలయన్స్‌’ను కూర్చోబెట్టింది. ఈ దృష్టాంతం వారికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ‘ఓన్లీ ఎన్టీఆర్‌’ తరహా ప్రచారంతో కాంగ్రెస్‌ కోటను కూల్చగలిగారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన నిజంగానే ‘ఓన్లీ ఎన్టీఆర్‌’. ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌! పబ్లిసిటీ తోడవగానే కార్యసాధకుడు కాగలిగాడు.


ఎన్టీఆర్‌తో తమ సొంత ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం లేదనుకున్న యెల్లో ముఠా ఆయన్ను వదిలించుకొని బాబును గద్దెపై కూర్చోబెట్టడం మనకు తెలిసిన గతం. ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడం వల్ల ఏకపక్ష రాతలతో ఈ పరిణామం సాధ్యమైంది. ఈ బాబు స్వతహాగా ఓన్లీ బాబు కాదు, శతకోటి బాబుల్లో చంద్రబాబొకరు! జస్ట్‌ యావరేజ్‌. కాకపోతే పాలిటిక్స్‌లో ఇతనిది మాకివెలియన్‌ స్కూల్‌. అడ్డదారిలోనైనా లక్ష్యాన్ని చేరాలనే తత్వం. చేతికందిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, ముఠా ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడుకోగల దూకుడు స్వభావం. ఈ స్వభావం ఫలితంగా బాబుకూ, యెల్లో మీడియా పెద్దలకూ మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడింది. యెల్లో ముఠా పోస్టర్‌ బాయ్‌గా బాబు అవతరించాడు.


చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి యెల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్‌ చేసి మీడియా మేనేజ్‌మెంట్‌కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విజనరీ హయాంలో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పంట పొలాల్లో రైతుల చితిమంటలు వెలిగాయి. లక్షలాదిమంది పేదబిడ్డలు చదువుకొనలేక డ్రాపవుట్లుగా మిగిలిపోయారు. పంతుళ్లకూ, పాఠాలకూ దూరమైన ప్రభుత్వ స్కూళ్లు పాడుబడి పోయాయి. ఆరోగ్యం అంగడి సరుకైంది. రోగం రాకడ... ప్రాణం పోకడగా పేదల పరిస్థితి దిగజారింది. ఇటువంటి వల్లకాటి అధ్వాన్న శకాన్ని బాబు బ్రాండ్‌ వైభవోజ్జ్వల మహా యుగంగా యెల్లో మీడియా చిత్రించింది.


ఈ తరహా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే ఆయనొక విఫల ప్రయోగం. ఆ విఫల ప్రయోగాన్ని విజయగాథగా చరిత్రలోకి జొప్పించే కుట్రలు జరుగుతున్నాయి. విధ్వంసకర విధానాల కృతికర్తకు అభివృద్ధి భుజకీర్తులు తగి లించి, ఇంకా స్తోత్రాలు పఠిస్తూనే ఉన్నారు. పళ్లూడి దవడలు జారిన వృద్ధ రంగస్థల నటికి ఊర్వశి వేషం కట్టి లొట్టలేసుకుంటూ చూడాలని ఇంకా ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. నిలువెత్తు స్వార్థ ప్రతిమపై జలతారు మేలిముసుగులు కప్పుతున్నారు. వికృత అవినీతి రూపానికి కాస్మెటిక్‌ సర్జరీ చేసి సింబల్‌ ఆఫ్‌ ఇంటిగ్రిటీగా నమ్మాలని ఆదేశిస్తున్నారు.


‘కామమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’డనే సామెతొ కటి ఉన్నది. పూర్వం ఒక దొంగసాధువు ఒక ఊరి కొచ్చాడట. ఓ గ్రామస్థుడతనికి ఎదురయ్యాడు. చాలాకాలం క్రితం పారి పోయిన కామమ్మ మొగుడి పోలికలు ఆ సాధువులో గ్రామ స్థుడికి కనిపించాయి. ఇంకేముంది ఇదిగో పులి అదిగో తోక! ఆనోటా ఈనోటా అదే మాట. తాను నిజంగానే కామమ్మ మొగుడినని దొంగస్వామి డిసైడై కాపురం చేద్దామని బయల్దే రాడట. సదరు కామమ్మ గట్టిగా నిలదీసేసరికి ‘నాకేం తెలుసు, అందరూ కామమ్మ మొగుడంటుంటే కామోసు అనుకున్నాన’ని వాపోయాడట!


