Sunday, September 7, 2025

constitutional positions

 In India, constitutional positions are key offices established by the Constitution of India, responsible for the governance and functioning of the state. Below is a list of the primary constitutional positions:

  1. President of India
    • The ceremonial head of state and the first citizen of India, vested with executive powers, and serves as the commander-in-chief of the Indian Armed Forces.
  2. Vice-President of India
    • The second-highest constitutional office, who also serves as the ex-officio Chairperson of the Rajya Sabha (Council of States).
  3. Prime Minister of India
    • The head of government, leading the executive branch and chairing the Council of Ministers.
  4. Chief Justice of India
    • The head of the judiciary, presiding over the Supreme Court of India.
  5. Judges of the Supreme Court
    • Justices who serve on the Supreme Court, adjudicating matters of national importance and constitutional issues.
  6. Governors of States
    • The constitutional heads of states, appointed by the President, representing the Union in the states.
  7. Chief Ministers of States
    • The heads of government in each state, responsible for state administration.
  8. Attorney General of India
    • The chief legal advisor to the Government of India, representing the Union in legal matters.
  9. Comptroller and Auditor General of India (CAG)
    • An independent authority responsible for auditing government accounts and ensuring financial transparency.
  10. Election Commissioners (Chief Election Commissioner and Other Election Commissioners)
    • Responsible for overseeing the conduct of free and fair elections in India, heading the Election Commission.
  11. Speaker of the Lok Sabha
    • The presiding officer of the Lok Sabha (House of the People), responsible for maintaining order and conducting proceedings.
  12. Deputy Speaker of the Lok Sabha
    • Assists the Speaker and presides over the Lok Sabha in the Speaker’s absence.
  13. Chairman of the Rajya Sabha
    • The Vice-President of India serves as the ex-officio Chairman, presiding over the Rajya Sabha.
  14. Deputy Chairman of the Rajya Sabha
    • Assists the Chairman and presides over the Rajya Sabha in the Chairman’s absence.
  15. Advocate General of States
    • The chief legal advisor to state governments, representing states in legal proceedings.
  16. Chief Justices of High Courts
    • The heads of the judiciary in each state, presiding over the respective High Courts.
  17. Judges of High Courts
    • Justices serving in the High Courts, handling state-level judicial matters.
  18. Finance Commission Chairman and Members
    • Appointed every five years to recommend the distribution of financial resources between the Union and the states.
  19. National Human Rights Commission (NHRC) Chairperson and Members
    • Responsible for protecting and promoting human rights in India.
  20. Union Public Service Commission (UPSC) Chairman and Members
    • Oversee the recruitment and examination for civil services and other central government posts.
  21. State Public Service Commission (SPSC) Chairman and Members
    • Handle recruitment for state government services.
  22. Chief Information Commissioner and Information Commissioners (Central Information Commission)
    • Oversee the implementation of the Right to Information Act at the central level.
  23. State Chief Information Commissioners and Information Commissioners
    • Oversee the Right to Information Act at the state level.

These positions are critical to the functioning of India’s democratic framework, ensuring the separation of powers and the rule of law. If you need detailed roles or eligibility criteria for any specific position, let me know!

Saturday, February 22, 2025

ORR - 190 KM Road - Line Clear

Vijayawada: ఓఆర్‌ఆర్‌కు రాజముద్ర

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:44 AM

రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే 

 ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 



  • 189.9 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు ఓకే

  • ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాలు.. 121 గ్రామాల మీదుగా సాగనున్న నిర్మాణం

  • త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్‌ విడుదల

  • విజయవాడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంత పరిధితోపాటు, బయట కూడా కలిపి మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 189.9 కిలోమీటర్ల నిడివిలో భూసేకరణకు గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. అవి ఎన్టీఆర్‌, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) అప్రూవల్‌ కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భూ సేకరణకు వీలుగా రాజపత్రాన్ని వెలువరించింది. దాని ప్రకారం త్వరలోనే జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులు తమ డివిజన్ల ప్రాతిపదికన భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించటానికి ఐదు జిల్లాల యంత్రాంగాలను నిర్దేశించనుంది. కొద్ది రోజుల వ్యవ ధిలోనే జిల్లాల వారీగా భూముల సేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లు భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించనున్నారు. కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో 24 గ్రామా లు, ఏలూరు జిల్లాలో ఒక మండలం పరిధిలో 11 గ్రామాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 5 మండలాల పరిధిలో 28 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల పరిధిలో 46 గ్రామాలు, పల్నాడు జిల్లాలో రెండు మండలాల పరిధిలో 12 గ్రామాల మీదుగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ వెళుతుంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టనుంది.