చంద్రబాబును ఒక సూపర్‌ బ్రాండ్‌గా నిలబెట్టడం కోసం గత పాతికేళ్లుగా యెల్లో మీడియా రాసిన కవిత్వమంతా ఆయన మెదళ్లోకి బాగా ఎక్కిపోయింది. అదంతా నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమలోంచే ఆయన అనేక ఆణిముత్యా లను నోటి వెంట తుపుక్కు తుపుక్కుమని పలుమార్లు వెదజల్లారు. ఈ దేశానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది తానేనని చెప్పారు. సత్యా నాదెళ్లను ఐటీలో ప్రోత్సహించింది తానేనని చెప్పారు. పీవీ సింధుకు మోటివేషన్‌ గురువు తానేనని చెప్పారు. అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతిని చేసింది తానేనని అనేకసార్లు అన్నారు. బస్సులో కూర్చొని తాను తుపాన్లను కంట్రోల్‌ చేశానన్నారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’ అని ప్రశ్నించి కరోనా కూడా తనను చూసి పారిపోతుందని పరోక్షంగా చెప్పారు. గతంలో తాను రెయిన్‌గన్‌ చేతబూని, కరువు రక్కసిని తరిమి తరిమి కొట్టానని ప్రకటించుకున్నారు.


వేరేవాళ్లెవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వినేవాళ్లు ఏమనుకుంటారు? పూర్వకాలంలో పండుగలకూ పబ్బాలకూ గ్రామాల్లో అడుక్కోవడానికి పలురకాల వేషాలతో పలువురు యాచకులు వచ్చేవారు. వారిలో పిట్టల దొర పాత్ర ఒకటి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాత్రను ‘లత్కోర్‌ సాబ్‌’ అని కూడా పిలుస్తారు. ‘మన్నించండి మారాజా ఆలస్యమైంది. ఏం జేస్తాం మారాజా... పొద్దున లేవంగనే పీఎమ్‌ ఫోన్, సీఎం ఫోన్, ప్రెసిడెంట్‌ ఫోన్, గవర్నర్‌ ఫోన్‌... వాళ్లందరికీ సర్దిచెప్పి, సలహా చెప్పి, ధైర్యం చెప్పేసరికి పొద్దుపోయింది. బయటకొచ్చి చూస్తే విమానం తోలే డ్రైవర్‌ రాలే, హెలికాప్టర్‌ టైర్ల గాలి లేదు. అందుకని నడుచుకుంట వచ్చేసరికి లేటైంది మారాజా...’ ఇట్లా ప్రారంభమౌతాయి పిట్టల దొర డైలాగులు. విదూషకుని మాటలు కనుక జనం కూడా నవ్వుకునేవారు. విదూషకుని మాటల్లానే విజనరీ నేతల మాటలు కూడా ఉంటే ఏం చేయాలి? నవ్వాలా... ఏడవాలా? జనానికి ఇదో సందిగ్ధావస్థ.


యెల్లో మీడియాకు, దాని అనుంగు కూటమికి ఇప్పుడు చాలా పెద్ద కష్టమొచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించాలి. గెలిపిం చకపోతే దెబ్బకు ఠా దొంగల ముఠా! ఇక యెల్లో ముఠా ఆగడాలకు ముకుతాడు పడినట్లే! అందు కని చావోరేవో తేల్చుకునే పోరుకు తెగించారు. గెలవాలంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. జావగారిపోతున్న చంద్రబాబు పర్సనాలిటీకి బిగదీసి ప్యాడింగ్‌ చేయాలి. సకలజన సాధికారత పథకాలతో పెరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇమేజిని డ్యామేజీ చేయాలి. యెల్లోమీడియా, దాని మిత్ర బృందాలు ఈ కర్తవ్య సాధన కోసం కంకణాలు కట్టుకున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసత్యాలను పోగేసి కాకమ్మ కథలను అచ్చేస్తున్నాయి.