అమరావతికి దేశంలోని అనేక జాతీయ రహదారులు అనుసంధానం అవుతాయి. అనేక ఆర్థిక కారిడార్ల రహదారులు అనుసంధానం కావటంతో భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి దోహదపడనుంది. ఓఆర్‌ఆర్‌లో కృష్ణానదిపై 2 బ్రిడ్జిలు, 34 చోట్ల హై ఓల్టేజీ క్రాసింగ్‌, టన్నెల్స్‌ 3, ఆర్‌ఓబీలు 7, అండర్‌పా్‌సలు 78, చిన్న వంతెనలు 51, పెద్ద వంతెనలు 14, ఇంటర్‌ చేంజ్‌లు 9 వస్తాయి. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆరువరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేను నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 వరుసలుగా దీనిని నిర్మిస్తారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు 70 మీటర్లుగా ఉంటుంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో

కంచికచర్ల మండలం పరిధిలో కంచికచర్ల, పెరకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మోగులూరు, కునికినపాడు గ్రామాలు, వీరులపాడు మండలం పరిధిలో పొన్నవరం, జగన్నాఽథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావు పాలెం, జీ కొండూరు మండలం పరిధిలో జీ కొండూరు, కుంటుముక్కల, దుగ్గిరాలపాడు, పేత్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు, మైలవరం మండలంలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాల్లో భూ సేకరణకు గజిట్‌ వెలువడింది.

  • ఏలూరు జిల్లాలో

ఆగిరిపల్లి మండలంలో బొద్దనపల్లి, గరికపాటివారి కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లె, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, క్రిష్ణవరం, సూరవరం, కలటూరు గ్రామాలు.

  • కృష్ణా జిల్లాలో

బాపులపాడు మండలంలో బండారుగూడెం, అంపాపురం, ఉంగుటూరు మండలంలో సగ్గూరు ఆమని, బల్లిపర్రు, బూతుమిల్లిపాడు, ఉంగుటూరు మండలంలో పెద అవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వేలినూతల, తరిగొప్పల, వేంపాడు, బొకినాల, మానికొండ, కంకిపాడు మండలంలో మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లి, కుందేరు, తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, చిన్నపులిపాక, బొడ్డపాడు, నార్త్‌ వల్లూరు, సౌత్‌ వల్లూరు.


  • గుంటూరు జిల్లాలో

మంగళగిరి మండలంలో కాజ, చినకాకాని, తాడికొండ మండలంలో పాములపాడు, వరగని, మందపాడు, మంగ ళగిరిపాడు, డోకిపర్రు, విసదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు, పెదకాకాని మండలంలో నంబూరు, దేవరాయభోత్లపాలెం, అనుమర్లపూడి, దుగ్గిరాల మండలంలో చిలువూరు, కంటమరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కొల్లిపర్ర మండలంలో వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అథోట, తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు,కతేవరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, వట్టిచెరుకూరు మండలంలో కొర్నెపాడు, అనంతవరప్పాడు, చామళ్లమూడి, కుర్నూతల, గుంటూరు తూర్పు మండలంలో ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు, గుంటూరు వెస్ట్‌ మండలంలో పోతూరు, అంకిరెడ్డిపాలెం.

  • పల్నాడు జిల్లాలో

అమరావతి మండలంలో లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు మండలంలో ముస్సాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాసిపాడు, బలుసుపాడు .

Updated Date - Feb 23 , 2025 | 07:45 AM

Saturday, July 6, 2024

Telangana and Andhra Controversy

 Telangana and Andhra Controversy 

పదేళ్ల పంచాయితీకి పరిష్కారం!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:20 AM 

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! పెండింగ్అంశాల పరిష్కారంపై కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్అంగీకరించిన నేపథ్యంలో... 

పదేళ్ల పంచాయితీకి పరిష్కారం

విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే 

రేవంత్తో చర్చల్లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం: బాబు 

పదేళ్లుగా పరిష్కారంకాని పంపకాలపై ప్రధానంగా దృష్టి 

ఆస్తుల విభజన, విద్యుత్బకాయి, జల వాటాలే అజెండా 

షెడ్యూల్‌ 9లోని 89 సంస్థల విలువ 1,63,122 కోట్లు 

ఏపీకి రావాల్సిన విద్యుత్బకాయిలు రూ.7,703 కోట్లు 

వడ్డీని తీసేసి అసలైనా చెల్లించాలంటున్న ఏపీ 

రెండు రాష్ట్రాల మధ్య తెగని ఉద్యోగుల బదిలీ అంశం 

కృష్ణాజలాల వాటాల వివాదానికి ఇకపైనా తెర పడేనా

విభజన జరిగిన పదేళ్లలో సీఎంల భేటీ ఇదే తొలిసారి 

చంద్రబాబు చొరవతో పడిన తొలి అడుగు 

 