యెల్లో మీడియా గ్రూప్‌ లీడరైన ‘ఈనాడు’ రాస్తున్న బేతాళ కథనాలను సాక్ష్యాధారాలతో చీల్చిచెండాడుతూ ‘సాక్షి’ పత్రిక నిజానిజాలను నిగ్గుతేల్చుతున్నది. అయినా సరే, ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు’ అన్నట్లున్నది ‘ఈనాడు’ ధోరణి. సందర్భం ఏదైనా సరే, స్పందనలు ఎలా ఉన్నా సరే.. చంద్రబాబు రైట్‌. ముఖ్యమంత్రి రాంగ్‌. ఇదీ యెల్లో మీడియా రూల్‌ బుక్‌లో మొదటి పాఠం. మొన్నటి గోదావరి వరదల సందర్భాన్నే తీసుకుందాము. ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవడం, సహాయ – పునరావాస చర్యల కోసం ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (డీఆర్‌ఆర్‌) పేరుతో ఐక్యరాజ్య సమితి నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించింది.


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ విధానాలను పాటిస్తాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు రూపొందించిన విధానాలు ఇవి. వరదలు రాగానే ముఖ్యమంత్రి కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సహాయ – పునరావాసాలకు అవసరమైన అన్ని వనరులనూ వారికి అందుబాటులో ఉంచారు. ఇతర జిల్లాల నుంచి కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని తరలించారు. ముఖ్యమంత్రి రాజధాని కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు.


మొదటిరోజో, రెండోరోజో ముఖ్యనేత ఆ ప్రాంతాలను సందర్శిస్తే ముఖ్యనేత పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం మునిగిపోతుందని, ఇది వాంఛనీయం కాదని నిపుణులు చెబుతారు. పలు దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. వైఎస్‌ జగన్‌ ఈ పద్ధతిని అనుసరిస్తూనే దీన్ని మరింత సృజనాత్మకం చేశారు. వారం రోజుల తర్వాత తాను వరద ప్రాంతాలను సందర్శి స్తానని, తమకు ప్రభుత్వ సాయం అందలేదనే గొంతు అప్పుడు వినపడకూడదనే షరతును ముఖ్యమంత్రి అధికారులకు విధించారు. దీంతో అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమించి చరిత్రలో ఎన్నడూ లేనంత సమర్థంగా సహాయ చర్యల్ని చేపట్టింది.


వైపరీత్యాల తర్వాత వారం రోజులకు ప్రభుత్వాధినేతలు పర్యటనకు వెళ్లడం మన దేశంలో ఒక సాహసం. సహాయక చర్యలు అందని ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలతో ఉంటారు. వారిని సముదాయించడం శక్తికి మించిన పనవుతుంది. మొదటి రెండు మూడు రోజుల్లో వెళ్లొస్తే ఈ పరిస్థితులు ఎదురుకావు. కానీ విచిత్రంగా వారం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లినా జగన్‌ను బాధితులు ఆత్మబంధువు లాగానే స్వాగతించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు సాయం అందలేదని చెప్పలేదు. ఇందుకు కారణం ముఖ్య మంత్రి అనుసరించిన శాస్త్రీయ కార్యాచరణ.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే రాతలు రాయడం, చంద్రబాబు ఇమేజిని పెంచే ప్రచారం చేయడం అనే యెల్లోమీడియా ఎత్తుగడ ఆత్మహత్యాసదృశం కాబోతున్నది. గతించిన కాలం మాదిరిగా యెల్లో మీడియా ఆడింది ఆట పాడింది పాట అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రత్యామ్నాయ మీడియా ఉన్నది. సోషల్‌ మీడియా ఉన్నది. రకరకాల మార్గాల్లో ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నవి. వైఎస్‌ జగన్, చంద్ర బాబుల వ్యక్తిత్వాల పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యక్తిత్వంలోగానీ, విజన్‌లో గానీ, పాలనా సామ ర్థ్యంలోగానీ, పారదర్శకతలో గానీ, సామాజిక దృక్పథంలోగానీ జగన్‌ ముందు చంద్రబాబు సరితూగలేడు.

ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఆనాడు సర్వ శక్తిమంతురాలైన భారత సామ్రాజ్ఞి హుకుంనామాను ధిక్క రించిన ధీశాలి జగన్‌. ఆ మార్గంలో వెళితే కష్టాల పాలవుతాననీ, కడగండ్లెదురవుతాయనీ తెలిసినా వెనుకడుగేయని మనో నిబ్బరం జగన్‌ సొంతం.


నమ్మి చేరదీసిన మామను గొంతుకోసి గద్దెనెక్కిన కుటిల స్వభావం చంద్రబాబుది. నిరంతరం కుట్రలూ, కూహకాలలో మునిగితేలుతూ అధికారాన్ని కాపాడుకునే దుర్నీతి బాబుది. అధికారం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసి హామీలను అటకెక్కించే మోసపూరిత నడవడి చంద్రబాబుది. ఆనాడు ‘రైతు రుణమాఫీ హామీ’ ఇవ్వకపోతే ఓడిపోతావని పలువురు హెచ్చరించినా ఓటమికైనా సిద్ధపడ తాను కానీ, నిలబెట్టుకోలేని మాటను ఇవ్వలేనని కుండబద్దలు కొట్టిన స్థిరచిత్తం జగన్‌ది.


అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చేపట్టిన పరిపాలనా సంస్కరణలకు ఈరోజున దేశమంతా జైకొడు తున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు జగన్‌ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపం చంలో ఎన్నిచోట్ల నుండి ఎన్ని ప్రశంసలు వచ్చినా వాటిని ప్రచారంలో పెట్టుకోకపోవడం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వపు మరో ప్రత్యేకత. మూడేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపా యలను ప్రజలకు డీబీటీ పద్ధతిలో బదిలీ చేయడం, పైసా దుర్వినియోగం కాకపోవడం దేశంలో ఒక రికార్డు.


దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళల సాధికారత కోసం అమలుచేస్తున్న ఆర్థిక, రాజకీయ ఉద్దీపన కార్యక్రమాలు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కనీవినీ ఉండలేదు. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లుండాలని పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన రాజకీయ పార్టీ ఈ దేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే. కాగా, బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఈసడించుకునే దురహంకారం చంద్రబాబు సొంతం.


దళితుల్ని ఉపముఖ్యమంత్రులు, కీలక శాఖల సారథులుగా ఎంపిక చేసుకున్న సౌభ్రాతృత్వం జగన్‌ నైజం. స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ, పదవుల్లోనూ సగభాగం మహిళలకు కేటాయించి మంత్రివర్గంలో హోమ్‌ శాఖతో సహా కీలక శాఖలను కట్టబెట్టిన ఘనత జగన్‌ ప్రభు త్వానిది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని మాట్లాడే పురుషాహంభావం చంద్రబాబుది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి మాట మాత్రపు ప్రస్తావనైనా లేకుండా అక్కడక్కడ దొర్లే చిన్నచిన్న పొరపాట్లపై భూతద్దాలు వేసే వికృత పాత్రికేయానికి యెల్లో మీడియా పాల్పడుతున్నది. ఎగసిపడుతున్న విప్లవ కెరటాలు దాచేస్తే దాగేవి కావు. ఎల్లో మీడియా కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాబోదు!


వర్ధెల్లి మురళి 

vardhelli1959@gmail.com

Wednesday, July 20, 2022

పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు

 పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు

Jul 20, 2022, 05:11 IST

Ambati Rambabu On Polavaram Project Hight Badrachalam Flood - Sakshi

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ


గోదావరి ఉధృతితోనే నదీ పరీవాహక ప్రాంతాల ముంపు


1986 వరదల సమయంలో కూడా భద్రాచలం మునిగింది


తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు సరికాదు


పోలవరం 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్రం క్లియరెన్స్‌


సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.  



పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్‌ఆర్‌ఎల్‌) నష్టం ఉండదని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 



కొత్త వివాదాలు సృష్టించవద్దు

‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్‌ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్‌ వాటర్‌ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.  విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు.  


భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా?

భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు.  


వరదలపై ఈనాడు వక్రబుద్ధి

గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై  తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు.


అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్‌ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్‌ను అధికారులు కంట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు.










అనుమతుల ప్రకారమే పోలవరం 

Jul 20, 2022, 05:16 IST

Botsa Satyanarayana On Polavaram Project Puvvada Ajay - Sakshi

భద్రాచలానికి ముంపు కొత్త కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉంది


విలీన గ్రామాలను తెలంగాణలో కలిపేయమనడం సరికాదు


హైదరాబాద్‌ను ఏపీలో కలిపేస్తామంటే ఒప్పుకుంటారా?


తెలంగాణ మంత్రి పువ్వాడపై మంత్రి బొత్స ఆగ్రహం


విలీన మండలాల పూర్తి బాధ్యత ఏపీదేనని స్పష్టీకరణ  


సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం.



భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్‌కు హితవు పలికారు.


హైదరాబాద్‌ను కలిపేస్తారా?

విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్‌ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్‌ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు.


పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్‌లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్‌ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు.


అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం

విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్‌ హైస్కూల్‌లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 






Published: Wed, 20 Jul 2022 03:38:44 ISTహోంతెలంగాణపోలవరం గరంగరంtwitter-iconwatsapp-iconfb-iconపోలవరం గరంగరం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

ఆ ప్రాజెక్టుతోనే భద్రాచలం మునక

సమయానికి ఏపీ వరదను వదల్లేదు

ఐదు ఊళ్లు ఇస్తే కరకట్ట నిర్మించుకుంటాం

రాముడి కోసం పోలవరం ఎత్తు తగ్గించండి

విలేకరుల సమావేశంలో పువ్వాడ వ్యాఖ్యలు

భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు 

భద్రాచలానికి వరద ముంపు కొత్త కాదు

డిజైన్‌కు అనుగుణంగానే పోలవరం నిర్మాణం

విభజనతో మేమూ ఆర్థికంగా నష్టపోయాం

రాష్ట్రాలను కలిపేద్దామని బొత్స ప్రతిపాదన

భద్రాచలం ఇస్తారా? అని అడిగిన రాంబాబు



(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఒకపక్క గోదావరి వరద ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. పంటలు పోయాయి. తిండీ నీళ్లు లేవు. సహాయక చర్యల తీరు పట్ల బాధితుల్లో ఆక్రోశం... అసలు సమస్యను వదిలేసి రెండు తెలుగు రాష్ట్రాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు. బాధితులకు తక్షణ సాయం ఏం చేయాలి? ఇలాంటి వరదలు వస్తే ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఏం చేయాలి? లాంటి అంశాలను పక్కనబెట్టి పోలవరం ఎత్తు, ఏపీకి బదలాయించిన గ్రామాలను వెనక్కివ్వడం, ఉమ్మడి రాజధాని వంటి రాష్ట్ర విభజన సమస్యలను తెర మీదకు తెచ్చి సవాళ్లు  విసురుకుంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్‌ చేయడం ద్వారా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పిల్లి మెడలో గంట కట్టారు. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వెనుక బడతామేమోనన్న భయమో ఏమో మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యులంతా హైదరాబాద్‌కు తరలి వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. పోలవరం నుంచి నీళ్లు వదలడంలో ఏపీ నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం ప్రాంతం వరద నీటిలో మునిగిపోయిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవమైన భద్రాచలం రామచంద్రస్వామికి వరద ముప్పు లేకుండా చూడటానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని, గోదావరిపై కరకట్ట నిర్మాణానికి వీలుగా భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన చట్టం ఆధారంగా కడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు హైదరాబాద్‌ను ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయిందని, ఇప్పుడు హైదరాబాద్‌ను ఏపీకి ఇవ్వమని అడగగలమా? అని ప్రశ్నించారు. ఏపీ ముంపు గ్రామాల్లో సహాయక చర్యల గురించి బాధ్యత కలిగిన వ్యక్తిగా తెలంగాణ మంత్రి మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ముంపు సమస్యను తెలంగాణ లోక్‌సభలో లేవనెత్తితే తాము ఇరు రాష్ట్రాలను కలపాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెస్తామని అన్నారు. భద్రాచలం ప్రస్తుత వరదకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధమే లేదని, అది ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కూడా కాదని ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