హైదరాబాద్ప్రజాభవన్లో రేవంత్తో చర్చలు 

(అమరావతి - ఆంధ్రజ్యోతి

పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు ఇకనైనా పరిష్కారమవుతాయా

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి మధ్య చర్చలు సానుకూల ఫలితాలు లభిస్తాయా

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! పెండింగ్అంశాల పరిష్కారంపై కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్అంగీకరించిన నేపథ్యంలో... హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రులిరువురూ భేటీ కానున్నారు. విభజన అంశాలే అజెండాగా సమావేశం జరగనుంది. ఇందులో మూడు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవి... 

1.   విభజన చట్టం షెడ్యూల్‌ 9లో ఉన్న 91 సంస్థలు, షెడ్యూల్పరిధిలో ఉన్న 142 సంస్థలు, విభజన చట్టంలో ప్రస్తావనకు రాని 12 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన

2.   విద్యుత్బకాయిలు.

3.   జల పంపకాలు

 

ఆస్తుల పంచాయితీ.. 

విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లోని 91 సంస్థలో ఎస్సీసీఎల్‌, ఏపీఎ్సఎ్ఫసీల విభజన కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. మిగిలిన 89 సంస్థల ఆస్తుల విలువ సుమారుగా (భూములు, భవనాలు) రూ.1,06,199 కోట్లు (ఏపీ వాటా రూ.46,949 కోట్లు, తెలంగాణ 35,231 కోట్లు, హెడ్క్వార్టర్స్రూ.24019 కోట్లు), చరాస్తులు రూ.9,893, యంత్రాలు, ఇతర పరికరాలు రూ.39,421 కోట్లు, బ్యాంకు ఖాతాల్లో, ఎఫ్డీల్లో ఉన్న సొమ్ము -రూ.7,609 కోట్లు (ఏపీ- 3,588 కోట్లు, తెలంగాణ రూ.3049 కోట్లు, ఫ్రోజెన్‌-రూ.972 కోట్లు ). ఇవి మొత్తం రూ.1,63,122 కోట్లు.. హెడ్క్వార్టర్స్లో ఉన్న ఆస్తుల్లో 6%అంటే రూ.1,463 కోట్లు విలువైనవి ఏపీలో, మిగిలిన 94 శాతం అంటే, రూ.22,556 కోట్ల విలువైనవి తెలంగాణలో ఉన్నాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం 58%,(రూ.14,002కోట్లు) క్లెయిమ్చేయగా, షీలా భిడే నిపుణుల కమిటీ రూ.7,127 కోట్లు(30%) మాత్రమే ఏపీ కోసం సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 88% (రూ.21,028 కోట్లు) క్లెయిమ్చేయగా నిపుణుల కమిటీ రూ.16,891 కోట్లు(70%) సిఫారసు చేసింది

కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల్లో 68% సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 2019 అక్టోబరులో అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వం మొత్తం 89 సంస్థల విభజనకు అంగీకారం తెలిపింది

ఎస్సీసీఎల్‌(సింగరేణి కాలరీస్కంపెనీ లిమిటెడ్‌) విభజన సమస్య, ఏపీ స్టేట్పైనాన్షియల్సర్వీసెస్విభజన సమస్య కేంద్ర ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి

ఇక...ఏపీ విభజన చట్టం కిందకురాని 12 సంస్థలు సెక్షన్‌ 64 పరిధిలోకి వస్తాయి. సంస్థలను జనాభా ప్రాతిపదికన విభజించలేదు. నగదు, చరాస్థులు మాత్రమే విభజించాలని, స్థిరాస్థులు పూర్తిగా తమకే చెందుతాయని తెలంగాణ వాదిస్తోంది. కేంద్ర న్యాయశాఖను సంప్రదించాక 12 సంస్థల విభజనపై ఒక నిర్ణయం తీసుకుంటామని 2022 సెప్టెంబరు 27 జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ తెలిపింది. సమస్యపై అటార్నీ జనరల్అభిప్రాయాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలిస్తోందని 2023 మే 5 తేదీన కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. హోం శాఖ నిర్ణ యం వెల్లడించాల్సి ఉంది. షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10 లో ఉన్న సంస్థల విభజనతోపాటు ఇతర ఆస్తుల విభజన కోసం నిష్పాక్షికంగా వ్యవహరించే ఒక రిటైర్డ్సుప్రీంకోర్టు జడ్జీని నియమించాలంటూ ఏపీ ప్రభుత్వం..సుప్రీంకోర్టులో 2022లో రిట్పిటిషన్దాఖలు చేసింది. అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం; ఏపీ వేసిన పిటిషన్ప్రాథమిక హక్కులకు విరుద్ధం కావున కొట్టేయాలంటూ కేంద్రం కౌంటర్వేశాయి. వీటికి ఏపీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ అఫిడవిట్లు వేసింది. జూలై 9 అది విచారణకు రానుంది