చిచ్చుపెట్టేలా అజయ్‌ వ్యాఖ్యలు: బీజేపీవిపత్కర పరిస్థితిలో కూడా టీఆర్‌ఎస్‌ బురద రాజకీయాలు చేస్తోందని ఽబీజేపీ నేత సుభాష్‌ ధ్వజమెత్తారు. అజయ్‌ వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. వరదనష్టంపై బండి సంజయ్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంమంత్రి కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జాతీయ విపత్తుల నిధి కింద  సాయం అందుతుందని చెప్పారు.

తప్పుడు ప్రచారం వద్దుఢిల్లీలోనూ ఇరు రాష్ట్రాల అధికార పార్టీల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. గోదావరి వరదలకు చాలా అంశాలు కారణమని వైసీపీ ఎంపీలు వంగా గీత, అయోధ్య రామిరెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిండిపోయిందన్నారు. కేంద్రం నిధులతో నిర్మించే ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఎత్తు ఎంత పెంచారు, నీళ్ల సామర్థ్యం ఎంత, నీళ్ల వివాదం ఏంటి? అనేవి తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌ నేత అన్నారు. గోదావరి నీటిని తాత్కాలికంగానైనా చెరిసగం చొప్పున పంచాలని కోరారు.

నా మాటల్లో తప్పేంటి?ఏపీ నేతల స్పందన తర్వాత సాయంత్రం పువ్వాడ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి, విమర్శించడం సరికాదన్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఐదు విలీన గ్రామాలను కేటాయించాలని కోరితే.. హైదరాబాద్‌ ఇస్తారా అనటం.. అసందర్భం.. అర్థరహితమని అజయ్‌ పేర్కొన్నారు. జగన్‌తో చర్చించి భద్రాచలం రాముడి కోసం 5 గ్రామాలను ఇప్పించాలని కోరారు. వరద బాధితుల కోసం కేసీఆర్‌ వెయ్యి కోట్ల సాయం ప్రకటించడం పట్ల పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణకు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ కేంద్రం సాయం అందించేందుకు ప్రతిపాదనలను పంపాలని కోరారు.

పోలవరంపైనే అనుమానం?పోలవరం నిర్మాణం మొదలయ్యాక గోదావరి నడక మారిందని స్థానికులు, ఇంజనీర్లు అంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఒరవడి గతంకంటే కొంత నెమ్మదిగా ఉండడం, వరద తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో.... ఇదంతా పోలవరం ప్రభావమేనని స్థానికుల్లో అనుమానాలు పెరిగాయి. వారి గొంతునే అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌లో వినిపించారు. విలేకరుల సమావేశం అనంతరం నేతలు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. 

కేంద్రం చొరవ చూపాలి - పువ్వాడ అజయ్‌కుమార్‌రాష్ట్ర మంత్రి పువ్వాడ మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయం లో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతమధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఎం.నాగేశ్వర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రా జెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డి మాండ్‌ చేస్తున్నామని, ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని పువ్వాడ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గోదావరి కరకట్టల పటిష్టం పై ఏపీ సర్కారు దృష్టి సారించడం లేదని, దాంతో భ ద్రాచలం ఎగువన ఏపీ నిర్వహణలో ఉన్న ప్రాంతంలో కరకట్ట లీకేజీ ద్వారా పట్టణంలోకి వరద ప్రవేశించిందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఏపీకి చెందిన ఐదు గ్రామాలు ఉన్నాయని, వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరారు. దానికి కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.  ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఆదిలోనే నిరసన తెలిపామన్నారు. 