పాత లెక్కలు తేలేనా

1.     ఏపీజెన్కో 2014 జూన్‌ 2 నుంచి 2016 జూన్‌ 10 తేదీ వరకు తెలంగాణ డిస్కమ్లకు విద్యుత్సరఫరా చేసింది. దీనికి సంబంధించి అసలు బిల్లు రూ.3,442 కోట్లు, వడ్డీ రూ.4,261 కోట్లు మొత్తం రూ.7,703 కోట్లు రావాలి. అసలు బిల్లును వాయిదాల రూపంలోనైనా తక్షణమే చెల్లింపులు చేయాలని ఏపీ కోరుకుంటోంది

2.     ప్రస్తుతం ఏపీలో ఉన్న 1888 ఉద్యోగులను తెలంగాణ కు, తెలంగాణలో ఉన్న 1447 మంది ఉద్యోగులను ఏపీకి బదిలీ చేసే అంశం కూడా పెండింగ్లో ఉంది. 

3.     తెలంగాణ సివిల్సప్లైస్కార్పొరేషన్వాడుకున్న క్యాష్క్రెడిట్పై 2024 జూన్‌ 30 నాటికి జమ అయిన వడ్డీ రూ.138 కోట్లు చెల్లించాలి. 2014-15లో క్లెయిమ్చేసిన ఆహార సబ్సిడీ రూ.842 కోట్లలో తెలంగాణ వాటా 276 కోట్లు. వ్యాట్‌, ఆర్డీ సెస్‌, లోనుపై వడ్డీని ఏపీకి తెలంగాణ చెల్లించాలి

4.     15 ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పులను రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. 

5.     షెడ్యూల్‌ 9లో ఉన్న సంస్థలకు సంబంధించి షీలా భిడే నిపుణుల కమిటీ ఇచ్చిన 89 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది

కృష్ణా జలాల విషయంలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్హయాం లో ఏరోజూ ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలో కేం ద్ర జలశక్తి మంత్రిగా ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్కమిటీ సమావేశం 2016 సెప్టెంబరు 21 జరిగింది. బచావత్ట్రైబ్యునల్కేటాయింపుల మేరకు 811 టీఎంసీలలో 512 టీఎంసీలను ఏపీ, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకోవాలని ఉమాభారతి సూచించారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో పెద్దన్న పాత్రను పోషిస్తారని ఉమాభారతి తెలిపారు. 2020 అక్టోబరు 5 కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్షెకావత్అధ్యక్షతన జరిగిన అపెక్స్కమిటీ సమావేశానికి అప్పటి ఏపీ సీఎం జగ న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్హాజరయ్యారు. సమావేశంలో ఏపీ డిమాండ్లను జగన్లేవనెత్తకపోవడంతో.. సమావేశమంతా తెలంగాణ వైపు ఏకపక్షంగా సాగింది. 

 అసలు పేచీ విషయానికి వస్తే.. 512 టీఎంసీలను ఏపీకి.. 299 టీఎంసీలు తెలంగాణకు బచావత్ట్రైబ్యునల్కేటాయించింది. కానీ, తెలంగాణ నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం.. కరువు, జనాభా ప్రాతిపదికన 70.80% జలాలను తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. కాగా, పెండింగ్లోని విభజన అంశాలపై చర్చకు సీఎం చంద్రబాబు టీసీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. బాబు లేఖకు స్పందించిన రేవంత్‌.. ఆహ్వానిస్తూ లేఖ రాశారు. 

ఇవే తెలంగాణ డిమాండ్లు

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): ప్రజా భవన్లో శనివారం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు సాగనున్నాయి. చర్చల్లో ప్రధానంగా ఆరు అంశాలు చర్చకు రానున్నట్లు టీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి... 

1.   1. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగీ తెలంగాణలో చేర్చాలి

2.   2. ఆంధ్రప్రదేశ్రాష్ర్టానికి 1000 కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (కోస్టల్కారిడార్‌) ఉంది. తెలంగాణకు తీరప్రాంతంలో భాగం కావాలి

3.   3. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలి

4.   4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి

5.   5. తెలంగాణ విద్యుత్సంస్థలకు, ఆంధ్రప్రదేశ్విద్యుత్సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది

6.   6. తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి

 

Updated Date - Jul 06 , 2024 | 04:20 AM