ముంపు కొత్త కాదు: బొత్సఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం మునిగిందంటే ఎలా అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఒరిజనల్‌ డిజైన్‌ప్రకారమే చేస్తున్నారని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేమని గుర్తు చేశారు. భద్రాచలానికి ముంపు కొత్త కాదని, వందేళ్ల తర్వాత మొదటిసారి గోదావరికి ఇంత వరద వచ్చిందని చెప్పారు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే అడగాలే తప్ప అవివేకపు మాటలు మాట్లాడొద్దని అన్నారు. సమస్య లేకుండా ఎలా అనేది చూసుకోవాలే తప్ప రెచ్చగొట్టే మాటలు సరి సరికాదన్నారు. పక్కనున్నది పాకిస్తాన్‌ ప్రభుత్వమేమీ కాదు కదా.. ఆంధ్రాతో సెటిల్‌ చేసుకుంటామని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. పూర్తిగా స్వాగతిస్తామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకో లేదని పువ్వాడ అన్నట్లుగా కొందరు విలేకరులు ప్రస్తావించగా, ‘‘రాష్ట్రంలో విలీనమైన మండలాల బాధ్యత మాది. ఖమ్మం జిల్లాలో ముంపు సంగతి అయన్ని చూసుకోమనండి. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం బాధ్యతగల వ్యక్తులకు తగదు’’ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విలీనానికి సంబంధించి డిమాండ్‌ తీసుకొస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘‘మంచిది. తీసుకురమ్మనండి. విభజిత రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలన్న డిమాండ్‌ను మేం కూడా తీసుకొస్తాం’’ అని బదులిచ్చారు.

ఎవరు చెప్పింది నమ్మాలి? రేవంత్‌పోలవరం విషయంలో కేసీఆర్‌ చెప్పింది నమ్మాలా? మంత్రి పువ్వాడ చెప్పింది నమ్మాలా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అసలు సమస్యను పక్కదోవ పట్టించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరదలకు రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంట నీటి పాలైతే మొదట విదేశీ కుట్ర అన్న కేసీఆర్‌ ఇప్పుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. వరద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నష్టంపై కేంద్రానికి సంపూర్ణ నివేదిక పంపాలని, ఢిల్లీకి వచ్చి ఒత్తిడి తెచ్చి రూ.2000 కోట్ల సాయం రాబట్టాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా కేసీఆర్‌ విదేశీ కుట్రను తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. వరద సాయం చేయని బీజేపీ 21 నుంచి ఊళ్లకు వస్తోందని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నిద్ర పోతోందా?: భట్టిపోలవరం ఎత్తు పెంచుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోందా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును మూడు మీటర్లు పెంచి కట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా ప్రభు త్వం ఎందుకు బాధ్యతా రహితంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచుతుంటే గూగుల్‌లో కేసీఆర్‌కు కనపడలేదా అన్నారు. పోలవరం ముంపులోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపారా? ఏం సమాధానం వచ్చింది? ఈ అంశంపైప్రధానిని ఎన్ని సార్లు కలిశారు? ఆర్డినెన్స్‌ రద్దు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు?’’ అంటూ ప్రశ్నించారు. ఏడు మండలాలు ఏపీలో కలపకుంటే ఇప్పుడు కరకట్ట సమస్య వచ్చేదే కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై సాంకేతిక కమిటీ వేసి.. సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు.

భద్రాచలం ఇచ్చేస్తారా?- అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏపీ జల వనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  దశలవారీగా పూర్తి చేస్తామని మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. పోలవరం ఎత్తు మరో మూడు మీటర్లు పెంచుతున్నామన్నది వాస్తవం కాదన్నారు. భద్రాచలం మునకకు పోలవరం కారణం కాదని చెప్పారు. పోలవరం ఎగువన 45.72 మీటర్ల కాంటూరులో నీళ్లు నిలిపేందుకు కేంద్రం నుంచి అనుమతి ఉందని, తెలంగాణలోని ఏడు మండలాలు అందులో ఉండటంతో ఏపీకి కలిపారని తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు కావాలంటే కేంద్రాన్ని అడగాలని, భద్రాచలాన్ని తమకు ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు.